Indus Water Treaty: సింధు జల ఒప్పందం ఏమిటి? నీటి కోసం పాకిస్తాన్కు తిప్పలు తప్పవా!
కాశ్మీర్లోని పహల్గామ్లోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కుదిపేసింది. ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్నారు.
- By Gopichand Published Date - 10:00 AM, Thu - 24 April 25

Indus Water Treaty: కాశ్మీర్లోని పహల్గామ్లోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కుదిపేసింది. ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఘటనలో 26 మంది మరణించారు. ఈ ప్రమాదం తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకుంటూ సింధు జల ఒప్పందాన్ని (Indus Water Treaty) నిలిపివేయాలని నిర్ణయించింది. బుధవారం సాయంత్రం ప్రధానమంత్రి నివాసంలో జరిగిన కేబినెట్ వ్యవహారాల భద్రతా కమిటీ (CCS) సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకోబడింది. అలాగే, భారత ప్రభుత్వం భారత్లోని పాకిస్తానీ రాయబార కార్యాలయాన్ని మూసివేయడం.. ఏ పాకిస్తానీ వ్యక్తికి భారతీయ వీసా ఇవ్వకూడదని నిర్ణయించింది.
సింధు జల ఒప్పందం అంటే ఏమిటి?
భారతదేశం- పాకిస్తాన్ మధ్య ప్రవహించే సింధు నది, దాని ఉపనదుల నీటి పంపిణీ 1960 సెప్టెంబర్ 19న అప్పటి భారత ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ.. పాకిస్తానీ మిలిటరీ జనరల్ అయూబ్ ఖాన్ మధ్య జరిగింది. దీనినే సింధు జల ఒప్పందం అంటారు. ఈ ఒప్పందం ప్రకారం భారత్కు ఉపనదుల నుండి 19.5 శాతం నీరు లభిస్తుంది. అయితే పాకిస్తాన్కు సుమారు 80 శాతం నీరు లభిస్తుంది.
భారత్- పాకిస్తాన్ మధ్య 9 సంవత్సరాల సుదీర్ఘ చర్చల తర్వాత 1960లో ఇరు పక్షాలు సింధు జల ఒప్పందంపై సంతకాలు చేశాయి. తూర్పు నదులపై భారత్కు అధికారం ఉంది. అయితే పశ్చిమ నదులను పాకిస్తాన్ అధీనంలోకి ఇవ్వబడ్డాయి. సింధు నది వ్యవస్థలో మొత్తం ఆరు నదులు ఉన్నాయి. సింధు, సట్లెజ్, జీలం, చెనాబ్, రావి, బియాస్. ఈ ఒప్పందం ప్రకారం భారత్ సింధు నది వ్యవస్థ నీటిలో కేవలం 20 శాతం మాత్రమే ఉపయోగించగలదు. మిగిలిన 80 శాతం నీటిని పాకిస్తాన్కు ఇస్తుంది. ఈ నీరు పాకిస్తాన్కు చాలా ముఖ్యమైనది. ఈ ఒప్పందం రద్దు చేయడం వల్ల పాకిస్తాన్కు సమస్యలు ఎదురవ్వచ్చు.
Also Read: Mosquitoes Bite: షాకింగ్ రిపోర్ట్.. ఏ బ్లడ్ గ్రూప్ వారిని దోమలు ఎక్కువగా కుడతాయి?
నీటి కోసం పాకిస్తాన్ బాధపడుతుందా?
అంటే భారత్ సింధు నది నీటి ప్రవాహాన్ని పాకిస్తాన్కు నిలిపివేస్తుంది. దీనితో పాకిస్తాన్ నీటి కోసం ఇబ్బందులు పడే అవకాశం ఉంది. సింధు నది అరేబియా సముద్రం వరకు పాకిస్తాన్లోని అనేక రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఈ ఒప్పందం ఆగిపోవడం వల్ల పాకిస్తాన్ వ్యవసాయంపై ఎక్కువ ప్రభావం పడుతుంది. దీనితో పాకిస్తాన్లో నీటితో పాటు కరవు పరిస్థితి కూడా రావచ్చు. భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తర్వాత పాకిస్తాన్లోని జనాభా ఆకలి, దాహంతో అలమటించవచ్చు.