Sonia Gandhi: నామినేషన్ కోసం జైపూర్ చేరుకున్న సోనియా గాంధీ
- By Latha Suma Published Date - 10:18 AM, Wed - 14 February 24
Nomination: ఈసారి లోక్ సభ ఎన్నికల్లో కాకుండా రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ(Sonia Gandhi) పోటీ చేస్తున్నారు. రాజస్థాన్ నుంచి ఆమె రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో, ఢిల్లీ నుంచి బయల్దేరిన సోనియా కాసేపటి క్రితం రాజస్థాన్ రాజధాని జైపూర్(Jaipur)కు చేరుకున్నారు. ఆమెతో పాటు రాహుల్, ప్రియాంకా గాంధీలు ఉన్నారు. ఈరోజు సోనియా తన నామినేషన్ (Nomination)దాఖలు చేయనున్నారు. నామినేషన్లు సమర్పించడానికి రేపు చివరి తేదీ. 27న ఎన్నికలు జరుగుతాయి.
ఐదు సార్లు లోక్ సభ(Lok Sabha)కు ఎన్నికైన 77 ఏళ్ల సోనియాగాంధీ తొలిసారి రాజ్యసభ(Rajya Sabha)లో అడుగుపెట్టబోతున్నారు. ప్రస్తుతం ఆమె ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రాయ్ బరేలీ నుంచి ఆమె కుమార్తె ప్రియాంకాగాంధీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయంగా తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
నామినేషన్ల దాఖలు సమయంలో సోనియాతో పాటు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ ఉంటారని తెలుస్తోంది. ఈనెల 27న 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగుస్తోంది. ఈ నేపథ్యంలో, ఈ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రాజస్థాన్ లో మూడు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మూడింట్లో ఒక స్థానంలో కాంగ్రెస్ సునాయాసంగా విజయాన్ని సాధిస్తుంది. అందుకే, సోనియా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. దక్షిణాదిన తెలంగాణ, కర్ణాటక నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ… ఆమె రాజస్థాన్ నుంచి పోటీ చేయడానికే మొగ్గు చూపారు. లోక్ సభకు మరోసారి పోటీ చేయబోనని 2019లోనే సోనియా ప్రకటించారు.
READ ALSO : TS Assembly : అసెంబ్లీలో ఇరిగేషన్పై శ్వేతపత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం
Related News
BRS: ఎన్నికల వేళ బీఆర్ఎస్కు ఎదురుదెబ్బ.. కాంగ్రెస్ లో చేరిన గుత్తా అమిత్ రెడ్డి
Gutha Amith Reddy: తెలంగాణలో లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections) వేళ బీఆర్ఎస్(BRS) పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ సీనియర్ నేత, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy) కుమారుడు గుత్త అమిత్రెడ్డి(Gutha Amith Reddy) కాంగ్రెస్(Congress)లో చేరారు. ఏఐసీసీ ఇంఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ సమక్షంలో అమిత్ హస్తం కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ