బుమ్రా క్యాచ్ పట్టడంతో ఎగిరి గంతేసిన సాక్షి..ధోనీ రియాక్షన్ చూస్తే నవ్వులే
- Author : Vamsi Chowdary Korata
Date : 06-03-2026 - 11:46 IST
Published By : Hashtagu Telugu Desk
MS Dhoni’s Reaction To Wife Sakshi టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో మైదానంలో ఆటగాళ్లు ఎంత టెన్షన్ పడ్డారో, గ్యాలరీలోనూ అంతే ఉత్కంఠ నెలకొంది. అయితే, ఈ ఉత్కంఠ మధ్య జరిగిన ఓ సరదా సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన భార్య సాక్షి అత్యుత్సాహాన్ని తనదైన ‘కూల్’ స్టైల్లో కంట్రోల్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ క్షణాల్లో వైరల్గా మారింది.
ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన ఈ కీలక మ్యాచ్ను వీక్షించేందుకు ధోనీ తన భార్య సాక్షితో కలిసి హాజరయ్యాడు. వీరితో పాటు 2024 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ, అతని భార్య రితికా సజ్దే కూడా వీఐపీ బాక్స్లో ఉన్నారు. భారత్ నిర్దేశించిన 253 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఛేదిస్తున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో 18వ ఓవర్ వేసిన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో బ్యాటర్ సామ్ కరన్ బంతిని బలంగా నేరుగా బౌలర్ వైపు కొట్టాడు. బుమ్రా ఆ బంతిని తన ఫాలో త్రూలో ఆపాడు. అయితే, వీఐపీ స్టాండ్స్ నుంచి చూస్తున్న సాక్షి, అది అద్భుతమైన క్యాచ్ అని పొరబడ్డారు. కీలక వికెట్ పడిందనే ఆనందంలో ఆమె వెంటనే సీట్లో నుంచి లేచి గట్టిగా అరుస్తూ సంబరాలు మొదలుపెట్టారు.
वानखेड़े स्टेडियम मुम्बई में #T20WorldCup2026 खेल की एक झलक।
पूर्व भारतीय क्रिकेट टीम के कैप्टन M S धोनी की पत्नी साक्षी एक डाट बाॅल पर खुशी से उछल पड़ी!
#INDvsENG pic.twitter.com/OcR1uXaReo— अनिल त्रिपाठी #दीप✍️ (@deep4538anil) March 5, 2026
అయితే, బంతి క్యాచ్ పట్టేలోపే నేలను తాకిందని గ్రహించిన ధోనీ, వెంటనే స్పందించాడు. ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటున్న తన భార్య వైపు తిరిగి, చేతితో సైగ చేస్తూ ప్రశాంతంగా కూర్చోవాలని సూచించాడు. ధోనీ ఈ రియాక్షన్తో పక్కనున్న వారంతా నవ్వారు. ఈ ఫన్నీ మూమెంట్కు సంబంధించిన క్లిప్ కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘కెప్టెన్ కూల్’ మరోసారి తన ప్రశాంతతను నిరూపించుకున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి ఉత్కంఠభరితమైన మ్యాచ్లో జరిగిన ఈ చిన్న సరదా సంఘటన, ఆటలోని ఒత్తిడిని మరిపించి అందరి ముఖాల్లో నవ్వులు పూయించింది.