HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Tdp Leaders Guidelines Good Governance

CM Chandrababu : ప్రజల్లోకి వెళ్లాలని ఎమ్మెల్యేలు, ఎంపీలకు చంద్రబాబు ఆదేశం

CM Chandrababu : ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా "సుపరిపాలనలో తొలిఅడుగు" కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Author : Kavya Krishna Date : 29-06-2025 - 6:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Chandrababu busy tour... Rapid progress towards development in three districts
CM Chandrababu busy tour... Rapid progress towards development in three districts

CM Chandrababu : ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా “సుపరిపాలనలో తొలిఅడుగు” కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, పరిశీలకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు బలంగా వివరించాలని, అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

Anchor Swetcha Votarkar : తన రెండు కళ్లను దానం చేసిన యాంకర్ స్వేచ్ఛ

గతంలో ప్రజలతో సరైన సంబంధం లేకపోవడం వల్లనే టీడీపీపై దుష్ప్రచారం చోటుచేసుకుందని గుర్తు చేస్తూ, “2014లో మంచి పాలన ఇచ్చినా, ప్రచారం లోపించడంతో ప్రజల నమ్మకాన్ని కోల్పోయాం. ఈసారి అలాంటి పరిస్థితి రానీయకూడదు” అని హెచ్చరించారు. “వివేకానందరెడ్డి హత్య, కోడికత్తి డ్రామాలు – ఇవన్నీ కుట్రలే. ఇలాంటి వాటిపై ప్రజలకు నిజాలు తెలియజేయాల్సిన బాధ్యత మనదే” అన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. “పనిచేయడమే కాదు, చేయలేని పనులకు కారణాలు చెప్పగలగాలి. ప్రజల అంచనాలకు అనుగుణంగా పనిచేయడం అవసరం. ప్రజల నమ్మకమే మన విజయానికి మూలం” అని సూచించారు.

తన ప్రభుత్వంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేతో వ్యక్తిగతంగా మాట్లాడి వారి పనితీరు సమీక్షిస్తానని తెలిపారు. మార్పు అవసరమైతే తగిన సూచనలు, అవసరమైతే కఠిన చర్యలకైనా వెనుకాడబోనని తెలిపారు. “వారసత్వం ఉన్నంత మాత్రాన గుర్తింపు లభించదు. పనిచేసే వారికి మాత్రమే గౌరవం” అన్నారు. విభజన తర్వాత గడిచిన అనుభవాలు విశ్లేషిస్తూ, అభివృద్ధి కొనసాగాలంటే సుస్థిర ప్రభుత్వం అవసరమని వివరించారు. “ఒకే ఏడాదిలో రూ.9,340 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. దీని ద్వారా లక్షల ఉద్యోగాలు వస్తాయి. పోలవరం, అమరావతి పనులు పునఃప్రారంభమయ్యాయి. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను లాభాల బాటలోకి తీసుకెళ్తున్నాం” అని తెలిపారు.

Cancer Symptoms: గ్యాస్, మలబద్ధకంతో ఇబ్బంది ప‌డుతున్నారా? ఇవి క్యాన్సర్‌కు సంకేత‌మా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • andhra pradesh politics
  • AP Government performance
  • chandrababu naidu
  • good governance
  • lok sabha
  • polavaram
  • tdp
  • TDP campaign
  • YSRCP conspiracies

Related News

Weightage for employees based on performance... CM Chandrababu new policy

AP Local Body Elections : స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు క్లారిటీ

ఈ ఎన్నికలు కూటమి ప్రభుత్వానికి ఒక పెద్ద అగ్నిపరీక్షగా మారనున్నాయి. గ్రామాల్లో రాజకీయ వాతావరణం ఎప్పుడూ వేడిగా ఉంటుంది, కాబట్టి అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు జాగ్రత్తగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు

  • Chinnivskolikapudi

    TDP : కొలికపూడి Vs చిన్ని.. దేవుడి ముందే రచ్చ!

  • Mk Stalin Roja

    తమిళనాడులో డీఎంకే తరపున రోజా ప్రచారం

Latest News

  • చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం

  • War Effect : భారీగా పెరిగిన పెట్రోల్ ధర ..లీటర్ రూ. 321.17 పైసలు

  • రణవీర్ సింగ్ ధురంధర్ 2 ట్రైలర్‌ వచ్చేసింది..

  • Allu Sirish Wedding : అటు చిరు..ఇటు చరణ్ మధ్యలో పవన్ ! వాటే మెగా మూమెంట్ !!

  • Vijayawada Durgamma Temple: దుర్గమ్మ ఆలయ క్యూలైన్ లో 50 లక్షల బంగారం మాయం !!

Trending News

    • టీ20 ప్రపంచకప్ ఫైనల్.. న్యూజిలాండ్‌పై భార‌త్‌దే పైచేయి?!

    • ఏ కారు కొంటే మంచిది?!

    • ఇరాన్‌కు సాయం చేస్తున్న ర‌ష్యా?!

    • మార్చి 31లోపు ఈ ప‌నులు పూర్తి చేయాల్సిందే!

    • 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్‌ మీడియా నిషేధం: కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd