HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ys Jagan Is An Enemy Of Hinduism Says Janasena Mlc Nagababu In Sensational Remarks

వైఎస్ జగన్ హిందూ ద్రోహి.. జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు

  • Author : Vamsi Chowdary Korata Date : 04-02-2026 - 2:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Janasena Mlc Naga Babu
Janasena Mlc Naga Babu

Janasena Mlc Naga Babu  వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీద జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామమందిరం కడితే జగన్ కనీసం ట్వీట్ అయినా పెట్టారా అని ప్రశ్నించారు. హిందూ మతం గురించి మాట్లాడేవారికి.. అయోధ్యలో రామమందిరం గురించి తమ స్టాండ్ ఏమిటో చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు. తిరుమల డిక్లరేషన్ విషయంలోనూ జగన్‌పై నాగబాబు విమర్శలు గుప్పించారు. అబ్దుల్ కలాం కంటే జగన్ గొప్పోడా అంటూ వీడియో విడుదల చేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైనా, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైనా జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు విమర్శలు గుప్పించారు. వివిధ అంశాల మీద స్పందిస్తూ నాగబాబు సోషల్ మీడియా ద్వారా వీడియో విడుదల చేశారు. తాను సనాతన హిందువును అని చెప్పిన పవన్ కళ్యాణ్.. తన ధర్మాన్ని గౌరవిస్తూ, ఇతరులను గౌరవించకుండా బతుకుతున్నానని అన్నారు. తిరుమల డిక్లరేషన్ విషయంలో వైఎస్ జగన్ మీద విమర్శలు గుప్పించారు. కల్తీ నెయ్యి విషయం గురించి మళ్లీ మాట్లాడతానని అన్నారు.

నేను సగటు భారతీయుణ్ని, హిందువును, నాస్తికుడిని కాదు. ఆదిశంకరుల అద్వైతం, రమణ మహర్షుల ఆత్మజ్ఞానం.. ఇద్దరూ చెప్పిన నిరాకార స్వరూపమైన పరమాత్మను నమ్ముతా. హిందూ అనేది నమ్మకమో, మతమో కాదు.. ఓ జియోగ్రాఫికల్ ఐడెంటిటీ. ఆసేతు హిమాచలం నుంచి హిందూ మహాసాగరం వరకూ ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడూ హిందువే. నేను నిఖార్సైన హిందువును. నా ధర్మా్న్ని గౌరవిస్తూ , ఇతరులను కించపరచకగుండా బతుకుతున్న ప్రౌడ్ సనాతన హిందువును. ఎమ్మెల్సీగా మాట్లాడే అవకాశం రాగానే అర్చకుల చాలీచాలని జీతాల గురించి మాట్లాడా.

అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధమైతే.. ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గి అప్పటి వైసీపీ సర్కారు కేసును సీబీఐకు అప్పగిస్తామని చెప్పింది. ఆ తర్వాత సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకుంటే అసలు ఈ కేసును టేకప్ చేయలేదని సీబీఐ చెప్పింది. వైసీపీ దీని గురించి ఎప్పుడైనా మాట్లాడారా.. రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసమైతే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ కేసును నీరుగార్చారు. మీకూ, మీ నేతలకు రిలీజ్ సినిమాలకు రివ్యూలివ్వటం తప్పితే రాముడి గురించి ఎందుకు” అని నాగబాబు ప్రశ్నించారు.

అయోధ్యలోఎన్నో ఏళ్ల తర్వాత రామాలయం నిర్మాణం పూర్తి అయితే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లి దర్శించుకున్నారు. వైసీపీ నాయకుడు కనీసం ఒక ట్వీట్ అయినా, వీడియో బైట్ అయినా పెట్టారా. అసలు దీనిపై మీ స్టాండ్ ఏమిటో చెప్పారా. ఆ దమ్ముందా.. మీకు వ్యతిరేకించే ధైర్యం లేదు..అభినందించే సంస్కారం లేదు. తిరుమల శ్రీవారిని ఏడాదికి ఒకసారైనా దర్శించుకోవాలనేది హిందువుల కల. నెల నెలా డబ్బులు కూడపెట్టుకుని తిరుమలకు వెళ్తుంటారు. అలాంటిది వైసీపీ ప్రభుత్వ హయాంలో కొండ మీద వసతి ఛార్జీలు భారీగా పెంచారు. ఐదు వందలకు దొరికే రూములను వేయి, 1500లకు పెంచారు. దర్శనాలు, సేవలు ఇంకా దారుణం.

మరోవైపు తిరుమల డిక్లరేషన్ విషయంలోనూ ఎమ్మెల్సీ నాగబాబు విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు.. తన కూతురుకు డిక్లరేషన్ ఇప్పించారని నాగబాబు గుర్తు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్ ఇచ్చే వెళ్లారన్న పవన్ కళ్యాణ్.. వైఎస్ జగన్ కలాం కంటే గొప్ప వ్యక్తా అని ప్రశ్నించారు. డిక్లరేషన్ అడిగారనే కారణంతో తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న చరిత్ర వైఎస్ జగన్‌ది అంటూ నాగబాబు మండిపడ్డారు. కల్తీ నెయ్యి గురించి తర్వాత మాట్లాడతానంటూ వీడియో విడుదల చేశారు.

హిందూ ద్రోహి వైసీపీ #NoGheeInTTDLaddu@JanaSenaParty pic.twitter.com/m6qMO3q60v

— Naga Babu Konidela (@NagaBabuOffl) February 4, 2026


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh politics
  • Former CM YS Jaganmohan Reddy
  • Janasena
  • Janasena Mlc Naga Babu
  • Laddu Issue
  • naga babu
  • Tirumala Issues
  • Tirumala Laddu Issue
  • tirupati laddu issue
  • TTD Laddu issue
  • YSR Congress Party

Related News

It is because of CM Chandrababu that it is not raining: Former Minister

Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వల్లే రాష్ట్రంలో వర్షాలు పడటం లేదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) సీనియర్ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నంద్యాలలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాలు పడకపోవడానికి పాలకుల మనస్తత్వమే కారణమంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఏలుకునే రాజు మనస్తత్వం బాగుంటే

  • YS Jagan pays tribute to YSR.

    YSR: వైఎస్సార్‌కు వైఎస్‌ జగన్‌ నివాళులు

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd