HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Andhra Pradesh Is The Number 1 Marine State In The Country

Number 1 : నంబర్‌ 1 మెరైన్‌ స్టేట్‌గా ఏపీ.. నదులు, సముద్రాలకు కాలుష్య గండం

Number 1 : దేశంలోనే నంబర్‌ 1 మెరైన్‌ స్టేట్‌గా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

  • Author : Pasha Date : 19-11-2023 - 9:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Number 1
Number 1

Number 1 : దేశంలోనే నంబర్‌ 1 మెరైన్‌ స్టేట్‌గా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 21న జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా అహ్మదాబాద్‌లో కేంద్ర మంత్రి చేతుల మీదుగా ట్రోఫీ, సర్టిఫికెట్‌, అవార్డును ఏపీ అధికారులకు ప్రదానం చేయనున్నారు. గతంలోనూ ఏపీ ఈ అవార్డును దక్కించు­కుంది. ఈ నేపథ్యంలో  మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆ శాఖ అధికారులు, సిబ్బందికి ట్విట్టర్‌  ద్వారా అభినందనలు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ఆంధ్రప్రదేశ్‌‌కు సుదీర్ఘమైన 974 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. సముద్రం మీద ఆధారపడి జీవనం సాగించే మత్స్యకారుల జనాభా (2011 లెక్కల ప్రకారం) దాదాపు 6.05 లక్షలు ఉంది. వీరిలో సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల సంఖ్య 1.50 లక్షలు. అప్పటి లెక్కల ప్రకారం 12,747 మోటారైజ్డ్‌, 1771 మెకనైజ్డ్‌, 14,677 సాంప్రదాయ బోట్లు రాష్ట్రంలో ఉండేవి. గడిచిన పన్నెండేళ్ల కాలంలో సాంప్రదాయ, మోటరైజ్డ్‌ బోట్ల సంఖ్య భారీగా తగ్గింది. వాటి స్థానంలో మెకనైజ్డ్‌ బోట్లు పెరిగాయి. అత్యంత ఆధునిక నౌకలు చేపల వేటకు అందుబాటులోకి వచ్చాయి. వందల కోట్లు పెట్టుబడులుగా పెట్టగల కార్పొరేట్లు ఈ రంగంలోకి ఇప్పుడు ప్రవేశిస్తున్నారు. ఈనేపథ్యంలో జలచరాలకే కాదు.. మత్య్పకారుల ఉనికికి కూడా ప్రమాదం ముంచుకొచ్చింది. కాలుష్యం కారణంగా చోటుచేనుకుంటున్న వాతావరణ మార్పులతో సముద్రాలు ఉప్పొంగి, మత్స్యకారుల ఆవాసాలను ముంచెత్తుతున్నాయి. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌ తూర్పుతీరంలోని లక్షలాది మంది మత్స్యకారుల బతుకులు తీవ్రంగా ప్రభావితమౌతున్నాయి.

Also Read: Whats Today : నడ్డా, కేసీఆర్, కేటీఆర్ సుడిగాలి పర్యటనలు

సముద్ర జలాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుండటంతో కేంద్రం అనుసరిస్తున్న విధానాలు మత్స్యకారులను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. నదులలో ఏటికేడాది కాలుష్యం పెరుగుతోంది. సముద్రపు ఒడ్డున కూడా విచ్చలవిడిగా పరిశ్రమలకు అనుమతిస్తుండటంతో సముద్రమూ కాలుష్య సాగరంగా మారుతోంది. నదుల్లో చేరుతున్న కాలుష్యానికైతే లెక్కలున్నాయిగానీ, సముద్రంలో కలుస్తున్న విషపదార్థాలపై పూర్తిస్థాయి సమాచారం లేదు.ఫలితంగా వందల రకాల సముద్ర జీవజాలం, చేపల జాతుల ఉనికి ఇప్పుడు కనిపించడం లేదు. బంగాళాఖాతం పొడవునా ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో భూమి కోతకు గురవుతోంది. కేంద్రమంత్రి డాక్టర్‌ జితేంద్రనాథ్‌ ఇటీవల పార్లమెంటులో చేసిన ప్రకటన ప్రకారం ఏపీలో ఇప్పటికే 294.89 కిలోమీటర్ల మేర భూమి కోతకు గురైంది. ఇది మొత్తం తీర ప్రాంతంలో 28.7 శాతం. తీర ప్రాంతాలలోని కర్మాగారాల నుంచి విడుదలయ్యే కాలుష్య పదార్థాలు పెద్ద ఎత్తున బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. దీనిని నియంత్రిస్తున్నట్లు, కాలుష్య నివారణకు చట్టాలను కఠినంగా వినియోగిస్తున్నట్లు.. ప్రభుత్వం చెబుతున్న విషయాలు మాటలకే పరిమితం. దీని ప్రభావం మత్య్స సంపదపైనే పెద్ద ఎత్తున(Number 1) పడుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap
  • AP government
  • Marine State
  • Number 1

Related News

Good news from the government for those waiting for pensions.

Andhra Pradesh: పెన్షన్ల కోసం వేచి చూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్..

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వితంతు మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో త్వరలోనే కొత్తగా 2.20 లక్షల మందికి వితంతు పింఛన్లను మంజూరు చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. అర్హులైన మహిళలకు రాబోయే ఒకటి రెండు నెలల్లో ప్రతి నెలా రూ. 4 వేల చొప్పున పింఛను అందించేలా మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఏప

  • Good news for farmers in AP: Date fixed for 'Annadatha Sukhibhava' funds release.

    Annadata Sukhibhava: ఏపీలోని రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ నిధులకు ముహూర్తం ఫిక్స్

  • South African star cricketer Jonty Rhodes met Minister Nara Lokesh.

    Jonty Rhodes: మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌

  • Another key project for AP from the Central Government: An NCC Special Directorate.

    Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు.. ఎన్‌సీసీ ప్రత్యేక డైరెక్టరేట్‌

  • MSME Parks Offer Massive Job Opportunities for Youth: Minister Bharat

    TG Bharath: యువతకు ఉపాధి కల్పనలో ఎంఎస్‌ఎంఈ పార్కులు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్

Latest News

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

  • Cm Vijay: కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం

  • Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

  • Kesineni Nani : గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై చంద్ర‌బాబుకు లేఖ రాసిన మాజీ ఎంపీ కేశినేని నాని

  • TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd