Ravindra Jadeja: టీమిండియా స్టార్ ప్లేయర్ జడేజాకు హ్యాండిచ్చిన బీసీసీఐ..!
పంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్లు, ఆల్ రౌండర్లలో ఒకరైన రవీంద్ర జడేజా (Ravindra Jadeja) శ్రీలంకతో వన్డే జట్టులో చోటు దక్కలేదు.
- By Gopichand Published Date - 12:00 PM, Fri - 19 July 24

Ravindra Jadeja: భారత జట్టు ఇప్పుడు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. దీనికి సంబంధించి బీసీసీఐ టీమిండియాను ప్రకటించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరోసారి మైదానంలోకి రానున్నారు. వన్డే జట్టు కమాండ్ రోహిత్ శర్మకు, టీ20 జట్టు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్కు బాధ్యతలు అప్పగించారు. ఈ పర్యటనలో గౌతమ్ గంభీర్ తన ప్రస్థానాన్ని ప్రారంభించబోతున్నాడు. జట్టును వెల్లడించిన తర్వాత అభిమానులు చాలా ఆశ్చర్యపోయారు. వన్డే జట్టు చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ను జట్టు నుంచి తప్పించారు.
రవీంద్ర జడేజాకు చోటు దక్కలేదు
ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్లు, ఆల్ రౌండర్లలో ఒకరైన రవీంద్ర జడేజా (Ravindra Jadeja) శ్రీలంకతో వన్డే జట్టులో చోటు దక్కలేదు. జడేజా T20 ప్రపంచ కప్ 2024లో టీమ్ ఇండియాలో భాగంగా ఉన్నాడు. ఆ తర్వాత జడేజా T20 అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాడు. అయితే జడేజా టీమ్ ఇండియా తరఫున వన్డే, టెస్టు క్రికెట్లో కొనసాగనున్నాడు. ఇప్పుడు శ్రీలంక పర్యటనలో వన్డే జట్టులో భాగమవుతాడని జడ్డూ అభిమానులు ఆశించారు. అయితే BCCI జడేజాను మినహాయించి అభిమానులకు షాక్ ఇచ్చింది.
Also Read: Shreyas Iyer: టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రేయస్ అయ్యర్.. శ్రీలంకపై రికార్డు ఎలా ఉందంటే..?
ఈ ఆల్ రౌండర్లకు అవకాశం
వన్డే సిరీస్లో శ్రీలంక పర్యటనకు జడేజా స్థానంలో నలుగురు ఆల్రౌండర్లపై బీసీసీఐ విశ్వాసం వ్యక్తం చేసింది. ఇందులో శివమ్ దూబే, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. జింబాబ్వే పర్యటనలో పరాగ్, సుందర్, శివమ్ దూబేలకు అవకాశం దక్కిన విషయం తెలిసిందే. ఈ సిరీస్లో వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబేల ప్రదర్శన బాగుంద. కానీ రియాన్ పరాగ్ నిరాశపరిచాడు. ఆ తర్వాత పరాగ్ని ఈ టూర్ నుంచి తప్పిస్తారని భావించారు కానీ వన్డేతో పాటు రియాన్ పరాగ్ని కూడా టీ20 సిరీస్లో కూడా చేర్చారు.
We’re now on WhatsApp. Click to Join.
భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.