Whats Today : నడ్డా, కేసీఆర్, కేటీఆర్ సుడిగాలి పర్యటనలు
Whats Today : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేేేపీ నడ్డా ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్టులో దిగుతారు.
- By Pasha Published Date - 09:12 AM, Sun - 19 November 23
Whats Today : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్టులో దిగుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో నేరుగా నారాయణపేటకు చేరుకుని మధ్యాహ్నం 2 గంటల దాకా అక్కడి సభలో పాల్గొంటారు. ఆ వెంటనే మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల దాకా చేవెళ్ల సభలో పాల్గొంటారు. సాయంత్రం 6.30 గంటల నుంచి మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో జరిగే రోడ్షోలో పాల్గొంటారు. రాత్రి 9 గంటలకు బేగంపేటకు చేరుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.
- రేపు (సోమవారం) కొల్లాపూర్, ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రచారం నిర్వహిస్తారు.
- సీఎం కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఆలంపూర్, మధ్యాహ్నం 3కి కొల్లాపూర్, సాయంత్రం 4 గంటలకు నాగర్ కర్నూల్, సాయంత్రం 5 గంటలకు కల్వకుర్తి ప్రజా ఆశీర్వాద సభలలో పాల్గొని ప్రసంగిస్తారు.
- ఇవాళ మంత్రి కేటీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. హెలికాప్టర్ ద్వారా ఉదయం 11 గంటలకు భద్రాచలం చేరుకొని రోడ్ షోలో పాల్గొంటారు. ఒంటి గంటకు ఇల్లెందు, మధ్యాహ్నం 2:30 గంటలకు కొత్తగూడెం, సాయంత్రం 4 గంటలకు అశ్వారావుపేటకు చేరుకొని రోడ్ షోలో పాల్గొని ప్రసంగిస్తారు.
We’re now on WhatsApp. Click to Join.
- ఎమ్మెల్సీ కవిత ఇవాళ ధర్మపురి పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. మొదట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు చేస్తారు. గొల్లపల్లి, పెగడపెళ్లి మండలాల్లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో కవిత మాట్లాడుతారు.
- జగిత్యాల జిల్లా ఎండపెళ్లి మండలం రాజారాంపల్లెలో కాంగ్రెస్ ప్రచార రోడ్ షోలో తీన్మార్ మల్లన్న పాల్గొంటారు.
- తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ పుష్పయాగం జరగనుంది. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. పుష్పయాగం కారణంగా ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని టీటీడీ(Whats Today) రద్దు చేసింది.
Also Read: Priyanka Gandhi : ఇవాళ తెలంగాణకు ప్రియాంక.. వచ్చేవారం సోనియాగాంధీ రాక
Related News
Lok Polls : సింగరేణిని ముంచేందుకు రేవంత్ కుట్రలు – కేసీఆర్
మంచిగ ఉన్న సింగరేణిని ఒకప్పుడు ముంచిన కాంగ్రెస్ .. ఇప్పుడు మరోసారి మోడీతో కలిసి రేవంత్ రెడ్డి సింగరేణిని ముంచేందుకు కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు