Rohit Sharma: రోహిత్ శర్మకు మరో షాక్.. టీమిండియా వన్డే జట్టుకు కొత్త కెప్టెన్!
రోహిత్ ఇప్పటికే టీ20 ఇంటర్నేషనల్ నుండి రిటైర్ అయ్యాడు. గతేడాది 17 ఏళ్ల తర్వాత టీ-20 ప్రపంచకప్ను తన టీమ్ఇండియా గెలుచుకునేలా చేశాడు. అతను చివరిగా ఆగస్టులో శ్రీలంకతో వన్డే మ్యాచ్ ఆడాడు.
- By Gopichand Published Date - 10:11 AM, Fri - 3 January 25

Rohit Sharma: సిడ్నీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ సిరీస్లో చివరి మ్యాచ్లో భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఆడడం లేదు. ఈ మ్యాచ్లో ప్రస్తుత సిరీస్లోని మొదటి టెస్టులో భారత్ను విజయపథంలో నడిపించిన జస్ప్రీత్ బుమ్రా అతని స్థానంలో కెప్టెన్సీని చేపట్టాడు. దీన్ని బట్టి ఇప్పుడు టెస్టుల్లో కెప్టెన్గా రోహిత్ కనిపించడం లేదన్న విషయం స్పష్టమవుతోంది.
గతేడాది టీ20 ప్రపంచకప్ను జట్టును గెలిపించిన రోహిత్ వన్డే కెప్టెన్సీని కోల్పోవచ్చునని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఓ నివేదిక ప్రకారం.. రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో హార్దిక్ పాండ్యా భారత్కు నాయకత్వం వహించడాన్ని చూడవచ్చు. ఇప్పటి వరకు మూడు వన్డేలు, 16 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించాడు.
Also Read: Bashar al-Assad: అసద్పై విష ప్రయోగం.. పుతిన్తో వివాదామే కారణమా?
నాయకత్వ ఎంపికపై చర్చకు బీసీసీఐ సిద్ధంగా ఉంది
నివేదికల ప్రకారం.., ఫిబ్రవరిలో పాకిస్తాన్, దుబాయ్లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం నాయకత్వ ఎంపికలను చర్చించడానికి BCCI సిద్ధంగా ఉంది. రోహిత్ కెప్టెన్సీపై చర్చ జరిగితే ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను ఈ పదవికి ఎంపిక చేయవచ్చు. హార్దిక్కి ఇప్పటికే రెండు వైట్బాల్ ఫార్మాట్లలో కెప్టెన్గా వ్యవహరించిన అనుభవం ఉంది.
ఇది కాకుండా రోహిత్ ఇప్పటికే టీ20 ఇంటర్నేషనల్ నుండి రిటైర్ అయ్యాడు. గతేడాది 17 ఏళ్ల తర్వాత టీ-20 ప్రపంచకప్ను తన టీమ్ఇండియా గెలుచుకునేలా చేశాడు. అతను చివరిగా ఆగస్టులో శ్రీలంకతో వన్డే మ్యాచ్ ఆడాడు. అయితే టీ20ల నుంచి రిటైర్ అయిన రోహిత్ శర్మ టెస్టులకు కూడా గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే సిడ్నీలో ఆసీస్తో జరుగుతున్న చివరి మ్యాచ్కు ఆయన గైర్హజరీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేలకు కూడా రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఊహగానాలు మొదలయ్యాయి.