IND vs AFG: రోహిత్ పరుగుల వరద..121 పరుగులతో విధ్వంసం
- By Praveen Aluthuru Published Date - 10:58 PM, Wed - 17 January 24
IND vs AFG: అఫ్గానిస్థాన్తో జరిగిన మూడో టీ20లో రోహిత్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు బెంగుళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో హిట్ మ్యాన్ మరోసారి తన బ్యాటింగ్ ప్రతాపం చూపించాడు. కేవలం 69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 121 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఈ సెంచరీతో రోహిత్ అంతర్జాతీయ టీ20ల్లో ఐదో శతకం నమోదు చేశాడు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్, గ్లెన్ మాక్స్వెల్ రికార్డులను బద్దలు కొట్టాడు. పొట్టి ఫార్మెట్లో సూర్య 4 సెంచరీలు, గ్లెన్ మాక్స్వెల్ 4 సెంచరీలు నమోదు చేశారు.
టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 212 పరుగులు చేసింది. 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన టీమిండియాను రోహిత్ శర్మ, రింకు సింగ్ కలిసి ఆదుకున్నారు. అగ్నికి వాయువు తోడైనట్టు రోహిత్ శర్మకు రింకూ సింగ్ జతకలవడంతో టీమిండియా స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. రోహిత్ సెంచరీతో విధ్వంసం సృష్టిస్తే మరో ఎండ్ లో 39 బంతుల్లో 2 ఫోర్లు 6 సిక్సర్లతో 69 పరుగులు చేసి రింకు సింగ్ అజేయంగా నిలిచాడు.
Already loving this duo Rohit Sharma and Rinku Singh. Crazy partnership. pic.twitter.com/4ALTLaLBEn
— R A T N I S H (@LoyalSachinFan) January 17, 2024
తొలి రెండు మ్యాచ్ ల్లో రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. చివరి మ్యాచ్ లో మాత్రం ఊచకోత కోశాడు. ఓ దశలో రోహిత్ క్రీజులో ఉన్నప్పుడు ఎలాంటి బౌలింగ్ చేయాలో అర్ధం కాక ఆఫ్ఘన్ బౌలర్లు తలలు పట్టుకున్నారు. ఓ దిక్కు రోహిత్ విధ్వంసానికి రింకు బ్యాటింగ్ ఝళిపిస్తుండటంతో స్టేడియం హోరెత్తింది.
Also Read: IND vs AFG: రోహిత్ పరుగుల వరద..121 పరుగులతో విధ్వంసం
Related News
200 Sixes in IPL: ఐపీఎల్ లో వేగంగా 200 సిక్సర్లు బాదిన సంజూ
ఐపీఎల్లో అత్యంత వేగంగా 200 సిక్సర్లు బాదిన ఆటగాడిగా సంజూ శాంసన్ రికార్డు సృష్టించాడు. ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ వంటి భారతీయుల రికార్డును సంజూ శాంసన్ బద్దలు కొట్టాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా 200 సిక్సర్లు బాదిన భారత ఆటగాడు సంజూ శాంసన్.