Girl Killed: రాజస్థాన్లో దారుణం.. ప్రేమకు నిరాకరించిందని బాలిక దారుణ హత్య
రాజస్థాన్లోని జాలోర్లో దారుణం జరిగింది. ఓ యువకుడు తనను ప్రేమించడం లేదన్న కోపంతో ఓ బాలికను హత్య (Girl Killed) చేశాడు. ఆహోర్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల పురుషోత్తం వాల్మీకి అదే ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల అమ్మాయి వెంట ప్రేమ పేరుతో వేధించేవాడు. ఆ బాలిక ప్రేమకు నిరాకరించటంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు.
- By Gopichand Published Date - 07:35 AM, Sat - 17 December 22
రాజస్థాన్లోని జాలోర్లో దారుణం జరిగింది. ఓ యువకుడు తనను ప్రేమించడం లేదన్న కోపంతో ఓ బాలికను హత్య (Girl Killed) చేశాడు. ఆహోర్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల పురుషోత్తం వాల్మీకి అదే ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల అమ్మాయి వెంట ప్రేమ పేరుతో వేధించేవాడు. ఆ బాలిక ప్రేమకు నిరాకరించటంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆమెపై హజారిలాల్ పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ఆ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలో మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
రాజస్థాన్లోని జలోర్ జిల్లాలోని అహోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుడ్తారా గ్రామంలో గురువారం అర్థరాత్రి సాయంత్రం 15 ఏళ్ల బాలికను ఆమె ఇంటి సమీపంలో ఓ యువకుడుహత్య చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. బాలిక తన ఇంటి వెనుక మలవిసర్జన చేయడానికి వెళ్లగా నిందితుడు పురుషోత్తం వాల్మీకి బాలికపై కత్తితో దాడి చేశాడు. అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP) అనుక్రతి ఉజ్జనియా మాట్లాడుతూ.. నిందితుడు తన చేతిలో కత్తి పట్టుకొని గ్రామస్తులను కూడా బెదిరించాడని, అయితే అతనిని గ్రామస్తులు పట్టుకుని కొట్టారని చెప్పారు.
Also Read: fire Accident: దారుణం.. ఆరుగురు సజీవదహనం
బాలికను ఆసుపత్రికి తరలించగా ఆమె మరణించిందని నిర్ధారించారు. ఘటన జరిగిన కొద్దిసేపటికే నిందితుడిని అదుపులోకి తీసుకుని అనంతరం అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) సెక్షన్లు 302 (హత్య), 354 (లైంగిక వేధింపులు) కింద బాధితురాలి మేనమామ ఆదా రామ్ ఫిర్యాదు చేసినట్లు ఎఎస్పీ తెలిపారు. ప్రాథమిక విచారణలో నిందితుడు ప్రేమ పేరుతో బాలికను వేధించేవాడని ఉజ్జనియా తెలిపారు. బాధితురాలి కుటుంబం నిందుతునిపై గతంలో కూడా వేధింపుల కేసు నమోదు చేశారు.
Related News
Fraud : ఆ మహిళలే అతడి టార్గెట్.. నమ్మించి నట్టేట ముంచి.. చివరికి..!
విడాకులు తీసుకున్న మహిళలే అతడి టార్గెట్. ఆ మహిళలు... ఒంటరిగా జీవించేవారు. సొంతంగా ఎవరూ లేని వారు. మానసికంగా చాలా బలహీనంగా ఉండి మరో జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్న వారు.