Rajat Patidar: కోహ్లీ స్థానంలో ఆడే ఆటగాడు ఇతనే.. యంగ్ ప్లేయర్కి ఛాన్స్ ఇచ్చిన బీసీసీఐ..!
కోహ్లీ స్థానంలో ఆడే ఆటగాడి పేరుని బీసీసీఐ విడుదల చేసింది. కోహ్లీ స్థానంలో ఐపీఎల్ స్టార్ ఆటగాడు రజత్ పాటిదార్ (Rajat Patidar) జట్టులోకి వచ్చాడు.
- By Gopichand Published Date - 10:24 AM, Wed - 24 January 24
Rajat Patidar: భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్కు సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సిరీస్ ప్రారంభానికి ముందే తొలి రెండు మ్యాచ్ల జట్టు నుంచి తన పేరును ఉపసంహరించుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీ స్థానంలో ఏ ఆటగాడిని జట్టులోకి తీసుకుంటారనే చర్చ చాలా రోజులుగా సాగుతోంది. ఇప్పుడు కోహ్లీ స్థానంలో ఆడే ఆటగాడి పేరుని బీసీసీఐ విడుదల చేసింది. కోహ్లీ స్థానంలో ఐపీఎల్ స్టార్ ఆటగాడు రజత్ పాటిదార్ (Rajat Patidar) జట్టులోకి వచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో పాటిదార్ను జట్టులోకి తీసుకోగలగడం కంటే మెరుగైన ఎంపిక మరొకటి ఉంటుందా అనేది పెద్ద ప్రశ్న. పాటిదార్కి మాత్రమే జట్టులో ఎందుకు చోటు దక్కింది? అని మరికొందరు ఆలోచనలో పడ్డారు.
ఈ సిరీస్లో భాగంగా జనవరి 25 నుంచి హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ జట్టులో ఉండడు. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీ స్థానంలో పాటిదార్ జట్టులోకి వచ్చాడు. అయితే ముందుగా ఛెతేశ్వర్ పుజారాను జట్టులోకి తీసుకుంటారని అనుకున్నారు. పుజారా ఇటీవల రంజీలో 243 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. దీని తర్వాత అతడికి జట్టులో చోటు దక్కుతుందనే ఊహాగానాలు వచ్చినా మరోసారి పుజారాకు నిరాశ తప్పలేదు. కోహ్లీ స్థానంలో పాటిదార్ను జట్టులోకి తీసుకున్నారు.
Also Read: Bopanna: చరిత్ర సృష్టించిన భారత టెన్నిస్ స్టార్ రోహన్ బొపన్న
రజత్ పాటిదార్ అద్భుత ఫామ్లో ఉన్నాడు. పాటిదార్ ఇటీవల ఇండియా ఎ తరఫున ఆడుతూ ఇంగ్లండ్ లయన్స్తో జరిగిన అనధికారిక టెస్ట్ మ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో మొదటి మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్లో పాటిదార్ 151 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ను చేశాడు. విశేషమేమిటంటే పాటిదార్ కేవలం 158 బంతుల్లోనే 151 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుండి 19 ఫోర్లు, 5 సిక్సర్లు కూడా వచ్చాయి. ఏది ఏమైనా ప్రస్తుత కాలంలో యువ ఆటగాళ్లు జట్టులోకి రావాలని టీమ్ మేనేజ్మెంట్ చూస్తోంది. అందుకే ప్రయోగాలు చేస్తుంది. ఈ కారణంగానే కోహ్లీ స్థానంలో పుజారాకు బదులు పాటిదార్ను జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
Related News
Kohli Strike Rate: కోహ్లీపై విమర్శకులకు ఇచ్చి పడేసిన ఏబీడీ
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి తన ఆట తీరుతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. టీ20 ఫార్మాట్కు తన స్ట్రైక్రేట్ సరిపోదని కొందరు మాజీ ఆటగాళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి కోహ్లీ ఈ సీజన్ ఐపీఎల్ లో ఇప్పటికే 500 పరుగులు చేశాడు. బెంగళూరు భారీ స్కోరు చేయడంలోనూ కీలకపాత్ర పోషించాడు