HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >2025 Central Budget Telangana And Ap Expectations

Union Budget 2025: తెలుగు రాష్ట్రాల ఆశలు కేంద్రం బడ్జెట్‌పైనే..!

Union Budget 2025: 2025 కేంద్ర బడ్జెట్‌పై తెలుగు రాష్ట్రాలకు భారీ ఆశలు ఉన్నాయి. అమరావతి నిర్మాణం, పోలవరం, ఆర్ఆర్ఆర్, హైదరాబాద్ మెట్రో వంటి పెద్ద ప్రాజెక్టులకు కేంద్రం నుండి మరిన్ని నిధుల కేటాయింపును కోరుతున్నాయి. ఉచిత పథకాల కారణంగా ఆర్థికంగా ఒడిదుకులు ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాలు, ఈ బడ్జెట్‌లో కేంద్రం ఇచ్చే మద్దతును చాలా ఆశిస్తున్నారు. మరి ఈ బడ్జెట్‌లో వారి ఆశలు నెరవేరుతాయా? లేదా? అన్నది చూసే సమయం వచ్చింది.

  • Author : Kavya Krishna Date : 01-02-2025 - 10:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Amaravati, Hyderabad Metro
Amaravati, Hyderabad Metro

Union Budget 2025: తెలుగు రాష్ట్రాలు 2025 కేంద్ర బడ్జెట్ పై భారీగా ఆశలు పెట్టుకున్నాయి. రెండు రాష్ట్రాలు ఉచిత పథకాల కారణంగా ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంతో, ఈ బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఎంత సాయం అందిస్తుందో అన్న ప్రశ్న కీలకంగా మారింది. భారీ ప్రాజెక్టులకు కేంద్రం మద్దతు ఉంటుంది కాని, రాష్టాలు కేంద్రం నుంచి ఎంత నిధులు పొందుతాయనేది నిర్ధారించాలి.

Telangana Number 1 : ఆర్థిక సర్వే నివేదికలో ప్రస్తావించిన ‘తెలంగాణ’ ఘనతలివీ

అమరావతి నిర్మాణానికి కేంద్రం నుండి నిధుల అభ్యర్థన
గత బడ్జెట్‌లో అమరావతి నిర్మాణం కోసం రూ. 15 వేల కోట్లు కేటాయించగా, ఇవి అప్పుల రూపంలో ఉండి, అందువల్ల పనులు వేగంగా కొనసాగించడం కష్టం కావడంతో, ఈసారి మరిన్ని నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. దావోస్ టూర్ అనంతరం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యి, అవసరమైన నిధులపై చర్చించారు. ఫిబ్రవరి చివరి వారంలో రెండు తెలుగు రాష్ట్రాల బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.

ఇదేకాకుండా.. 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, పోలవరం, అమరావతి నిర్మాణం కోసం కేంద్రం వద్ద హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటికే రూ. 12,500 కోట్లను కేటాయించగా, ఇది 2028 నాటికి పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైన నిధులను త్వరగా మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది.

ఆర్ఆర్ఆర్, మెట్రో రెండో దశ.. భారీ నిధుల అభ్యర్థన
తెలంగాణ ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు కోసం రూ. 34,367 కోట్లు, హైదరాబాద్ మెట్రో రెండో దశకు రూ. 24,269 కోట్లు, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు కోసం రూ. 14,100 కోట్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రధానమంత్రి అవాస్ యోజన కింద నిధులు కేటాయించాలని కోరుతోంది. ఇవి కేంద్ర ప్రభుత్వ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద రాష్ట్రానికి రూ. 1800 కోట్లకు పైగా రావాల్సి ఉంది.

రీజినల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ మెట్రో, మూసీ పునరుజ్జీవన తదితర ప్రాజెక్టులకు రూ. 1.63 లక్షల కోట్లు నిధులు అవసరమవుతాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రధాని మోదీని కలసి, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం పెద్దన్న మాదిరిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు అందించబడే నిధుల ఆధారంగా, రాష్ట్రాలు తమ బడ్జెట్‌ను తయారు చేయనున్నారు.

Sit and Work : ఎక్కువసేపు కూర్చుని పని చేస్తున్నారా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2025 Central Budget
  • amaravati
  • andhra pradesh
  • Budget Expectations
  • hyderabad metro
  • Moosie Revitalization
  • nirmala sitharaman
  • polavaram
  • rrr
  • telangana
  • telugu states

Related News

Komatireddy

Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

మంత్రి కోమ‌టిరెడ్డి వెంట‌క‌రెడ్డి మ‌రోసారి త‌న మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో స్కూల్ ఫీజు చెల్లించలేక, ఉన్నత విద్య కోసం అవసరమైన సర్టిఫికెట్లు పొందడంలో ఇబ్బంది పడుతున్న ప్రతిభావంతురాలైన విద్యార్థిని భవితకు ఆర్థిక సాయం అందించి ఆదుకున్నారు. బోడుప్పల్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని భవిత పదో తరగతిలో 600 మార్కులకు గాను 582 మార్కులు సాధి

  • NRI TDP

    TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

  • Jaggareddy

    TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

  • Accident

    Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

  • TSAT

    T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

Latest News

  • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd