Shreyas Iyer: టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రేయస్ అయ్యర్.. శ్రీలంకపై రికార్డు ఎలా ఉందంటే..?
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సెలక్షన్ కమిటీ ఈ పర్యటనలో శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer)కు అవకాశం కల్పించింది.
- By Gopichand Published Date - 11:47 PM, Thu - 18 July 24

Shreyas Iyer: ఈ నెల చివరి వారంలో టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. భారత్-శ్రీలంక మధ్య వన్డే, టీ20 సిరీస్లు జరగాల్సి ఉంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సెలక్షన్ కమిటీ ఈ పర్యటనలో శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer)కు అవకాశం కల్పించింది. అయ్యర్ చాలా కాలంగా భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు అతను వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. దీంతో పాటు బీసీసీఐ వార్షిక కాంట్రాక్టును కూడా పొందినట్లు వార్తలు వస్తున్నాయి.
‘ఇండియన్ ఎక్స్ప్రెస్’లో ఒక వార్త ప్రకారం.. శ్రేయాస్ అయ్యర్ భారత వన్డే జట్టులో చోటు సంపాదించవచ్చని ముందే పేర్కొంది. అంతేకాకుండా బీసీసీఐ త్వరలో అతనిని వార్షిక కాంట్రాక్ట్లో చేర్చవచ్చని తెలిపింది. అయ్యర్ 2023 డిసెంబర్లో టీమిండియా తరపున తన చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. టీమిండియాతో కలిసి దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాడు. ఈ పర్యటనలో అయ్యర్ ఒక వన్డే మ్యాచ్ మాత్రమే ఆడి 52 పరుగులు చేశాడు. అయితే ఇప్పుడు మరోసారి పునరాగమనం చేశాడు.
Also Read: Bank Holidays: ఆగస్టు నెలలో బ్యాంకులకు సెలవులివే.. జాబితా ఇదిగో..!
ఇప్పటి వరకు శ్రేయాస్ అయ్యర్ రికార్డును పరిశీలిస్తే.. 59 వన్డే మ్యాచ్లు ఆడాడు. ఈ సమయంలో అయ్యర్ టీమ్ ఇండియా తరఫున 2383 పరుగులు చేశాడు. అయ్యర్ 5 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు చేశాడు. వన్డేల్లో అతని అత్యుత్తమ స్కోరు 128 పరుగులు. అయ్యర్ భారత్ తరఫున 51 టీ20 మ్యాచ్లు ఆడాడు. అతను 1104 పరుగులు చేశాడు. ఈ సమయంలో 8 అర్ధ సెంచరీలు సాధించాడు.
శ్రీలంకపై శ్రేయాస్ అయ్యర్ వన్డే రికార్డును పరిశీలిస్తే.. అతను 7 మ్యాచ్లు ఆడాడు. శ్రీలంకపై వన్డేల్లో 338 పరుగులు చేశాడు. ఈ కాలంలో అయ్యర్ 3 అర్ధ సెంచరీలు సాధించాడు. అతని అత్యుత్తమ స్కోరు 88 పరుగులు. అయితే అయ్యర్ ఇప్పటి వరకు శ్రీలంకలో కేవలం 2 వన్డేలు మాత్రమే ఆడగలిగాడు. ఈ సమయంలో అతను 14 పరుగులు మాత్రమే చేశాడు. అయితే అతనికి మరోసారి టీమిండియాలో అవకాశం దక్కింది.
We’re now on WhatsApp. Click to Join.
భారత వన్డే జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.