HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Supreme Court Has Set Up A Special Sit To Investigate The Tirumala Laddu Row

Supreme Court : తిరుమల లడ్డూపై దర్యాప్తుకు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు

Supreme Court : కల్తీ నెయ్యి విషయమై ఆధారాలు లేకపోయినా కోట్లాది భక్తుల మనోభావాలు గాయపరిచే విధంగా చంద్రబాబు వ్యవహరించాలని సెప్టెంబర్ 30 న జరిగిన విచారణలో కోర్టు తెలిపింది. ఏపీ పోలీసులు, సీబీఐ, FSSAI ప్రతినిధులతో కూడిన సిట్ దర్యాప్తు జరపాలని జస్టిస్ గవాయి తెలిపారు.

  • By Latha Suma Published Date - 12:30 PM, Fri - 4 October 24
  • daily-hunt
Supreme Court has set up a special sit to investigate the Tirumala Laddu Row
Supreme Court has set up a special sit to investigate the Tirumala Laddu Row

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ గత ప్రభుత్వంపై కూటమి ప్రభుత్వ నేతలు చేసిన ఆరోపణలతో తిరుపతి లడ్డూ వివాదాస్పదమైంది. నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిందిగా కోరుతూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఆధారాల్లేకుండా బహిరంగ వ్యాఖ్యలు చేసినందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును తప్పుబట్టిన న్యాయస్థానం ఈరోజు తదుపరి విచారణ చేపట్టింది. నేడు సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ పర్యవేక్షణలో ప్రత్యేక సిట్ బృందం దర్యాప్తు చేయాలని కోరింది. ఈ కేసును సీబీఐ ఎందుకు పర్యవేక్షించకూడదు, కల్తీ జరిగిందని మీరు ఊహించనుకుంటున్నారా అని ప్రశ్నించింది. కల్తీ నెయ్యి విషయమై ఆధారాలు లేకపోయినా కోట్లాది భక్తుల మనోభావాలు గాయపరిచే విధంగా చంద్రబాబు వ్యవహరించాలని సెప్టెంబర్ 30 న జరిగిన విచారణలో కోర్టు తెలిపింది. ఏపీ పోలీసులు, సీబీఐ, FSSAI ప్రతినిధులతో కూడిన సిట్ దర్యాప్తు జరపాలని జస్టిస్ గవాయి తెలిపారు. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో దర్యాప్తు జరిగితే బాగుంటుందని కోర్టు అభిప్రాయపడింది.

Read Also: RK Roja Reaction: సుప్రీంకోర్టు తీర్పుపై మ‌రోసారి స్పందించిన రోజా.. చంద్ర‌బాబే తొంద‌రుప‌డ్డారు..!

కోట్లాది మంది భక్తుల మనోభావాలు, నమ్మకాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సిట్ ఎలా ఉండాలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జే గవాయ్ సూచించారు. ఈ కమిటీలో సీబీఐ డైరెక్టర్ నామినేట్ చేసిన ఇద్దరు అధికారులు ఉండాలి. మరో ఇద్దరు అధికారులు ఏపీ పోలీస్ శాఖ నుంచి ఉండాలి. ఒకరు FSSAI నుంచి ఉండాలి. ఈ కేసును టీటీడీ తరపున సిద్ధార్ధ లూథ్రా, ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ వాదిస్తుండగా కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తున్నారు. రాజకీయంగా లడ్డూపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కోర్టు సూచించింది.

ఈ మేరకు టీటీడీ తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించగా.. సుబ్రమణ్య స్వామి కోర్టుకు స్వయంగా తన వాదనలు వినిపించారు. ఇక కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహత వాదనలు వినిపించారు. ఇక వైవీ సుబ్బారెడ్డి తరఫున కిపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై తమకు నమ్మకం ఉందన్నారు. సిట్ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవని తెలిపారు. అయితే, అందులో కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే బాగుంటుందని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే సీఎం లడ్డూ కల్తీపై ప్రకటన ఎలా చేశారని ప్రశ్నించారు. వివాదం కోర్టులో ఉండగానే నిన్న కూడా ఒకరు ఇదే వివాదంపై మాట్లాడారని కొర్టు దృష్టికి తీసుకొచ్చారు.

Read Also: Car Buyers: పాత కార్ల‌కు చెక్ పెట్టేందుకు కొత్త ఆఫ‌ర్‌.. ఏంటంటే..?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • animal fat
  • CBI supervision
  • Special Sit
  • Supreme Court
  • Tirumala Laddu Row
  • ttd

Related News

Supreme Court Dismissed The

Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

Vote For Note Case : ఈ కేసులో నిందితులుగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు అక్టోబర్ 14కి వాయిదా వేసింది

  • 600 Feet Statue Of Lord Ram

    Statue of Lord Rama : ఒంటిమిట్టలో 600 అడుగుల శ్రీరాముడి విగ్రహం!

  • Jacqueline Fernandez

    Jacqueline Fernandez: రూ. 200 కోట్ల మోసం కేసు.. స్టార్ హీరోయిన్‌కు సుప్రీంకోర్టులో షాక్‌!

  • Vijayawada Utsav Sh

    Vijayawada Utsav 2025: ‘విజయవాడ ఉత్సవ్’కు తొలిగిన అడ్డంకి

Latest News

  • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

  • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

  • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

  • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

  • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd