HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Bjp Election Commission Collusion Rahul Gandhi Calls It A Mockery Of Democracy

Voter Adhikar Yatra : బీజేపీ-ఎన్నికల సంఘం కుమ్మక్కు: ప్రజాస్వామ్యానికి అపహాస్యమన్న రాహుల్ గాంధీ

ఇది కేవలం ఓటింగ్ ప్రాసెస్‌ను చెక్కుమణిపెట్టడం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని భూస్థాపితం చేయడమే అని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 65 లక్షల ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించబడ్డాయని ఈ చర్యలు పక్కా ప్రణాళిక కింద జరుగుతున్నట్లు ఆరోపించారు.

  • By Latha Suma Published Date - 01:23 PM, Thu - 28 August 25
  • daily-hunt
BJP-Election Commission collusion: Rahul Gandhi calls it a mockery of democracy
BJP-Election Commission collusion: Rahul Gandhi calls it a mockery of democracy

Voter Adhikar Yatra : బీజేపీ ఓట్లను అక్రమంగా దోచుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ‘ఓటర్ అధికార్ యాత్ర’ పేరుతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ప్రారంభించిన పాదయాత్రలో భాగంగా ఆయన ఈ రోజు సీతామఢిలో మాట్లాడారు. బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని వాడుకొని ప్రజల ఓటు హక్కును కాలరాస్తోంది. ఇది కేవలం ఓటింగ్ ప్రాసెస్‌ను చెక్కుమణిపెట్టడం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని భూస్థాపితం చేయడమే అని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 65 లక్షల ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించబడ్డాయని ఈ చర్యలు పక్కా ప్రణాళిక కింద జరుగుతున్నట్లు ఆరోపించారు.

Read Also: AP : ఏపీలో విస్తారంగా వర్షాలు..పరిస్థితిపై హోంమంత్రి అనిత సమీక్ష

ఈ తొలగింపుల్లో అత్యధికంగా దళితులు, గిరిజనులు, ఇతర సామాజికంగా బలహీన వర్గాలవారు ఉన్నారు. ఇవి యాదృచ్ఛికంగా జరిగాయంటే నమ్మశక్యం కాదు. ఇది ఓట్ల దొంగతనం. ప్రజల హక్కులను దారుణంగా పక్కదారి పట్టించడం” అని ఆయన మండిపడ్డారు. బిహార్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన రాహుల్ గాంధీ, “బీజేపీ అనేది ‘ఓట్ చోర్‌’ పార్టీ. ఇది అధికారాన్ని తమ వద్ద నిలుపుకునేందుకు ప్రజల నమ్మకాన్ని మోసం చేస్తోంది. కానీ బిహార్ ప్రజలు, తమ ఓటు హక్కును ఈ విధంగా అపహరించుకోవడానికి ఒప్పుకోరు అని అన్నారు. ఈ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ సీతాదేవి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ కార్యక్రమంలో యువత, మహిళలు, రైతులు, కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల చేత మద్దతుతో ఏర్పడలేదు. ఇది కూడా ఓట్ల దొంగతనమే. ప్రధాని నరేంద్ర మోడీ సహా బీజేపీ నేతలు ఎన్నికలను ప్రభావితం చేసేందుకు వ్యవస్థలన్నింటినీ వాడుకుంటున్నారు  అని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం ప్రజల ఓటు హక్కును అణగదొక్కుతున్నారని  ఇది దేశానికి ముప్పుగా మారుతోందని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఆధారాలతో సహా ఈ కుట్రను బహిర్గతం చేస్తాం అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆగస్టు 17న ప్రారంభమైన ఈ ‘ఓటర్ అధికార్ యాత్ర’ మొత్తం 1300 కిలోమీటర్ల పాదయాత్రగా 16 రోజులపాటు కొనసాగనుంది. ఈ పాదయాత్ర ద్వారా బిహార్ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లోని గ్రామాల వరకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు, అలాగే ఎన్నికల విధానంపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. యాత్ర ముగింపు వేడుకలు సెప్టెంబర్ 1న పట్నాలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభతో జరగనున్నాయి. దీనికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశముంది.

Read Also: Telangana : కుండపోత వర్షాలు..వరదలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, అధికారులకు కీలక ఆదేశాలు

 

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bihar Elections
  • Bihar politics
  • bjp
  • congress
  • Election commission
  • lok sabha
  • rahul gandhi
  • Sitamarhi
  • Vote theft
  • Voter Adhikar Yatra

Related News

Bihar Election Congress

Bihar Election Results Effect : ఏడుగురు నేతలపై కాంగ్రెస్ వేటు

Bihar Election Results Effect : బిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, దీనికి గల కారణాలపై పార్టీలో అంతర్గతంగా సమీక్షలు జరుగుతున్నాయి

  • Deepak Prakash

    Bihar Minister: బిహార్‌లో సర్ప్రైజ్ మంత్రి దీపక్ ప్రకాశ్

  • Siddaramaiah Vs Dk Shivakum

    Siddaramaiah vs DK Shivakumar : సీఎం పదవి పై డీకేకు అధిష్టానం క్లారిటీ!

  • Tejashwi Yadav

    Bihar Elections : ఓటమి తర్వాత తేజస్వీ యాదవ్ ఫస్ట్ రియాక్షన్

  • Nishant Kumar

    Nishant Kumar: ఎవరీ నిశాంత్ కుమార్‌.. సీఎం నితీష్ కుమార్‌కు ఏమ‌వుతారు?!

Latest News

  • India vs South Africa: రెండో టెస్ట్‌లో భారత్‌కు భారీ లక్ష్యం.. టీమిండియా గెలుపు క‌ష్ట‌మేనా?!

  • Telangana Cabinet Decisions : తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు

  • H5N5 Virus: కరోనా తర్వాత ప్రపంచంలోకి కొత్త వైరస్!

  • Tata Sierra: భార‌త మార్కెట్‌లోకి తిరిగి వ‌చ్చిన‌ టాటా సియెర్రా.. బుకింగ్‌లు ఎప్ప‌ట్నుంచి అంటే?!

  • Billionaire List: స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలు.. ప్రపంచ కుబేరుల జాబితాలో పెను మార్పులు!

Trending News

    • Miss Universe-2025 : ర్యాంప్ వాక్ చేస్తూ కిందపడ్డ మిస్ యూనివర్స్ బ్యూటీ

    • Private Travels Ticket Rates : సంక్రాంతికి ఊరు వెళ్దామనుకుంటున్నారా.. మీకో బ్యాడ్‌న్యూస్!

    • Andhra Pradesh Government : వారంతా రూ.10 వేలు చెల్లించాల్సిన అవసరం లేదు.. పూర్తిగా ఉచితం.!

    • Bank: రేపు ఈ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయా?

    • Punjabi Cremation: ధర్మేంద్రకు తుది వీడ్కోలు.. సిక్కు సంప్రదాయంలో అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd