HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Employee Movement Implications For The Ap Government With The Employees Movement How Will It Solve The Problem

Employee Movement: ACB అస్త్రం!ఉద్యమంలో జగన్ అంకం!

ఏపీ ఉద్యోగులు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి దూకుడు పెంచారు. ఇదే తరుణంలో ప్రభుత్వం కూడా సంఘాల నేతల తలరాతలు మార్చడానికి సిద్ధం అయింది.

  • By CS Rao Published Date - 09:19 AM, Wed - 8 March 23
  • daily-hunt
The Employee's Movement!
Acb Astram Is Ready! Jagan's Number In The Employee's Movement!

ఏపీ ఉద్యోగులు (Employee) ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి దూకుడు పెంచారు. ఇదే తరుణంలో ప్రభుత్వం కూడా సంఘాల నేతల తలరాతలు మార్చడానికి సిద్ధం అయింది. ఉద్యోగుల కోసం జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ప్రభుత్వం లేదని, అందరికోసం అంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఎప్పుడో చెప్పారు. గొంతెమ్మ కోర్కెలు ఎన్ని తీర్చినా ఇంకా ఉంటాయని ఉద్యోగులను మంత్రి బొత్స సత్యనారాయణ ఎత్తి పొడిచాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా మంత్రివర్గం సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగ సంఘాల నేతలను దువ్వె ప్రయత్నం జరిగింది. ప్రస్తుతం 3 వేల కోట్లు ఇస్తామని, పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని చెబుతున్నారు. కానీ, పోరాటం దిశగా ఉద్యోగ సంఘాలు వెళ్ళటం జగన్మోహన్ రెడ్డి కి సవాల్ గా మారింది. అందుకే బడా ఉద్యోగులు, అవినీతి కోరుల మీద ఏసీబీ ని సిద్ధం చేస్తుందని తెలుస్తుంది. ఇప్పటికే కోటీశ్వర్లుగా ఉండే టీడీపీ సానుభూతి ఉద్యోగుల  జాబితా తయారు చేశారని వినికిడి. ఇక వాళ్ళ భరతం పట్టడానికి సమయం కోసం ఏసీబీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంకేతాల కోసం చేస్తుందట.

ఉద్యోగులు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి

ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మ అమరావతి రాష్ట్ర సచివాలయంలో మంత్రుల కమిటీ సమావేశమైన విషయం విదితమే. ఈసమావేశంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్ససత్యనారాయణ,ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్, మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్,ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు)సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్ రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ ఆర్) చిరంజీవి చౌదరి పాల్గొన్నారు.అదే విధంగా ఈసమావేశంలో ఉద్యోగ సంఘాల తరపున రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.వెంకట్రామి రెడ్డి, ఎపిఎన్జీఓ సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు,ఎపి జెఎసి, రెవెన్యూ సర్వీసెస్ సంఘం అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లుతో పాటు వారి వారి సంఘాల ప్రతినిధులు (Employee Movement) పాల్గొన్నారు.

Employee's Movement

మార్చి 9న జరిగే ఉద్యమం యధావిధిగా కొనసాగుతుందని

మంగళవారం చర్చల ఫలితాలపై అన్ని జిల్లాల నాయకత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల నేతల సమావేశమయ్యారు. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ తదితర సంఘాల నేతలు హాజరయ్యారు. ఈసారి కూడా కేఆర్‌ సూర్యనారాయణ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల (Employee’s) సంఘాన్ని ప్రభుత్వం చర్చలకు అహ్వానించలేదు. మంత్రుల కమిటీ సమావేశంలో ఆర్థిక పరమైన అంశాలపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై ప్రభుత్వం ప్రకటన చేయాల్సిందేనని డిమండ్‌ చేశారు. పీఆర్సీ బకాయిలతో పాటు ఇతర అన్ని ఆర్థిక పరమైన వివరాలు చెప్పాలని కోరారు. మార్చి 9న జరిగే ఉద్యమం యధావిధిగా కొనసాగుతుందని నేతలు తేల్చి చెప్పారు. చర్చల ఫలితాలపై అన్ని జిల్లాల నాయకత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పడం హీట్ ఎక్కిస్తుంది.

Also Read: AP Employees : ఉద్యోగుల‌పై జ‌గ‌న్ స్వారీ, `క‌మాండ్ అండ్ కంట్రోల్` లో ఉద్య‌మం

మంత్రులు, ఎమ్మెల్యేల కు 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నారని, మరి ఉద్యోగులకు 1వ తేదీనే ఎందుకు జీతాలు వేయడం లేదని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నిచారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు సమయానికే పెన్షన్ ఇస్తున్నారని, ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేయమంటే మాత్రం మాట్లాడటం లేదని విమర్శించారు. ప్రభుత్వం ఏ హామీ ఇచ్చినా లిఖితపూర్వకంగానే ఇవ్వాలని బొప్పరాజు డిమాండ్ చేశారు. మంత్రుల కమిటీ ఏం చెబుతుందో చూస్తామని, అప్పటివరకూ కార్యాచరణ యథావిధిగా కొనసాగుతుందని బొప్పరాజు ప్రకటించారు. ఉద్యోగ సంఘాలకు, ప్రభుత్వానికి మధ్య వార్ నడుస్తూనే ఉంది. సమస్యలను పరిష్కరించాలని, సీపీఎస్‌ ను అమలు చేయాలంటూ చాలా రోజులుగా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఉద్యోగ సంఘాలు ఉద్యమబాట పట్టాయి. ఈనెల 9 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నట్లు ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సరిగ్గా ఇక్కడే జగన్మోహన్ రెడ్డి సర్కారుకు మండుతుంది. అందుకే ఏసీబీ ని అస్త్రంగా ప్రయోగించడానికి సిద్ధం అయిందని తెలుస్తుంది. ఎన్ని అక్రమ చేపలు, తిమింగలాలు బయట పడతాయో చూడాలి. లేదా జగన్మోహన్ రెడ్డికి ఉద్యోగ సంఘాల నేతలు జీ హుజుర్ అంటారో చూద్దాం.

Also Read:  ISRO: ఇస్రోతో భారతీయ రైల్వేల అగ్రిమెంట్.. ట్రైన్స్ రియల్ టైమ్ ట్రాకింగ్ కోసమే


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ACB
  • amaravati
  • andhra pradesh
  • ap
  • Astram
  • employees
  • jagan
  • Movement
  • Number
  • ysr
  • ysrcp

Related News

Nara Lokesh Google Vizag

Nara Lokesh : ఏపీకి పెట్టుబడులు.. కొందరికి మండుతున్నట్టుంది.. లోకేశ్ సెటైర్లు..!

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు క్యూ కట్టాయి.. ఐటీ కంపెనీలు, భారీ పరిశ్రమలు వస్తున్నాయి. తాజాగా విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్‌ ఏర్పాటుకు ఎంవోయూ కూడా పూర్తైంది. త్వరలోనే మరికొన్ని కంపెనీలు కూడా రాష్ట్రానికి వస్తాయని మంత్రి నారా లోకేశ్ చెప్పుకొచ్చారు. యువతకు లక్షల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. తాజాగా మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. విశాఖపట్నంలో గూగుల్‌ ప

  • Infosys

    Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!

  • Cbn Google

    Google : అప్పుడు HYDకు మైక్రోసాఫ్ట్.. ఇప్పుడు విశాఖకు గూగుల్ – చంద్రబాబు

  • Crda Opening

    Amaravati : CRDA ఆఫీస్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు..ఈ బిల్డింగ్ ప్రత్యేకతలు మాములుగా లేవు !!

  • Group-1 Candidates

    Bankacherla Project : బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక

Latest News

  • Silver Price : దీపావళి తర్వాత సిల్వర్ రేట్ తగ్గుతుందా?

  • AI Vizag : AIకు ఏపీ తొలి గమ్యస్థానంగా మారనుంది – మోదీ

  • Fake Votes : కేటీఆర్ చెప్పింది అంత అబద్దమే..దొంగ ఓట్లు సృష్టిచిందే బిఆర్ఎస్ పార్టీ

  • Telangana Cabinet Meeting : క్యాబినెట్ సమావేశానికి కొండా సురేఖ గైర్హాజరు

  • ‎Tooth Pain: పంటి నొప్పిని భరించలేక పోతున్నారా.. అయితే ఇది పెడితే క్షణాల్లో నొప్పి మాయం!

Trending News

    • Chandrababu : కర్నూలు : ”సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం

    • PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్

    • Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

    • Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

    • Employees : ఉద్యోగులకు కేంద్రం శుభవార్త..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd