HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Cm Revanth Reddy Will Attend India Vs England 1st Test At Uppal

IND vs ENG 1st Test: భారత్-ఇంగ్లాండ్ టెస్టుకు సీఎం రేవంత్ హాజరు

భారత్-ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్ కోసం దిగ్గజ ఆటగాళ్లతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్టుగా హాజరవుతారు. ఉప్పల్ టెస్ట్‌కు చీఫ్ గెస్ట్‌గా రేవంత్ రెడ్డి , సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ తదితరులు హాజ‌రుకానున్నారు.

  • Author : Praveen Aluthuru Date : 20-01-2024 - 3:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
IND vs ENG 1st Test
IND vs ENG 1st Test

IND vs ENG 1st Test: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. దావోస్ వెళ్లిన రేవంత్ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా తెలంగాణకు వేలకోట్ల పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ పలు సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 40 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన అనంతరం హైదరాబాద్ వేదికగా జరగనున్న భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ జరిగే తొలి టెస్టుకు హాజరవుతారు. ఈ విషయాన్నీ హైదరాబాద్ క్రికెట్ బోర్డు HCA తెలిపింది.

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. మరో కీలక సమరానికి సిద్ధమవుతోంది. భారత్ , ఇంగ్లండ్ మధ్య జరగనున్న తొలి టెస్టుకు హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఆతిథ్యమివ్వబోతోంది. జనవరి 25 నుంచి తొలి టెస్ట్‌ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కోసం హెచ్‌సీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ టెస్ట్ మ్యాచ్ కోసం దిగ్గజ ఆటగాళ్లతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్టుగా హాజరవుతారు. ఉప్పల్ టెస్ట్‌కు చీఫ్ గెస్ట్‌గా రేవంత్ రెడ్డి , సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ తదితరులు హాజ‌రుకానున్నారు. దీంతో మ్యాచ్ ని చూసేందుకు ఫాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. పేటీఎం ఇన్‌సైడర్ ద్వారా ఆన్‌లైన్ లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. టికెట్లను ఆన్ లైన్ లో పెట్టిన 12 గంటల్లోనే 10 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. 200, 499 ప్రైజ్ తో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్ లో టికెట్లు దొరక్కపోతే ఆఫ్ లైన్ లో టికెట్లు అందుబాటులో ఉంచారు.

తొలి టెస్టు మ్యాచ్ కి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ధోనీ హారవుతుండటంతో టికెట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ మ్యాచ్ కోసం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు కాంప్లిమెంటరీ పాస్‌లు ఇవ్వడంతో పాటు భోజన వసతి కూడా కల్పిస్తున్నారు, మరుసటి రోజు రిపబ్లిక్ డే సందర్భంగా సైనికులకు కూడా ఉచిత ప్రవేశ సౌకర్యం కల్పిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి లండన్‌ నుంచి రాగానే నేరుగా కలిసి ఈ మ్యాచ్ కు చీప్ గెస్ట్ గా హాజ‌రుకావాల‌ని ఆహ్వానం అందిస్తామ‌ని హెచ్సీఎ తెలిపింది. అయితే టెస్టుకు రెండు రోజుల ముందు జనవరి 23న హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో బీసీసీఐ అవార్డ్స్ ప్ర‌ధానోత్స‌వ కార్యక్రమం జరుగుతుంది.

Also Read: Malvi Malhotra : ట్రెడిషనల్ లుక్ లో అదిరిపోయిన మాల్వీ మల్హోత్రా


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 1st Test
  • CM Revanth Reddy
  • england
  • HCA
  • hyderabad
  • IND vs ENG
  • india
  • ms dhoni
  • tickets
  • Uppal

Related News

Sundar Pichai

ఏఐ సమ్మిట్‌లో కీలక ప్రసంగం.గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌

Sundar Pichai : గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ భారత్‌ లో జరుగుతున్న అంతర్జాతీయ ఏఐ సదస్సు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏఐ సమ్మిట్ సందర్భంగా మన జాతీయ మీడియాతో ఆయన కాలిఫోర్నియా నుంచి వర్చువల్ గా మాట్లాడుతూ… భారత్‌ తో గూగుల్ భవిష్యత్ భాగస్వామ్యం గురించి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. పిచాయ్ వ్యాఖ్యల్లో కీలక అంశాలు: భారత ఏఐ ప్రయాణంలో గూగుల్ భాగస్వామి కావాలనుకుంటోంది. ఏఐ వ

  • Vijayendra Prasad

    మా పూర్వీకులు భయంకరమైన తప్పు చేశారు.. క్షమించండి: విజయేంద్రప్రసాద్‌

  • Hyd Parking

    Parking : హైదరాబాద్ పార్కింగ్ కష్టాలకు పుల్ స్టాప్..ఏంచేయబోతున్నారంటే !!

  • Fire in Meerut

    HYD : దేవుడు బతికిస్తాడని..శవాన్ని ఇంట్లో పెట్టి పూజలు !! ఇదెక్కడి మూఢనమ్మకం !

  • Manjeera Pipeline Blast

    మణికొండలో పగిలిన పైప్‌లైన్‌.. కాలనీలను ముంచెత్తిన వరద

Latest News

  • Kutami (Alliance) Govt : కూటమిని కూల్చే వరకు నా పోరాటం ఆగదు- అంబటి కీలక వ్యాఖ్యలు

  • Condoms : కండోమ్స్ ఎక్కువగా వాడుతున్నారా..? అయితే మీకు ఈ సమస్య వచ్చినట్లే ? నిజమా ?

  • డ‌బ్ల్యూహెచ్‌వో హెచ్చ‌రిక‌.. 2050 నాటికి ప్రతి నలుగురిలో ఒకరికి ఆ స‌మ‌స్య‌!!

  • PEPAIR : శ్వాసకోశ రోగులకు ‘పిపెయిర్’ వరం

  • ఐపీఎల్ 2026.. ఫిట్‌గా స్టార్ ప్లేయ‌ర్!

Trending News

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd