Speed News
-
KomatiReddyLetter to KCR:కేసీఆర్ కి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి లేఖ
317 జీవో పై అభ్యంతరాలను తెలుపుతూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 317 జీవో ప్రభుత్వ ఉద్యోగుల హక్కులను కాలరాసేలా ఉందని, తక్షణమే 317 జీవో ని రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
Date : 05-01-2022 - 6:07 IST -
Corona In TS:పెరుగుతున్న కరోనా కేసులకు బాధ్యత ఎవరు తీసుకోవాలి?
తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న తప్పులకు ప్రజలు బలికావాల్సి వస్తోంది. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా పలు రాష్ట్రాలు వీకెండ్ లక్డౌన్, ఆంక్షలు విధించి కరోనాను కట్టడి చేస్తోంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం అత్యంత బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించి కేసులు పెరగడానికి కారణంగా మారుతోంది.
Date : 04-01-2022 - 11:29 IST -
Corona:విద్యార్థులపై పంజా విసురుతున్న కరోనా.. కొత్తవలస ప్రభుత్వ పాఠశాల్లో 19మందికి పాజిటివ్
విజయనగరం జిల్లా కొత్తవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం రేపుతుంది.
Date : 04-01-2022 - 11:21 IST -
AP News:అమరావతి పాడుపడిన రియల్ ఎస్టేట్ వెంచర్.. చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి అనేది ఒక పాడుపడిన రియల్ ఎస్టేట్ వెంచర్ అంటూ వ్యాఖ్యలు చేశారు.
Date : 04-01-2022 - 11:18 IST -
RGV:ఏపీ ప్రభుత్వంపై ఆర్జీవీ ఫైర్… సమాధానం కావాల్సిందేనంటున్న వర్మ
ఏపీలో సినిమా టికెట్ల ధరలపై చిత్ర పరిశ్రమ, ప్రభుత్వం మధ్య యుద్దం నడుస్తుంది. సంక్రాంతి సీజన్ ప్రారంభంకావడంతో చాలా చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
Date : 04-01-2022 - 11:12 IST -
PCC Chief:రేవంత్ సంతోష్ ట్విట్టర్ వార్
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, టీపీసీసీ చీఫ్ రేవంత్ మధ్య ట్విట్టర్ వేదికగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
Date : 04-01-2022 - 11:02 IST -
Andhra Pradesh: జీవో నెంబర్ 2ని వెనక్కి తీసుకున్న ప్రభుత్వం
పంచాయతీ సర్పంచులు, సెక్రటరీల అధికారాలను వీఆర్వోలకు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో జీవో నెంబర్ 2ని తీసుకొచిన విషయం తెలిసిందే. ఈ జీవోను సర్పంచులు వ్యతిరేకించి.. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు విచారణ సందర్భంగా జీవో నెంబర్ 2 పంచాయతీ రాజ్ చట్టానికి విరుద్ధమని సర్పంచులు వాదించారు. ఈ క్రమంలో సదరు జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది.
Date : 04-01-2022 - 5:29 IST -
Covid_19: కొవిడ్ బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా.. దరఖాస్తులు ఇలా!
కరోనా మహమ్మారి ధాటికి యువకులు, పెద్దవాళ్లు అనే తేడా లేకుండా చాలామంది బలయ్యారు. ఎంతోమంది అనాథలయ్యారు. మరెన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు, పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రుల బాధలు వర్ణనాతీతం. కరోనా కారణంగా కనుమూసిన కుటుంబాలకు సాయం చేయాలని సుప్రీంకోర్టు సైతం భావించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో Covid19 కారణంగా మరణించిన మృతుల బంధువులకు తెల
Date : 04-01-2022 - 5:07 IST -
Revanth Reddy: ఇదిగో డ్రామా మొదలైంది..
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ కావడం, ఆగ్రహావేశాలతో ఊగిపోతున్న బీజేపీ శ్రేణులు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో ర్యాలీకి సిద్ధపడడం వంటి పరిణామాలపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. డ్రామా మొదలైంది అంటూ వ్యాఖ్యానించారు. బండి సంజయ్ అరెస్ట్ తో పార్ట్-1 పూర్తయిందని, పార్ట్-2లో భాగంగా జేపీ నడ్డా గారిని ఇవాళ క
Date : 04-01-2022 - 4:58 IST -
Radha Krishna: రాధేశ్యామ్ రిలీజ్ పై సందేహాలు.. డైరెక్టర్ రియాక్షన్ ఇదే!
కోవిడ్ వ్యాప్తి పెరుగుతున్న కారణంగా పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభాస్ రాధేశ్యామ్ మూవీ కూడా
Date : 04-01-2022 - 4:44 IST -
High court: బండి సంజయ్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ
జాగరణ దీక్ష సందర్భంగా కరోనా నిబంధనలు ఉల్లంఘించాడంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనకు కరీంనగర్ కోర్టు నిన్న 14 రోజుల రిమాండ్ విధించింది. బండి సంజయ్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా.. బెయిల్ పిటిషన్ ను హైకోర్టు నేడు తిరస్కరించింది. ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల విచారణకు తనకు రోస్టర్ లేదంటూ హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది.
Date : 04-01-2022 - 4:16 IST -
Team India : కొత్త ఏడాదిలో టీమిండియా టార్గెట్స్ ఇవే
భారత క్రికెట్ జట్టుకు గత ఏడాది మిశ్రమ ఫలితాలను మిగిల్చింది. దీంతో కొత్త ఏడాదిలో మరిన్ని విజయాలపై కన్నేసింది కోహ్లీసేన. టెస్ట్ ఫార్మేట్ వరకూ కొత్త ఏడాదిలో తొలి టార్గెట్ సఫారీ గడ్డపై సిరీస్ విజయం. సెంచూరియన్ టెస్టులో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత్ సిరీస్లో 1-0 ఆధిక్యాన్ని అందుకుంది.
Date : 04-01-2022 - 3:10 IST -
సఫారీలతో వన్డే సిరీస్.. ఆ నలుగురికి లాస్ట్ ఛాన్స్
ఐపీఎల్ మెగా వేలానికి టైమ్ దగ్గర పడుతోంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా ఆటగాళ్ల వేలం జరగబోతోంది. దేశవాళీ క్రికెటర్లతో పాటు విదేశీ స్టార్ ప్లేయర్స్ అందరూ వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. గఅయితే భారత జట్టులో నలుగురు సీనియర్ క్రికెటర్లకు మాత్రం రానున్న సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ పరీక్షగానే చెప్పాలి.
Date : 04-01-2022 - 3:07 IST -
TTD: కేంద్రం నిర్లక్ష్యంతో విదేశీ విరాళాలకు గండి
తిరుమల తిరుపతి దేవస్థానాలకి విదేశాల నుంచి అందే విరాళాలు ఆగిపోయాయి. వీటి స్వీకరణకు సంబంధించి కేంద్ర హోం శాఖ ఎఫ్సీఆర్ఏ లైసెన్సు ను సకాలంలో రెన్యువల్ చేయకపోవడంతో ఏడాది కాలంగా దేవస్థానానికి విదేశీ విరాళాలు ఆగిపోయాయి. దేశవ్యాప్తంగా సంస్థలు, సంఘాలూ విదేశీ విరాళాలు పొందడానికి కేంద్ర ప్రభుత్వం.. ప్రత్యేకించి హోం శాఖ నుంచి లైసెన్సు పొందాలి. విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చ
Date : 04-01-2022 - 2:54 IST -
JP Nadda’s rally: జేపీ నడ్డా ‘శాంతియాత్ర’కు అనుమతి నిరాకరణ
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియం నుంచి లిబర్టీ క్రాస్ రోడ్స్ వరకు తలపెట్టిన 'శాంతి యాత్ర'కు
Date : 04-01-2022 - 1:48 IST -
TTD: నకిలీ టికెట్లను విక్రయించిన ఏడుగురు అరెస్ట్
తిరుమల శ్రీవారి దర్శనానికి నకిలీ టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్న రెండు ముఠాలు (ఏడుగురిని) పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుల్లో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. వైకుంఠం-1లో విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఎం.కృష్ణారావు, తిరుమల లడ్డూ కౌంటర్ లో పనిచేస్తున్న అరుణ్ రాజు, తిరుపతిలోని ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తున్న బాలాజీ, పని చేస్తున్న నరేంద్
Date : 04-01-2022 - 1:23 IST -
Delhi: జగన్ ను కలిసిన ఆమ్రపాలి
ప్రధానమంత్రి కార్యాలయం(PMO) లో డిప్యూటీ సెక్రటరీగా పని చేస్తున్న ఆమ్రపాలి ఢిల్లీ పర్యటనలో వున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని కలుసుకున్నారు. ఢిల్లీలోని జగన్ నివాసానికి వెళ్లి, ఆయనతో కాసేపు భేటీ అయ్యారు. విశాఖపట్నంకు చెందిన ఆమ్రపాలి ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారిణి. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆమె ఏపీ నుంచి తెలంగాణ కేడర్ కు మారారు. ప్రస్తుతం ప్రధాని మోదీ కార్యాల
Date : 04-01-2022 - 1:11 IST -
Watch: 17.6 కిలోమీటర్ల దూరం కేవలం 15 నిమిషాల్లో!
హైదరాబాద్ లో మంగళవారం ఉదయం బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి నుంచి బేగంపేట కిమ్స్ కు గ్రీన్ఛానల్ ద్వారా తరలించారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా రాచకొండ ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. దీంతో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండె, ఊపిరితిత్తులను కిమ్స్ కు తరలించారు. గ్రీన్ ఛానల్ సాయంతో 17.6కిలోమీటర్ల దూరాన్ని అంబులెన
Date : 04-01-2022 - 11:57 IST -
Tamil Nadu: తీవ్ర విషాదం.. వెల్లువెత్తుతున్న నిరసనలు
తమిళనాడు లోని పుదుకోట్టై జిల్లా లో విషాదం చోటు చేసుకుంది. సెంట్రల్ ఇండస్ట్రియాల్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి గాల్లోకి కాల్చిన బుల్లెట్టు రెండు కిలోమీటరు దూరంలో ఆడుకుంటున్న పదకొండు సంవత్సరాల చిన్నారి తలకు తాకి మరణించాడు. బుల్లెట్టు తాకిన బాలుడిని తంజావూరు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి స్టాలిన్ ఘటన పై దర్యాప్తు చేపట్టి ని
Date : 04-01-2022 - 11:38 IST -
Delhi CM: కేజ్రీకి కరోనా.. స్వల్ప లక్షణాలతో హోమ్ ఐసోలేషన్!
చాప కింద నీరులా కరోనా మహమ్మారి విస్తురిస్తూనే ఉంది. సామాన్యులు, సెలబ్రిటీలు, ప్రముఖులు అనే తేడా లేకుండా కొవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు కరోనా వైరస్ సోకింది. ఆయనకు స్వల్పంగా కోవిడ్ లక్షణాలు ఉన్నాయని, దీంతో హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు ట్విటర్లో వెల్లడించారు. గత కొన్ని రోజుల నుంచి తనతోపాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నవార
Date : 04-01-2022 - 11:30 IST