HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Bjp Election Commission Collusion Rahul Gandhi Calls It A Mockery Of Democracy

Voter Adhikar Yatra : బీజేపీ-ఎన్నికల సంఘం కుమ్మక్కు: ప్రజాస్వామ్యానికి అపహాస్యమన్న రాహుల్ గాంధీ

ఇది కేవలం ఓటింగ్ ప్రాసెస్‌ను చెక్కుమణిపెట్టడం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని భూస్థాపితం చేయడమే అని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 65 లక్షల ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించబడ్డాయని ఈ చర్యలు పక్కా ప్రణాళిక కింద జరుగుతున్నట్లు ఆరోపించారు.

  • By Latha Suma Published Date - 01:23 PM, Thu - 28 August 25
  • daily-hunt
BJP-Election Commission collusion: Rahul Gandhi calls it a mockery of democracy
BJP-Election Commission collusion: Rahul Gandhi calls it a mockery of democracy

Voter Adhikar Yatra : బీజేపీ ఓట్లను అక్రమంగా దోచుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ‘ఓటర్ అధికార్ యాత్ర’ పేరుతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ప్రారంభించిన పాదయాత్రలో భాగంగా ఆయన ఈ రోజు సీతామఢిలో మాట్లాడారు. బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని వాడుకొని ప్రజల ఓటు హక్కును కాలరాస్తోంది. ఇది కేవలం ఓటింగ్ ప్రాసెస్‌ను చెక్కుమణిపెట్టడం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని భూస్థాపితం చేయడమే అని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 65 లక్షల ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించబడ్డాయని ఈ చర్యలు పక్కా ప్రణాళిక కింద జరుగుతున్నట్లు ఆరోపించారు.

Read Also: AP : ఏపీలో విస్తారంగా వర్షాలు..పరిస్థితిపై హోంమంత్రి అనిత సమీక్ష

ఈ తొలగింపుల్లో అత్యధికంగా దళితులు, గిరిజనులు, ఇతర సామాజికంగా బలహీన వర్గాలవారు ఉన్నారు. ఇవి యాదృచ్ఛికంగా జరిగాయంటే నమ్మశక్యం కాదు. ఇది ఓట్ల దొంగతనం. ప్రజల హక్కులను దారుణంగా పక్కదారి పట్టించడం” అని ఆయన మండిపడ్డారు. బిహార్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన రాహుల్ గాంధీ, “బీజేపీ అనేది ‘ఓట్ చోర్‌’ పార్టీ. ఇది అధికారాన్ని తమ వద్ద నిలుపుకునేందుకు ప్రజల నమ్మకాన్ని మోసం చేస్తోంది. కానీ బిహార్ ప్రజలు, తమ ఓటు హక్కును ఈ విధంగా అపహరించుకోవడానికి ఒప్పుకోరు అని అన్నారు. ఈ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ సీతాదేవి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ కార్యక్రమంలో యువత, మహిళలు, రైతులు, కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల చేత మద్దతుతో ఏర్పడలేదు. ఇది కూడా ఓట్ల దొంగతనమే. ప్రధాని నరేంద్ర మోడీ సహా బీజేపీ నేతలు ఎన్నికలను ప్రభావితం చేసేందుకు వ్యవస్థలన్నింటినీ వాడుకుంటున్నారు  అని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం ప్రజల ఓటు హక్కును అణగదొక్కుతున్నారని  ఇది దేశానికి ముప్పుగా మారుతోందని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఆధారాలతో సహా ఈ కుట్రను బహిర్గతం చేస్తాం అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆగస్టు 17న ప్రారంభమైన ఈ ‘ఓటర్ అధికార్ యాత్ర’ మొత్తం 1300 కిలోమీటర్ల పాదయాత్రగా 16 రోజులపాటు కొనసాగనుంది. ఈ పాదయాత్ర ద్వారా బిహార్ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లోని గ్రామాల వరకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు, అలాగే ఎన్నికల విధానంపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. యాత్ర ముగింపు వేడుకలు సెప్టెంబర్ 1న పట్నాలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభతో జరగనున్నాయి. దీనికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశముంది.

Read Also: Telangana : కుండపోత వర్షాలు..వరదలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, అధికారులకు కీలక ఆదేశాలు

 

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bihar Elections
  • Bihar politics
  • bjp
  • congress
  • Election commission
  • lok sabha
  • rahul gandhi
  • Sitamarhi
  • Vote theft
  • Voter Adhikar Yatra

Related News

Folk Singer Maithili Thakur

Bihar Elections : 25 ఏళ్ల సింగర్ కు బీజేపీ ఎమ్మెల్యే టికెట్

Bihar Elections : బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కళా ప్రపంచం నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన మరో కొత్త పేరు వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ఫోక్ సింగర్ మైథిలి ఠాకూర్ (Folk Singer Maithili Thakur) బీజేపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు

  • Bihar Jdu

    Bihar : బిహార్ లో 57 మందితో JDU తొలిజాబితా

  • Jubilee Hills Bypoll Exit P

    Jubilee Hills Bypoll Exit Poll : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం

  • Ktr Jubilee Hills Bypoll Ca

    Jubilee Hills Bypoll : కేటీఆర్ ఏంటి ఈ దారుణం..?

  • Bihar Elections

    Bihar Elections : బిహార్ ఎలక్షన్స్.. బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్

Latest News

  • ‎Pregnancy Diet: తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే.. ప్రెగ్నెన్సీ టైంలో వీటిని తప్పకుండా తినాల్సిందే!

  • ‎Diwali: దీపావళి రోజు ఏ దీపాలను వెలిగించాలి.. నూనె, నెయ్యి.. దేనిని ఉపయోగించాలో తెలుసా?

  • ‎Karthika Masam: కార్తీక మాసంలో ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదో మీకు తెలుసా?

  • Harish Rao: భర్తను తలచుకొని ఏడుస్తే.. చిల్లర రాజకీయాలా? – హరీశ్‌రావు ఫైర్

  • Maoist Ashanna : మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. లొంగిపోనున్న ఆశన్న టీమ్!

Trending News

    • Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

    • Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

    • Employees : ఉద్యోగులకు కేంద్రం శుభవార్త..!

    • Bigg Boss : నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటా.. ఇష్టం వచ్చినట్టు తింటా – దివ్వెల మాధురి..!

    • Tata Motors : ఒక్కరోజే 40 శాతం తగ్గిన టాటా మోటార్స్ షేర్ ధర!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd