ఐపీఎల్లో మలింగను వెనక్కి నెట్టిన జడేజా!
రవీంద్ర జడేజా 2008లో ఐపీఎల్ తొలి సీజన్లో ఛాంపియన్గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టులో సభ్యుడు. ఆ తర్వాత 2012లో సీఎస్కేలో చేరి ఎంఎస్ ధోనీ నాయకత్వంలో కీలక ఆటగాడిగా ఎదిగాడు.
- Author : Gopichand
Date : 31-03-2026 - 8:29 IST
Published By : Hashtagu Telugu Desk
Ravindra Jadeja: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన మొదటి మ్యాచ్లోనే అద్భుత ప్రదర్శన చేశాడు. మార్చి 30న తన పాత జట్టు చెన్నై సూపర్ కింగ్స్పై జరిగిన మ్యాచ్లో జడేజా రెండు కీలక వికెట్లు పడగొట్టి, ఐపీఎల్ చరిత్రలో ఒక పెద్ద రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజ బౌలర్ లసిత్ మలింగ రికార్డును ఆయన అధిగమించాడు.
మలింగను వెనక్కి నెట్టిన జడేజా
గువాహటి వేదికగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో జడేజా ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో జడేజా ఇప్పుడు 9వ స్థానానికి చేరుకున్నాడు. ఈ మ్యాచ్లో శివమ్ దూబే, సర్ఫరాజ్ ఖాన్లను అవుట్ చేయడం ద్వారా జడేజా తన వికెట్ల సంఖ్యను పెంచుకున్నాడు.
జడేజా ఐపీఎల్ గణాంకాలు: 255 మ్యాచ్ల్లో 172 వికెట్లు (సగటు: 30.26).
లసిత్ మలింగ: 170 వికెట్లు.
ప్రస్తుతం ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా యుజ్వేంద్ర చాహల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
Also Read: అమెరికా-ఇరాన్ యుద్ధం.. తిరగబడ్డ ట్రంప్ వ్యూహం!
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన టాప్-10 బౌలర్లు
- యుజ్వేంద్ర చాహల్- 221
- భువనేశ్వర్ కుమార్- 198
- సునీల్ నరైన్- 192
- పీయూష్ చావ్లా- 192
- రవిచంద్రన్ అశ్విన్- 187
- జస్ప్రీత్ బుమ్రా- 183
- డ్వేన్ బ్రావో- 183
- అమిత్ మిశ్రా- 174
- రవీంద్ర జడేజా- 172
- లసిత్ మలింగ- 170
తిరిగి సొంతగూటికి జడేజా
రవీంద్ర జడేజా 2008లో ఐపీఎల్ తొలి సీజన్లో ఛాంపియన్గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టులో సభ్యుడు. ఆ తర్వాత 2012లో సీఎస్కేలో చేరి ఎంఎస్ ధోనీ నాయకత్వంలో కీలక ఆటగాడిగా ఎదిగాడు. 2018, 2021, 2023లలో సీఎస్కే టైటిల్ గెలవడంలో జడేజా ప్రధాన పాత్ర పోషించాడు. అయితే ఐపీఎల్ 2026 వేలానికి ముందు జరిగిన భారీ ట్రేడింగ్లో జడేజా తిరిగి రాజస్థాన్కు వచ్చాడు. అదే సమయంలో సామ్ కరన్ కూడా ఆర్ఆర్ లో చేరగా, సంజూ శాంసన్ సీఎస్కే జట్టులోకి వెళ్లాడు.
రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం
ఐపీఎల్ 2026 మూడవ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్ల ధాటికి 57 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే జేమీ ఓవర్టన్ (43), కార్తీక్ శర్మ (18), సర్ఫరాజ్ ఖాన్ (17) రాణించడంతో సీఎస్కే 127 పరుగులు చేయగలిగింది.
అనంతరం లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ వీరవిహారం చేశాడు. కేవలం 17 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 52 పరుగులు సాధించాడు. యశస్వి జైస్వాల్ 38 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు సులభమైన విజయాన్ని అందించాడు.