HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pm Modi Calls Cm Chandrababu

CM Chandrababu: సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ధాని మోదీ ఫోన్‌!

ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా యుద్ధప్రాతిపదికన ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలని, వారికి 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసరాలు అందించాలని సూచించారు.

  • Author : Gopichand Date : 27-10-2025 - 8:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Chandrababu
CM Chandrababu

CM Chandrababu: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుఫాన్ రాష్ట్రం వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (CM Chandrababu)తో ప్రధానమంత్రి మోదీ సోమవారం ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యల గురించి ప్రధాని ఆరా తీశారు. ఈ సందర్భంగా తుఫాన్ ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని, అవసరమైన సహాయాన్ని తక్షణమే అందజేస్తుందని ప్రధాని మోదీ సీఎం చంద్రబాబుకు హామీ ఇచ్చారు.

పీఎంవోతో సమన్వయానికి లోకేశ్

తుఫాను తీవ్రత, సహాయక చర్యలపై ప్రధానితో చర్చించిన అనంతరం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో)తో నిరంతరం సమన్వయం చేసుకుంటూ కేంద్ర సహకారం సకాలంలో అందేలా చూసే బాధ్యతను మంత్రి నారా లోకేశ్‌కు అప్పగించింది.

Also Read: Montha Toofan : తుఫాన్ పై చేస్తున్న అసత్య ప్రచారంపై పవన్ ఆగ్రహం

ప్రభుత్వం అప్పగించిన బాధ్యత మేరకు మంత్రి లోకేశ్ తక్షణమే పీఎంవోతో సమన్వయం చేయడం ప్రారంభించారు. ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుంచే ఆయన తుఫాన్ ప్రభావాన్ని, సహాయక చర్యల పురోగతిని సమీక్షిస్తూ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం చేస్తున్నారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో నిరంతరం టెలికాన్ఫరెన్సులు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను లోకేశ్ ఆదేశిస్తున్నారు.

సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

మరోవైపు మొంథా తుఫాన్ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ (RTGS) కేంద్రం ద్వారా మంత్రులు, ఉన్నతాధికారులతో అత్యవసర ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తుఫాన్ కదలికలను ప్రతి గంటకూ గమనిస్తూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా యుద్ధప్రాతిపదికన ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలని, వారికి 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసరాలు అందించాలని సూచించారు. కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం కలగకుండా శాటిలైట్ ఫోన్లు వినియోగించాలని, విద్యుత్ పునరుద్ధరణ కోసం జనరేటర్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. తుఫాన్ సహాయక చర్యల కోసం అక్టోబర్ 30 వరకు అధికారులకు సెలవులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం పూర్తి భరోసా ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సన్నద్ధతలతో మొంథా తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap news
  • CM Chandrababu
  • pm modi
  • telugu news

Related News

Global Summit

Global Summit: గ్లోబల్ సమ్మిట్‌.. తెలంగాణ‌కు వ‌చ్చిన పెట్టుబ‌డులు ఎంతంటే?!

డిజిటల్ రంగాన్ని దాటి, అనేక ఇతర ముఖ్యమైన తయారీ, పరిశోధన (R&D) రంగాలలో కూడా అధిక విలువైన పెట్టుబడులు సాధించబడ్డాయి.

  • Zelensky

    Zelensky: భార‌త్‌కు జెలెన్‌స్కీ.. జ‌న‌వ‌రిలో వ‌చ్చే అవ‌కాశం?!

  • Kuchipudi Dance

    Kuchipudi Dance: కూచిపూడి కళకు ఆధ్యాత్మిక కాంతి.. హైదరాబాద్‌లో యామిని రెడ్డి తొలి ప్రదర్శన!

  • Rahul Gandhi

    Rahul Gandhi: లోక్‌సభలో ఎన్నికల సంస్కరణలపై రాహుల్ గాంధీ చర్చ!

  • Deputy CM Bhatti

    Deputy CM Bhatti: పెట్టుబడులకు ఆవిష్కరణలు తోడు కావాలి: డిప్యూటీ సీఎం భ‌ట్టి

Latest News

  • Shreyas Iyer: ఐపీఎల్ వేలం టేబుల్‌పైకి శ్రేయ‌స్ అయ్య‌ర్‌!

  • Tulsi: ప్రతిరోజూ తులసి ఆకులు తినడం వల్ల ఇలాంటి లాభాలా?!

  • IPL 2026 Purse: ఐపీఎల్ 2026 వేలం.. ఏ జట్టు దగ్గర ఎంత డబ్బుంది?

  • WiFi Password: వై-ఫై పాస్‌వర్డ్ మార్చడం లేదా? అయితే ప్ర‌మాద‌మే!

  • Best Selling Scooters: రూ. లక్షలోపు బడ్జెట్‌లో బెస్ట్ స్కూటర్లు.. మైలేజ్, పర్ఫార్మెన్స్ అదుర్స్!

Trending News

    • UNESCO: దీపావళికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా!

    • Samantha: భ‌ర్త‌కు షాక్ ఇచ్చిన స‌మంత‌.. అస‌లు మేట‌ర్ ఏంటంటే?!

    • T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ను ప్రసారం చేయడానికి జియోస్టార్ ఎందుకు నిరాకరించింది?

    • Expensive Car: భారతదేశంలో అత్యంత ఖరీదైన కారు ఏది? దాని ధర ఎంత?

    • IPL 2026 Mini Auction: ఐపీఎల్ 2026.. అబుదాబిలో డిసెంబర్ 16న వేలం, తుది జాబితాలో 350 మంది ఆటగాళ్లు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd