Andhra Pradesh: సినిమా టికెట్ల ధరలపై కొత్త కమిటీ
- By hashtagu Published Date - 12:51 PM, Tue - 28 December 21
ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల వ్యవహారంపై వైసీపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కొత్త కమిటీని నియమించనునట్లు అధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో ఉన్నతాధికారులు, ఎగ్జిబిటర్లు ఉంటారు.
కమిటీలో హోం, రెవెన్యూ, పురపాలక, ఆర్థిక, సమాచార, న్యాయశాఖ, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా ఉంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సినిమా థియేటర్ల వర్గీకరణ, ధరలపై కమిటీ ప్రతిపాదనలు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ ధరలు తగ్గించడంపై ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 35 ప్రకారం టికెట్లు విక్రయిస్తే థియేటర్లు మూసివేయడమే ఉత్తమం అని మీడియాతో అన్నారు. సినిమా థియేటర్లను వాటి యజమానులు స్వచ్ఛందంగా మూసివేస్తుండటంతో వాటిపై ఆధారపడ్డ వేలాది మంది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని చెప్పారు.
కరోనా విజృంభణ సమయంలో థియేటర్లలో సినిమాల ప్రదర్శన ఆగిపోయిన విషయం తెలిసిందేనని, ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారని అన్నారు. పండుగల సీజన్తో పాటు పెద్ద సినిమాలు విడుదల అవుతుండడంతో మళ్లీ సినీ పరిశ్రమకు మంచి రోజులు వచ్చాయని భావించామని, అయితే, ప్రస్తుతం జగన్ తీసుకున్న నిర్ణయంతో పరిస్థితులు మళ్లీ ఇబ్బంది పడుతున్నామని థియేటర్ల యజమానులు మీడియాకు చెప్పారు.
ఏపీలోని ప్రతి థియేటర్లో ప్రతిరోజు 50 మంది జీవనోపాధి పొందుతున్నారని, వీరందరికీ తక్కువ వేతనాలు ఉంటాయని అన్నారు. అలాగే, థియేటర్లలోని స్నాక్స్ వంటివి విక్రయించేవారు కూడా జీవనోపాధిని కోల్పోవాల్సి వస్తోందని చెప్పారు. మరోపక్క, సినిమా టికెట్ల ధరలు, వాటిల్లో తనిఖీలు వంటి అంశాలపై నేడు సంబంధిత వ్యక్తులతో ఏపీ సర్కారు చర్చలు జరపనుంది.
Related News
Tollywood: పెరుగుతున్న నిర్మాణ వ్యయం.. ఆందోళనలో టాలీవుడ్ నిర్మాతలు
Tollywood: తెలుగు సినిమా కొత్త శిఖరాలను అధిరోహించి, భారతీయ సినిమాలో అనేక అడ్డంకులను అధిగమించింది. నాన్ థియేట్రికల్ రైట్స్ భారీగా పెరగడంతో పాటు థియేట్రికల్ డీల్స్ కూడా భారీగా పెరిగాయి. మన స్టార్ హీరోలు కూడా తమ పారితోషికాన్ని పెంచి తమ మార్కెట్, సక్సెస్ తో సంబంధం లేకుండా పెద్ద డిమాండ్ చేస్తున్నారు. హఠాత్తుగా తెలుగు సినిమాల హిందీ రైట్స్, శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ తగ్గిపో�