TS Assembly : అసెంబ్లీలో ఇరిగేషన్పై శ్వేతపత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం
- By Kavya Krishna Published Date - 10:11 AM, Wed - 14 February 24
తెలంగాణ అసెంబ్లీ (Telanana Assembly Session) లో నేడు ఐదో రోజు సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈనేపథ్యంలోనే.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై చర్చ జరగనుంది. చర్చలో భాగంగా సభ్యుల ప్రశ్నలకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) సమాధానం ఇవ్వనున్నారు. ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇరిగేషన్పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్ట్, కాగ్ రిపోర్ట్ను సభలో ప్రవేశపెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం.
We’re now on WhatsApp. Click to Join.
అయితే.. ఇదిలా ఉంటే.. నిన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బృందం అసెంబ్లీ నుంచి మేడిగడ్డ ప్రాజెక్ట్ను పరిశీలించేందుకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే.. మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage)ని పరిశీలించిన సీఎం రేవంత్రెడ్డి బృందం బ్యారేజీ పిల్లర్ కుంగుబాటుపై ఆరా తీశారు. మొదటగా డ్యాంపై నుంచి ప్రాజెక్ట్ను పరిశీలించిన రేవంత్రెడ్డి బృందం.. అనంతరం నదిలోకి వెళ్లి కుంగిన డ్యాం 21వ పిల్లర్ ప్రాంతాన్ని పరిశీలించింది. ఆ తరువాత అక్కడ విజిలెన్స్ అధికారులు ప్రాజెక్టులోని లోపాలు, అవినీతి జరిగిన తీరుతెన్నులను వివరిస్తూ రూపొందించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్కు హాజరయ్యారు.
ప్రాజెక్ట్ వివరాలపై అధికారులు ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ను వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాళేవ్వరం ప్రాజెక్ట్లో భారీగా అవకతవకలు జరిగాయని, కాళేశ్వరం ప్రాజెక్టు అంతా ఇదే పద్ధతిలో అనేక లోపాలు, అవకతవకలతో పనులు జరిగాయని విజిలెన్స్ విచారణ బృందం గుర్తించిందన్నారు. అటు కాగ్ సైతం గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని అక్రమాలను వెల్లడించిందని, దీనిపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. ఈ నేపథ్యంలోనే నేడు ఇరిగేషన్పై అసెంబ్లీలో శ్వేతప్రతం విడుదల చేయనుంది తెలంగాణ సర్కార్. అయితే.. గత నాలుగు రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను, అక్రమాలను బయటపెడుతామంటూ భీష్మించుకున్న రేవంత్ రెడ్డి సర్కార్ అదే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఒక్కొక్కటిగా గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతిని ప్రజల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం.
Also Read : TS ECET 2024: విద్యార్థులకు అలర్ట్.. నోటిఫికేషన్ విడుదల
Related News
CAA : సీఏఏ కింద 14 మందికి భారత పౌరసత్వం
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ని అమలు చేసిన తర్వాత తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం 300 మంది శరణార్థులకు భారత పౌరసత్వం ఇచ్చింది.