HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Aatchutapuram Sez Accident Case Registered Against Essentia Pharma

Aatchutapuram Sez Accident: 18 మంది మృతి.. ఎసెన్షియా ఫార్మాపై కేసు నమోదు!

అచ్యుతాపురంలోని సెజ్‌లో ప్రమాదం జరిగిన ఎసెన్షియా ఫార్మా కంపెనీపై రాంబిల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 106(1), 125(A), 125(B) సెక్షన్ల కింద కేసు పెట్టారు.

  • Author : Gopi Date : 22-08-2024 - 9:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Aatchutapuram Sez Accident
Aatchutapuram Sez Accident

Aatchutapuram Sez Accident: ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో మందుల తయారీ ఫ్యాక్టరీలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందగా, 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందిన సమాచారం ప్రకారం పేలుడు జరిగిన ఫ్యాక్టరీలో (Aatchutapuram Sez Accident) 381 మంది ఉద్యోగులు రెండు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. మ‌ధ్యాహ్నం సమయంలో పేలుడు సంభవించింది. 50 మందికి పైగా ప్రమాదంలో గాయపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలోని మందుల తయారీ కర్మాగారంలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం 2:15 గంటలకు ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. స్థానిక యంత్రాంగం ప్రకారం.. ప్రమాదం సమయంలో యూనిట్‌లో చిక్కుకున్న 13 మందిని రక్షించారు. మంటలు చెలరేగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు క్షతగాత్రులను ఆస్పత్రుల్లో చేర్పించారు.

Also Read: Happy Birthday Megastar : వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్..!

సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు

ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. దీంతో పాటు ప్రజల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం జరిగిన ఈ ప్రమాదం గురించి అనకాపల్లి జిల్లా మెజిస్ట్రేట్ విజయ్ కృష్ణన్ మాట్లాడుతూ.. జిల్లాలోని అచ్యుతాపురంలో ఉన్న ఎస్సెన్షియా అడ్వాన్స్‌డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మధ్యాహ్నం 2:15 గంటలకు అగ్నిప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో రెండు షిఫ్టుల్లో 381 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. భోజన సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. అయితే ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌టివ‌ర‌కు 18 మంది మృతిచెంద‌గా.. 40 మందికి పైగా గాయ‌ప‌డిన‌ట్లు స‌మాచారం అందుతోంది. అయితే ప్ర‌మాదం జ‌రిగిన కంపెనీపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎసెన్షియా ఫార్మాపై కేసు నమోదు

అచ్యుతాపురంలోని సెజ్‌లో ప్రమాదం జరిగిన ఎసెన్షియా ఫార్మా కంపెనీపై రాంబిల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 106(1), 125(A), 125(B) సెక్షన్ల కింద కేసు పెట్టారు. నిన్న జరిగిన పేలుడు ఘటనలో 18 మంది మృతి చెందగా, మరో 40 మందికి గాయాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం మృతదేహాలకు పోస్టుమార్టం కొనసాగుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aatchutapuram Sez Accident
  • Andhrapradesh
  • ap news
  • blast
  • CM Chandrababu
  • Essentia Pharma

Related News

Mahanadu

Mahanadu : ముగిసిన మ‌హానాడు.. వ‌ర్చువ‌ల్‌గా 24 ల‌క్ష‌ల మంది హాజ‌రు

తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకమైన తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 సరికొత్త చరిత్ర సృష్టించింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ మహాసభలో నేతలు, కార్యకర్తలు ఉత్సాహం పాల్గొన్నారు. నరేంద్ర మోడీ పిలుపుమేరకు పొదుపులో భాగంగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడు ప్రపంచానికి కొత్త మార్గం చూపించింది. 1875 క్లస్టర్లు, 12 దేశాల నుంచి వేలాది నాయకులు, కార్యకర్తలు వర్చువల్‌గా పాల్గొన్నార

  • Mahandu 2026

    TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

  • Msme Summit 2026

    AP : ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ – 2026లో కీలక ఒప్పందాలు చేసుకున్న ఏపీ ప్ర‌భుత్వం

Latest News

  • Back To School: బ్యాక్ టు స్కూల్.. పాఠశాలకు వెళ్లమని మీ పిల్లలు మారం చేస్తే..!

  • BJP : సువేందు అధికారి కేబినెట్‌లో 35 కొత్త ముఖాలు.. 41కి చేరిన మంత్రివర్గ బలం

  • Panchumarthi Anuradha: పింఛన్లు పెంచిన ఘనత చంద్రబాబుదే: ఎమ్మెల్సీ అనురాధ

  • CBN : జూన్ 4 రాష్ట్ర విముక్తి దినం : చామవరం సభలో సీఎం చంద్రబాబు

  • Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd