Pallekele Cricket Stadium: పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో టీమిండియా, పాకిస్తాన్ రికార్డు ఎలా ఉందంటే..?
పాకిస్థాన్తో జరిగే మ్యాచ్తో భారత జట్టు ఆసియా కప్ ప్రారంభించనుంది. సెప్టెంబర్ 2న క్యాండీ వేదికగా పల్లెకెలె క్రికెట్ స్టేడియం (Pallekele Cricket Stadium)లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.
- By Gopichand Published Date - 06:52 AM, Wed - 30 August 23
Pallekele Cricket Stadium: పాకిస్థాన్తో జరిగే మ్యాచ్తో భారత జట్టు ఆసియా కప్ ప్రారంభించనుంది. సెప్టెంబర్ 2న క్యాండీ వేదికగా పల్లెకెలె క్రికెట్ స్టేడియం (Pallekele Cricket Stadium)లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మైదానంలో భారత జట్టు ప్రదర్శన ఎలా ఉంది? క్యాండీలో భారత జట్టు గణాంకాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మైదానంలో భారత జట్టు ఇప్పటి వరకు 3 మ్యాచ్లు ఆడింది.
పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో టీమిండియాదే పైచేయి
క్యాండీలోని పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో భారత జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ మైదానంలో టీమ్ ఇండియా రికార్డు 100%గా ఉంది. క్యాండీలోని పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో భారత జట్టు 3 మ్యాచ్లు ఆడగా.. మూడు మ్యాచ్ల్లోనూ భారత జట్టు విజయం సాధించింది. ఈ మైదానంలో భారత జట్టు అత్యధిక స్కోరు 294 పరుగులు. ఈ మైదానంలో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి విజయం సాధించింది. కాగా ప్రత్యర్థి జట్టు 2 సార్లు పరుగుల ఛేజింగ్లో ఓడిపోయింది.
Also Read: Bat At No.4: ఓపెనర్లు వారే.. మరి నాలుగులో ఎవరు..?
పాకిస్థాన్ రికార్డు ఎలా ఉందంటే..?
మరోవైపు క్యాండీలోని పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్ జట్టు గణాంకాలను పరిశీలిస్తే చెప్పుకోదగిన విధంగా లేదు. ఈ మైదానంలో ఇప్పటి వరకు పాక్ జట్టు 5 వన్డేలు ఆడింది. ఈ 5 మ్యాచ్ల్లో పాకిస్థాన్ 2 మ్యాచ్ల్లో విజయం సాధించగా, 3 మ్యాచ్ల్లో ఓటమి చవిచూసింది. క్యాండీలోని పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్ అత్యధిక స్కోరు 287 పరుగులు. క్యాండీ మైదాన్లోని పల్లెకెలె క్రికెట్ స్టేడియం గురించి మాట్లాడుకుంటే.. 2009 సంవత్సరంలో ఈ మైదానంలో మొదటి మ్యాచ్ జరిగింది. ఈ మైదానంలో ఇప్పటి వరకు 33 వన్డేలు, 23 టీ20 మ్యాచ్లు, 9 టెస్టు మ్యాచ్లు జరిగాయి.
Related News
Virat Kohli Record: T20 ప్రపంచ కప్ గేమ్ల్లో కోహ్లీ రికార్డులు ఇవే.. లెక్కలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
కొద్ది రోజుల క్రితం విరాట్ కోహ్లీ స్లో స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడని ట్రోల్ చేశారు. ఇటీవల 67 బంతుల్లోనే సెంచరీ చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యంత స్లో సెంచరీ సాధించిన ఘనత కోహ్లిదే.