Liquor Caught : పాల వ్యానులో 10వేల మద్యం సీసాలు
ఏపీలో ప్రతిరోజు అక్రమ మద్యం రవాణా కేసులు నమోదు అవుతున్నాయి.ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకువచ్చి ఏపీలో విచ్చలవిడిగా అమ్ముతున్నారు.అక్రమ మద్యం రవాణాని అరికట్టేందుకు ఏపీ బోర్డర్ లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నా మాత్రం నియంత్రణ జరగడం లేదు.
- By Hashtag U Published Date - 02:26 PM, Tue - 28 December 21
ఏపీలో ప్రతిరోజు అక్రమ మద్యం రవాణా కేసులు నమోదు అవుతున్నాయి.ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకువచ్చి ఏపీలో విచ్చలవిడిగా అమ్ముతున్నారు.అక్రమ మద్యం రవాణాని అరికట్టేందుకు ఏపీ బోర్డర్ లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నా మాత్రం నియంత్రణ జరగడం లేదు. తాజాగా చిత్తూరు జిల్లాలో 20 లక్షలు విలువైన అక్రమ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాల వ్యాను లో తరలిస్తున్న రూ.20 లక్షల విలువైన 10 వేల అంతర్రాష్ట్ర మద్యం బాటిళ్లను ఆంధ్రప్రదేశ్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లాలో కర్ణాటక మద్యం అక్రమ రవాణా, విక్రయాలకు సంబంధించిన సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు-వెల్లూరు రహదారిలో అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందడంతో చిత్తూరు రూరల్ పోలీసులు దాడులు నిర్వహించారు. దాడిలో భాగంగా అనుమానాస్పద పాల వ్యాన్ను స్వాధీనం చేసుకున్నారు.వాహనాన్ని తనిఖీ చేయగా వ్యాన్లో నుంచి 200 కర్ణాటక మద్యం కేసులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన ఇద్దరు వ్యక్తులు ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దుల గుండా మద్యం అక్రమ రవాణాతో సంబంధం కలిగి ఉన్నారు. విచారణలో నిందితులు కర్ణాటకకు చెందిన అక్రమ మద్యాన్ని పెద్దఎత్తున ఆంధ్రప్రదేశ్కు తరలించినట్లు తెలిసింది. నిందితులపై జిల్లాలో పలు కేసులు నమోదై జైలు శిక్ష కూడా అనుభవించారు.
Tags
Related News
Pithapuram: పవన్ ని ఓడించేందుకు కుట్ర..పిఠాపురంలో 80 లక్షల మద్యం సీసాలు..
పిఠాపురంలోని వైఎస్ఆర్ గార్డెన్ ప్రాంతంలో కుమారపురంలో రూ.80 లక్షల విలువైన మద్యం సీసాలు వెలుగు చూశాయి. దీంతో అక్కడ రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఒకే ఇంట్లో 2560 లీటర్లకు పైగా మద్యం నిల్వ ఉన్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.