HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Aap To Contest All Seats In Mp Assembly Elections 2023

Madhya Pradesh Elections: ఆప్ మరో కీలక ప్రకటన.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ

ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ సార‌థ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మ‌రో ప్రకటన చేసింది. ఈ ఏడాది చివరలో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 230 స్థానాల్లో పోటీ చేయనుంది. ప్రజలు కనెక్ట్ కావడానికి ఆమ్ ఆద్మీ పార్టీ మిస్డ్ కాల్ నంబర్‌ను కూడా జారీ చేసింది.

  • Author : Gopi Date : 05-02-2023 - 1:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Arvind Kejriwal
Arvind Kejriwal (2)

ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ సార‌థ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మ‌రో ప్రకటన చేసింది. ఈ ఏడాది చివరలో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 230 స్థానాల్లో పోటీ చేయనుంది. ప్రజలు కనెక్ట్ కావడానికి ఆమ్ ఆద్మీ పార్టీ మిస్డ్ కాల్ నంబర్‌ను కూడా జారీ చేసింది. దీనితో పాటు.. పంజాబ్, ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత సౌకర్యాల హామీ కూడా ఇచ్చారు.

పంజాబ్, ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కన్ను మధ్యప్రదేశ్ పై పడింది. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన పార్టీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్ మాట్లాడుతూ.. “కాంట్రాక్ట్ కార్మికుల కన్ఫర్మేషన్ మధ్యప్రదేశ్‌లో ఆప్ ప్రధాన అంశంగాఉంటుంది. ఢిల్లీ-పంజాబ్ ల‌లో మాదిరిగా సంక్షేమ ప‌థ‌కాలు తీసుకువ‌స్తాం.” అని అన్నారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉందని ఆయన అన్నారు.

కాగా, మధ్యప్రదేశ్‌లోని అన్ని స్థానాలపై ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటనతో కాంగ్రెస్ లో టెన్షన్ పెరిగింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చిన కాంగ్రెస్‌ శిబిరంలో గుజరాత్‌ తరహాలో ఆమ్‌ ఆద్మీ పార్టీ చెలరేగిపోతుందన్న ఆందోళన నెలకొంది. గతేడాది గుజరాత్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేసింది. ఎన్నికల ఫలితాల తర్వాత ఆమ్ ఆద్మీ 5 సీట్లు గెలుచుకుంది. అయితే ఆప్ సాధించిన ఓట్ల శాతం అందరినీ, ముఖ్యంగా కాంగ్రెస్‌ను ఆశ్చర్యపరిచింది. ఆప్‌కి 12.9 శాతం ఓట్లు వచ్చాయి. ఇది కాకుండా 35 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ రన్నరప్‌గా నిలిచింది.

Also Read: Chinese Apps Ban: మరో 232 చైనా యాప్‌లపై కేంద్రం నిషేధం

గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి 16 సీట్లు మాత్రమే వచ్చాయి. గతంలో 2017లో కాంగ్రెస్‌కు 77 సీట్లు వచ్చాయి. 2017లో కాంగ్రెస్‌కు దాదాపు 43 శాతం ఓట్లు రాగా, 2022 నాటికి అది 27 శాతానికి పడిపోయింది. కాంగ్రెస్ ఓట్ల శాతం 16 శాతం తగ్గగా.. ఆప్ కు దాదాపు 13 శాతం ఓట్లు రావడం గమనార్హం. కాంగ్రెస్‌ ఓట్లు ఆప్‌కి మారాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యప్రదేశ్‌లోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించి కాంగ్రెస్‌లో టెన్షన్‌ను పెంచింది. గుజరాత్‌లో మాదిరిగా మధ్యప్రదేశ్‌లోనూ ఆమ్‌ ఆద్మీ పార్టీ ఓట్లను చీల్చడంలో విజయం సాధిస్తే.. కాంగ్రెస్‌కు దారి కష్టమే. ఇది అసెంబ్లీ ఎన్నికలకే కాదు, వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ఝలక్ ఇవ్వొచ్చు. రాజస్థాన్‌లో కూడా ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆప్ ఇప్పటికే ప్రకటించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AAP
  • bjp
  • congress
  • Madhya Pradesh
  • Madhya Pradesh Elections
  • MP Assembly Election 2023

Related News

Dk Shiva Kumar

Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

రాజీనామాతో కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ శాసనసభ పక్షం (సీఎల్పీ) శనివారం సమావేశమై కొత్త నాయకుడిని ఎన్నుకోనున్నారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివ‌కుమార్‌ను సీఎల్పీ నేతగా ఎంపిక చేసి తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశాలు బ‌లంగా కనిపిస్తున్నాయి. కర్ణాటక గవర్నర్ సిద్దరామయ్య రాజీనామాను ఆమోదించి మంత్రివర్గాన్ని రద్దు చేయడంతో అధికారికంగ

  • Tbjp Chief Ramchandar Rao

    BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

  • AP

    AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

  • Cm Revanth

    Telangana : ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చిన రేవంత్ ప్రభుత్వం

  • Gade Venkatreddy

    Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

Latest News

  • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

  • Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు

  • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

  • Land Scam : హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

  • Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd