India
-
Patna Railway Station: పాట్నా రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు
అత్యంత రద్దీగా ఉండే పాట్నా జంక్షన్ (Patna Railway Station)లో సోమవారం సాయంత్రం బాంబు పుకారు రావడంతో కలకలం రేగింది. 112కి ఫోన్ చేసి పాట్నా జంక్షన్ (Patna Railway Station)లో మూడు బాంబులు అమర్చినట్లు ఓ వ్యక్తి సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు.
Date : 20-12-2022 - 8:45 IST -
Bomb in Bhakra canal: పంజాబ్లోని భాక్రా కెనాల్లో బాంబు..?
పంజాబ్లోని భాక్రా కెనాల్ (Bhakra canal)లో ఓ స్కూబా డైవర్కి వింత వస్తువు దొరికింది. అది బాంబులా ఉందని, దాని బరువు 20-25 కిలోలు ఉటుందని సదరు స్కుబా డైవర్ తెలిపాడు. భాక్రా కెనాల్ (Bhakra canal)లో అటువంటి వస్తువులు మరిన్ని ఉన్నాయని వెల్లడించాడు. తనకు దొరికిన వస్తువును పోలీసులకు అందజేశానని చెప్పాడు.
Date : 20-12-2022 - 7:40 IST -
Father Killed Son: కొడుకును చంపి గోనె సంచిలో దాచిన తండ్రి
యూపీలోని అలీఘర్లో దారుణం జరిగింది. ప్రతిరోజూ మద్యం తాగి ఇంటికి వస్తున్నాడని ఓ తండ్రి తన 24 ఏళ్ల కొడుకును హత్య (Father Killed Son) చేశాడు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో ఉంచి పొలంలో పడేశాడు. అయితే మృతుడి మేనమామ ఫిర్యాదు చేయడంతో పోలీసులు తండ్రిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
Date : 20-12-2022 - 7:25 IST -
China Border Issue: చైనా సరిహద్దు వివాదంపై పార్లమెంట్లో దుమారం
తవాంగ్ సెక్టార్లో భారత్-చైనా సైనిక ఘర్షణ వ్యవహారంపై పార్లమెంట్లో దుమారం కొనసాగుతోంది. చైనా (China) విషయంపై చర్చించాలంటూ రాజ్యసభలో కేంద్రాన్ని డిమాండ్ చేశాయి విపక్షాలు. ఛైర్మన్ ఒప్పుకోలేదని వాకౌట్ చేశాయి. అయితే చైనా(China)తో సరిహద్దు వివాదంపై విపక్షాల విమర్శలకు కేంద్రం దీటుగా బదులిచ్చింది.
Date : 20-12-2022 - 7:05 IST -
Karnataka’s Belagavi: బెళగావి బోర్డర్లో హైటెన్షన్
మహారాష్ట్ర-కర్ణాటక (Karnataka) సరిహద్దు నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇరుపక్కల ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. కర్నాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలైన నేపథ్యంలో.. బోర్డర్ బ్లోఔట్ మళ్లీ భగ్గుమంది. మహారాష్ట్ర-కర్నాటక సరిహద్దు వివాదం రోజురోజుకు రాజుకుంటోంది.
Date : 20-12-2022 - 6:35 IST -
Fake IPS officer : నకిలీ ఐపీఎస్ అధికారిని పట్టుకున్న ఢిల్లీ పోలీసులు
ఐపీఎస్ అధికారిగా నటిస్తూ మహిళలను మోసగిస్తున్న వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు
Date : 19-12-2022 - 6:17 IST -
Murder: మద్యం మత్తులో ఉన్న భర్తను చంపేసిన భార్య.. ఎవరో చంపి పారిపోయారంటూ ఇంటి బయటికొచ్చి కేకలు!!
యూపీలోని బారాబంకిలో (Uttar Pradesh) (Barabanki) మద్యం మత్తులో ఉన్న భర్తను భార్య దారుణంగా హత్య చేసింది.
Date : 19-12-2022 - 12:27 IST -
Indian Railways : ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్న ఇండియన్ రైల్వే
రైళ్ల కార్యకలాపాలను సులభతరం చేసే చర్యలో, భారతీయ రైల్వేలు ఉత్తరప్రదేశ్లోని చందౌలీ మార్గంలో ఆటోమేటిక్ బ్లాక్
Date : 19-12-2022 - 8:13 IST -
Haryana : హర్యానాలో 15 వాహనాలు ఢీ.. అంబాలా-యమునానగర్-సహారన్పూర్ హైవేపై ఘటన
హర్యానాలోని అంబాలా-యమునానగర్-సహారన్పూర్ హైవేపై దట్టమైన పొగమంచు కారణంగా 15 వాహనాలు ఢీకొట్టుకున్నాయి.
Date : 19-12-2022 - 5:43 IST -
Woman killed and 50 pieces: దారుణం.. రెండో భార్యను 50 ముక్కలుగా నరికిన భర్త
శ్రద్ధా వాకర్ హత్య ఘటన మరువక ముందే, జార్ఖండ్లో మరో దారుణం బయటపడింది. బోరియో పోలీస్ స్టేషన్ పరిధిలోని జార్ఖండ్లోని సాహెబ్గంజ్లో తన భార్య మృతదేహాన్ని 50 ముక్కలు (50 pieces)గా నరికినందుకు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని శ్రద్ధా వాకర్ హత్య కేసు మాదిరిగానే జార్ఖండ్లోని సాహిబ్గంజ్లో జరిగిన రూబికా పహారియా హత్య ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది.
Date : 18-12-2022 - 3:40 IST -
former Chief Minister son: ఎన్నికల బరిలోకి మరో వారసుడు.. మాజీ సీఎం తనయుడికి అసెంబ్లీ టికెట్..!
వచ్చే ఏడాది కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర ప్రాంతీయ పార్టీ జనతాదళ్-సెక్యులర్ ( JDS) శనివారం తన కంచుకోట రామనగర నియోజకవర్గం నుండి మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు (former Chief Minister son) నిఖిల్ కుమారస్వామిని అభ్యర్థిగా ప్రకటించింది.
Date : 18-12-2022 - 1:30 IST -
Man Killed Aunt: అత్తను చంపిన మేనల్లుడు.. మృతదేహాన్ని 10 ముక్కలుగా కోసి
రాజస్థాన్ రాజధాని జైపూర్లో కూడా శ్రద్ధా వాకర్ హత్య కేసు లాంటి సంచలనం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ మహిళను హత్య (Murder) చేసి 10 ముక్కలు చేశాడు. ఢిల్లీ రోడ్డులోని అడవుల్లో పడి ఉన్న మహిళ మృతదేహం ముక్కలు కనిపించాయి.
Date : 18-12-2022 - 1:16 IST -
Flight emergency landing: ఎయిరిండియా విమానం అత్యవసర ల్యాండింగ్.. 143 మంది ప్రయాణికులు సేఫ్
హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న ఎయిర్ ఇండియా (Air India) A320 విమానంలో సాంతికేక సమస్య తలెత్తింది. విమానాన్ని ముంబై విమానాశ్రయానికి మళ్లించటంతో ప్రమాదం తప్పింది. ఎయిర్ ఇండియా (Air India) విమానంలో హైడ్రాలిక్ సిస్టంలో సమస్య తలెత్తిందని అధికారులు తెలిపారు.
Date : 18-12-2022 - 8:43 IST -
PM Modi: నేడు మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన
మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) నేడు (ఆదివారం) సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. దాదాపు రూ.6,800 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi). ఈ మేరకు ప్రధాని కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
Date : 18-12-2022 - 8:10 IST -
Naked foreign woman: జైపూర్లో విదేశీ మహిళ నగ్నంగా వీరంగం
జైపూర్లోని ఓ ఫైవ్స్టార్ హోటల్లో ఓ విదేశీ మహిళ (foreign woman) నగ్నంగా వీరంగం సృష్టించింది. హోటల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. అనంతరం హోటల్ సిబ్బందిపై పిడిగుద్దులతో దాడికి పాల్పడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Date : 18-12-2022 - 7:40 IST -
Rahul Gandhi: రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ (Rahul Gandhi)కి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ (Rahul Gandhi) ఎన్నిక కావడాన్ని సవాల్ చేస్తూ సరితానాయర్ అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. 2019 ఎన్నికల్లో వయనాడ్ లోక్సభకు సరిత పోటీచేయగా.. ఆమెపై చీటింగ్ కేసులుండటంతో హైకోర్టు అనర్హత వేటు వేసింది.
Date : 18-12-2022 - 6:50 IST -
Supreme Court: సుప్రీం సంచలన నిర్ణయం.. బిల్కిస్ బానో పిటిషన్ కొట్టివేత
బిల్కిస్ బానో (Bilkis Bano) దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు (Supreme Court) శనివారం కొట్టివేసింది. ఇందులో 1992 పాలసీ ప్రకారం దోషులకు మినహాయింపు ఇవ్వడాన్ని పరిగణించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని కోరుతూ దాని ఆదేశాలను సమీక్షించాలని సుప్రీంకోర్టు (Supreme Court)ను డిమాండ్ చేసింది.
Date : 17-12-2022 - 2:30 IST -
PM Narendra Modi: జనవరి 12న బెళగావికి ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) కర్ణాటక పర్యటనకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జనవరి 12న జాతీయ యువ దినోత్సవాల ప్రారంభ సమావేశంలో పాల్గొనేందుకు మోదీ (PM Narendra Modi) బెళగావికి వస్తున్నట్లు సమాచారం.
Date : 17-12-2022 - 12:25 IST -
cylinder blast: సిలిండర్ పేలుడులో 32కు చేరిన మరణాలు
డిసెంబరు 16న రాజస్థాన్లోని జోధ్పూర్ జిల్లాలో వివాహ వేడుకలో జరిగిన సిలిండర్ పేలుడు (cylinder blast)లో మరణించిన వారి సంఖ్య 32కి పెరిగింది. జోధ్పూర్ గ్యాస్ సిలిండర్ పేలుడు (cylinder blast) రాజస్థాన్లో జరిగిన అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటి. ఈ ప్రమాదంలో 60 మందికి పైగా కాలిపోగా
Date : 17-12-2022 - 8:20 IST -
Girl Killed: రాజస్థాన్లో దారుణం.. ప్రేమకు నిరాకరించిందని బాలిక దారుణ హత్య
రాజస్థాన్లోని జాలోర్లో దారుణం జరిగింది. ఓ యువకుడు తనను ప్రేమించడం లేదన్న కోపంతో ఓ బాలికను హత్య (Girl Killed) చేశాడు. ఆహోర్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల పురుషోత్తం వాల్మీకి అదే ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల అమ్మాయి వెంట ప్రేమ పేరుతో వేధించేవాడు. ఆ బాలిక ప్రేమకు నిరాకరించటంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు.
Date : 17-12-2022 - 7:35 IST