India-Pakistan: ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ రద్దు.. ఏ జట్టుకి ప్లస్ అయ్యింది..?
2023 ఆసియా కప్లో భారత్-పాకిస్థాన్ (India-Pakistan) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 266 పరుగులకు ఆలౌటైంది.
- By Gopichand Published Date - 11:44 AM, Sun - 3 September 23
India-Pakistan: 2023 ఆసియా కప్లో భారత్-పాకిస్థాన్ (India-Pakistan) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 266 పరుగులకు ఆలౌటైంది. అయితే ఆ తర్వాత వర్షం కారణంగా పాక్ జట్టు బ్యాటింగ్కు దిగలేకపోయింది. భారత్ టాప్ బ్యాటింగ్ ఆర్డర్ దారుణంగా పతనమైంది. పల్లెకల్లో పాకిస్థాన్ విజయం సాధించాలంటే 267 పరుగులు చేయాల్సి ఉంది. జట్టు గత ప్రదర్శనను పరిశీలిస్తే, ఈ లక్ష్యం వారికి పెద్దదేమి కాదు.
భారత్తో మ్యాచ్ పాకిస్థాన్కు అనుకూలంగా మారే అవకాశం ఉంది. కానీ వర్షం భారత ఆటగాళ్ల గౌరవాన్ని కాపాడింది. టోర్నీలో పాకిస్థాన్ తన తొలి మ్యాచ్లో అద్భుత ప్రదర్శన కనబరిచింది. నేపాల్పై 342 పరుగులు చేసింది. ఈ సమయంలో బాబర్ అజామ్ 151 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇఫ్తికార్ అహ్మద్ 109 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత్పై పాక్ బ్యాట్స్మెన్ దూకుడుగా బ్యాటింగ్ చేసేవారు. కానీ వర్షం మ్యాచ్ని పూర్తి చేసేందుకు అనుమతించలేదు.
Also Read: ODI World Cup 2023: వన్డే వరల్డ్ కప్ కోసం భారత్ జట్టు ఎంపిక.. బరిలోకి దిగే జట్టు ఇదేనా..?
పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్లో బలమైన ఆటగాళ్లు ఉన్నారు. జట్టు ఓపెనర్లు ఫకర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్ చాలా సందర్భాలలో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లు ఆడారు. మహ్మద్ రిజ్వాన్ కూడా ప్రమాదకరమైన బ్యాటింగ్ చేస్తాడు. ఈ ఆటగాళ్లు భారత్పై తమ సత్తా చూపేవారు.
పాక్ బౌలింగ్ ఎటాక్ టీమ్ ఇండియాను పూర్తిగా శాసించడం గమనార్హం. షాహీన్ అఫ్రిది 10 ఓవర్లలో 35 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతను 2 మెయిడిన్ ఓవర్లు తీసుకున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వికెట్లను షాహీన్ తీశాడు. నసీమ్ షా 8.5 ఓవర్లలో 36 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. హరీస్ రవూఫ్ 9 ఓవర్లలో 58 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఆఘా సల్మాన్ కూడా బాగా బౌలింగ్ చేశాడు. వికెట్లు పడకపోయినా.. సల్మాన్ 4 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చాడు.
Related News
ICC Rankings: టెస్టుల్లో నంబర్ ర్యాంక్ కోల్పోయిన టీమిండియా …
అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ శుక్రవారం మూడు ఫార్మాట్ల (టెస్ట్, వన్డే మరియు టి20 ఇంటర్నేషనల్) వార్షిక ర్యాంకింగ్లను విడుదల చేసింది. ఇందులో భారత జట్టు టెస్టు నంబర్-1 స్థానాన్ని కోల్పోయింది.