India in Asia Cup: ఆసియా కప్ టోర్నీలో టీమిండియాదే పైచేయి.. ఇప్పటివరకు 7 సార్లు ఛాంపియన్గా నిలిచిన భారత్..!
ఇప్పటి వరకు ఈ టోర్నీలో టీమ్ ఇండియా (India in Asia Cup) అద్భుతమైన రికార్డులను నమోదు చేసింది. ఈసారి కూడా టోర్నీలో భారత్దే పైచేయి. ఇప్పటి వరకు టోర్నీలో టీమ్ ఇండియా 7 సార్లు ఛాంపియన్గా నిలిచింది.
- By Gopichand Published Date - 08:56 AM, Wed - 19 July 23
India in Asia Cup: ఆసియా కప్ 2023 షెడ్యూల్ నేడు విడుదల కానుంది. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించనున్నారు. ఈ టోర్నీ పాకిస్థాన్, శ్రీలంకలో నిర్వహించనున్నారు. ఆగస్టు 31 నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో టీమ్ ఇండియా (India in Asia Cup) అద్భుతమైన రికార్డులను నమోదు చేసింది. ఈసారి కూడా టోర్నీలో భారత్దే పైచేయి. ఇప్పటి వరకు టోర్నీలో టీమ్ ఇండియా 7 సార్లు ఛాంపియన్గా నిలిచింది. అదే సమయంలో పాకిస్తాన్ 2 సార్లు మాత్రమే ఛాంపియన్గా నిలిచింది.
ఆసియా కప్ 2023 షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. మీడియా నివేదికల ప్రకారం.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కారణంగా జాప్యం జరిగింది. అయితే ఈ టోర్నీ షెడ్యూల్ నేడు విడుదల కానుంది. ఇప్పటి వరకు ఈ టోర్నీ రికార్డును పరిశీలిస్తే.. ఇందులో టీమిండియాదే పైచేయి. భారత జట్టు 14 సార్లు టోర్నీలో పాల్గొనగా 7 సార్లు ఛాంపియన్గా నిలిచింది. అదే సమయంలో శ్రీలంక జట్టు 6 సార్లు ఛాంపియన్గా నిలిచింది. పాకిస్థాన్ జట్టు 2 సార్లు ఛాంపియన్గా నిలిచింది. కాగా బంగ్లాదేశ్ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. ఈసారి కూడా భారత్దే పైచేయి కావచ్చు.
Also Read: Asia Cup Schedule: గెట్ రెడీ.. నేడు ఆసియా కప్ 2023 షెడ్యూల్ విడుదల..!
1984లో భారత్ తొలిసారిగా ఆసియా కప్ టైటిల్ను గెలుచుకుంది. ఇది వన్డే ఫార్మాట్లో జరిగింది. ఆ తర్వాత 1986లో శ్రీలంక గెలిచింది. దీని తర్వాత టీమ్ ఇండియా వరుసగా మూడుసార్లు టైటిల్ గెలుచుకుంది. టీమిండియా 1988, 1990-91,1995లో టైటిల్ గెలుచుకుంది. పాకిస్థాన్ క్రికెట్ జట్టు తొలిసారి 2000 సంవత్సరంలో ఛాంపియన్గా నిలిచింది. ఆ తర్వాత 2012లో గెలిచారు. పాకిస్థాన్ సాధించిన ఈ రెండు విజయాలు వన్డే ఫార్మాట్లోనే ఉన్నాయి. గత ఎడిషన్ ఆసియా కప్లో శ్రీలంక జట్టు ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్లో 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈసారి టీమ్ ఇండియా మిగతా జట్లకు గట్టి పోటీ ఇవ్వగలదు. భారత్ జట్టుని ఓడించడం ఏ జట్టుకైనా అంత సులభం కాదు.
Related News
Champions Trophy 2025: పాకిస్తాన్లో పర్యటించనున్న భారత్.. రహస్యంగా ఉంచాలని కోరిన ఐసీసీ..!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు క్వాలిఫైయింగ్ మ్యాచ్లన్నీ ఒకే నగరంలో జరగాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అంటే ICCకి సూచించింది.