Father Killed Son: కొడుకును చంపి గోనె సంచిలో దాచిన తండ్రి
యూపీలోని అలీఘర్లో దారుణం జరిగింది. ప్రతిరోజూ మద్యం తాగి ఇంటికి వస్తున్నాడని ఓ తండ్రి తన 24 ఏళ్ల కొడుకును హత్య (Father Killed Son) చేశాడు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో ఉంచి పొలంలో పడేశాడు. అయితే మృతుడి మేనమామ ఫిర్యాదు చేయడంతో పోలీసులు తండ్రిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
- Author : Gopichand
Date : 20-12-2022 - 7:25 IST
Published By : Hashtagu Telugu Desk
యూపీలోని అలీఘర్లో దారుణం జరిగింది. ప్రతిరోజూ మద్యం తాగి ఇంటికి వస్తున్నాడని ఓ తండ్రి తన 24 ఏళ్ల కొడుకును హత్య (Father Killed Son) చేశాడు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో ఉంచి పొలంలో పడేశాడు. అయితే మృతుడి మేనమామ ఫిర్యాదు చేయడంతో పోలీసులు తండ్రిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో కొడుకు ప్రవర్తనతో విసిగిపోయిన తండ్రి కొడుకును హత్య (Father Killed Son) చేశాడు.
మూడు రోజులుగా పొలంలో ఉన్న గడ్డి మధ్య మృతదేహాన్ని గోనె సంచిలో దాచిపెట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడి మేనమామ మేనల్లుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. నిందితుడు తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించాడు.ఈ కేసు గోండా పోలీస్ స్టేషన్ పరిధిలోని తారాపూర్ గ్రామానికి చెందినది.
24 ఏళ్ల రవి తన తండ్రి జయప్రకాష్తో డిసెంబరు 14 రాత్రి ఏదో సమస్యపై గొడవ పడ్డాడు. అప్పటి నుంచి అతడు కనిపించకుండా పోయాడు. ఈ విషయమై అతడి మామ శంకర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వంఖండి మహాదేవ్ మందిరో రోడ్డులోని జయప్రకాష్ పొలంలోని బావిలో రవి మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులకు ఇన్ఫార్మర్ల ద్వారా సమాచారం అందింది. అయితే పోలీసులు బావి వద్దకు చేరుకుని చూడగా అక్కడ మృతదేహం కనిపించలేదు. దీంతో శనివారం కూడా పోలీసులు బావిలో సోదాలు చేసినా ఫలితం లేకపోయింది. తరువాత మృతదేహం గోధుమ పొలంలో గడ్డి మధ్య మూసి ఉన్న గోనె సంచిలో కనుగొన్నారు. సమాచారం అందుకున్న ఎస్ఓ గొండా ఉమేష్చంద్రశర్మ, ఎస్ఐ మను యాదవ్ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడి తండ్రి జయప్రకాష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించాడు.
Also Read: Fake IPS officer : నకిలీ ఐపీఎస్ అధికారిని పట్టుకున్న ఢిల్లీ పోలీసులు
కొడుకు రవి గొడవ పడేవాడని జయప్రకాష్ తెలిపినట్లు పోలీసులు తెలిపారు. రోజూ ఇంట్లో గొడవలు పడేవాడు. అంతేకాదు కుటుంబ సభ్యులతో కూడా గొడవ పడేవాడు. డిసెంబర్ 14న కూడా కుటుంబ సభ్యులను కొట్టినట్లు తెలిసింది. దీనిపై అతనిని తండ్రి కొట్టాడు. ఈ ఘటనలో రవి మరణించాడు. ఆ తర్వాత మృతదేహాన్ని దాచిపెట్టాడు. డిసెంబర్ 8న రవి జైలు నుంచి విడుదలయ్యాడని తండ్రి చెప్పాడు. నిజానికి డిసెంబర్ 2వ తేదీన పోలీసులు అక్రమ పిస్టల్ తో రవిని అరెస్ట్ చేసి ఆయుధాల చట్టం కింద జైలుకు పంపారు. డిసెంబర్ 8న బెయిల్పై బయటకు వచ్చాడు.