Karnataka’s Belagavi: బెళగావి బోర్డర్లో హైటెన్షన్
మహారాష్ట్ర-కర్ణాటక (Karnataka) సరిహద్దు నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇరుపక్కల ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. కర్నాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలైన నేపథ్యంలో.. బోర్డర్ బ్లోఔట్ మళ్లీ భగ్గుమంది. మహారాష్ట్ర-కర్నాటక సరిహద్దు వివాదం రోజురోజుకు రాజుకుంటోంది.
- By Gopichand Published Date - 06:35 AM, Tue - 20 December 22
మహారాష్ట్ర-కర్ణాటక (Karnataka) సరిహద్దు నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇరుపక్కల ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.
కర్నాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలైన నేపథ్యంలో.. బోర్డర్ బ్లోఔట్ మళ్లీ భగ్గుమంది. మహారాష్ట్ర-కర్నాటక సరిహద్దు వివాదం రోజురోజుకు రాజుకుంటోంది. కర్నాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభంతో.. బెళగావి (Belagavi) బోర్డర్లో టెన్షన్ పెరిగింది. బెళగావిలో మహా మేళా నిర్వహించేందుకు వచ్చిన మరాఠా కార్యకర్తలను కన్నడ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాగ్నోలీ టోల్ ప్లాజా వద్ద వందలమంది మహారాష్ట్ర ఏకీకరణ్ సమితి కార్యకర్తలు నిరసన కొనసాగించారు .
బెళగావిని మహారాష్ట్రలో విలీనం చేయాలని దశాబ్దాలుగా మహారాష్ట్ర ఏకీకరణ్ సమితి పోరాటం చేస్తోంది . కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం రోజు.. ఏటా బెళగావిలో మహా మేళా పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. అయితే ఈసారి మహా మేళాకు అనుమతి నిరాకరించింది బొమ్మై సర్కార్. బెళగావి పట్టణంలోకి ప్రవేశించేందుకు యత్నించిన కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన నేతలు, కార్యకర్తలను సరిహద్దుల్లోనే అడ్డుకున్నారు కన్నడ పోలీసులు. 144 అమల్లో ఉందని.. ఎవరికీ అనుమతి లేదని స్పష్టంచేశారు. ఆదేశాలను ధిక్కరించినవారిని అదుపులోకి తీసుకున్నారు. సరిహద్దు వివాదంపై ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ చీఫ్, శివసేన ఎంపీ ధైర్యశీల్ మానే.. బెళగావిలోకి రాకుండా నిషేధం విధించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సువర్ణ సౌధ భవనం సహా నగరవ్యాప్తంగా దాదాపు 5వేలమందితో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు కర్నాటక పోలీసులు.
Also Read: PM Modi: ప్రధాని మోడీతో గూగుల్ సీఈవో సమావేశం..కీలక విషయాలపై చర్చ!
అటు మహారాష్ట్ర అసెంబ్లీలోనూ సరిహద్దు వివాదంపై రచ్చ జరిగింది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడుతోందంటూ షిండే ప్రభుత్వంపై ధ్వజమెత్తాయి మహా వికాస్ అగాడీ పార్టీలు. అసెంబ్లీ లోపల, వెలుపల ఆందోళన చేపట్టాయి. దీనికి సభలో దీటుగా బదులిచ్చారు ముఖ్యమంత్రి ఏక్నాథ్. సరిహద్దు వివాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా మధ్యవర్తిత్వం చేస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో రాజకీయం తగదని.. అందరూ కలిసి సరిహద్దు గ్రామాల ప్రజలకు అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు.
Related News
TDP : సతీసమేతంగా మహారాష్ట్రలో టీడీపీ అధినేత పర్యటన
Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన భార్య నారా భువనేశ్శరి(Bhuvaneshari)తో కలిసి ఈరోజు మహారాష్ట్ర (Maharashtra)లోని కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని(Kolhapur Sri Mahalakshmi Temple) సందర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు దంపతులు అలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజులు నిర్వహించారు. ఆలయ వర్గాలు చంద్రబాబు దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం చంద్రబాబు, నారా భువనేశ్వరి షిరిడీ పయనమయ్యారు. అక్కడ సాయిన