Trending
-
Emobot : మీరు డిప్రెషన్ లో ఉన్నారా? మీ సెల్ఫీ కెమెరా ఇప్పుడు మీ మెటల్ హెల్త్ ని గుర్తించగలదు, ఎలాగో తెలుసా?
ఈ యాప్ వినియోగదారుల ముఖ కవళికలను విశ్లేషించి, వారి మనోభావాలను గుర్తించడంలో సహాయపడుతుంది. రోజంతా మొబైల్ ఫోన్ ముందు కెమెరా ద్వారా ముఖాన్ని పరిశీలిస్తూ, ఈ యాప్ వినియోగదారుల భావోద్వేగ పరిస్థితిని గ్రాఫ్ రూపంలో చూపిస్తుంది. ఇది స్టెప్ కౌంట్ లేదా హార్ట్ రేట్ ట్రాకర్ల మాదిరిగానే పని చేస్తుంది.
Published Date - 03:40 PM, Thu - 19 June 25 -
Uttam Kumar : గోదావరి-బనకచర్ల అంశం..త్వరలో ఇద్దరు సీఎంల భేటీ : మంత్రి ఉత్తమ్కుమార్
ఈ సమావేశంలో ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఆందోళనలు, న్యాయపరమైన అంశాలను మంత్రి పాటిల్కు వివరించినట్లు తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టు పట్ల రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రైతుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. చట్టబద్ధ అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడమంటే కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను విస్మరించడమే అని మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యానించారు.
Published Date - 03:20 PM, Thu - 19 June 25 -
YS Sharmila: జగన్ ప్రజా సమస్యలపై పోరాటం చేయండి.. బల ప్రదర్శనలు కాదు: షర్మిల
విజయనగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్ నిర్లక్ష్యం వల్లే ఎంతోమంది యువకులు బెట్టింగ్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవలి బల ప్రదర్శనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
Published Date - 02:27 PM, Thu - 19 June 25 -
Lokesh : బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో మంత్రి లోకేశ్ భేటీ..నైపుణ్యాభివృద్ధిపై కీలక చర్చలు
విద్యా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ వినియోగాన్ని పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై లోకేశ్ వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో టీబీఐ సంస్థ విద్యా రంగానికి సాంకేతిక మద్దతు ఇవ్వడానికి ఆసక్తి చూపింది.
Published Date - 02:06 PM, Thu - 19 June 25 -
Israel : ఇజ్రాయెల్లోని మెడికల్ సెంటర్పై ఇరాన్ క్షిపణి దాడి..తీవ్ర ఉద్రిక్తతలు !
ఆస్పత్రిపై దాడి నేపథ్యంలో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి ఎవ్వరూ రాకూడదని, ఇతర ఆస్పత్రులకు వెళ్లాలని ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఇది ఇజ్రాయెల్లో అత్యంత రద్దీగా ఉండే మెడికల్ సెంటర్లలో ఒకటి. అయితే అదృష్టవశాత్తూ నిన్నటితో పోలిస్తే ఈ రోజు దాడికి గురైన అంతస్తును ముందుగానే ఖాళీ చేయించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అంబులెన్స్ సర్వీసు చీఫ్ ఎలిబెన్ తెలిపారు.
Published Date - 12:53 PM, Thu - 19 June 25 -
Election Commission of India : ఓటర్ ఐడీ కార్డుల జారీపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఈ మేరకు, ఓటర్ ఐడీ కోసం దరఖాస్తు చేసినవారికి కేవలం 15 రోజుల్లోపే కార్డులు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం కొత్తగా ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్న వారికే కాకుండా, ఇప్పటికే ఓటర్ ఐడీ ఉన్నవారు తమ వివరాల్లో మార్పులు కోరిన సందర్భాల్లోనూ వర్తిస్తుంది.
Published Date - 12:11 PM, Thu - 19 June 25 -
APSRTC Special : పూరీ జగన్నాథ రథయాత్రకు ఏపీ నుంచి ప్రత్యేక బస్సులు..టికెట్ ధర, బుకింగ్ వివరాలు ఇవే !
జూన్ 27న జరిగే రథయాత్రకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రాష్ట్రం నలుమూలల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ (PNBS), విజయవాడ నుంచి పూరీ రథయాత్రకు ప్రత్యేక బస్సులు ఈ నెల 25వ తేదీ రాత్రి 10 గంటలకు బయలుదేరతాయి. జూన్ 26న యాత్రలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశముంటుంది.
Published Date - 11:31 AM, Thu - 19 June 25 -
Putin : జెలెన్స్కీను కలిసేందుకు సిద్ధమే.. కానీ ఇప్పుడు కాదు: పుతిన్
రష్యా యుద్ధాన్ని వీలైనంత త్వరగా, ప్రాముఖ్యతనిస్తూ శాంతియుత మార్గంలో ముగించాలని చూస్తోంది. కీవ్ మరియు దాని పాశ్చాత్య మిత్రదేశాలు చర్చలకు సిద్ధంగా ఉంటే, మేము కూడా చర్చలకు సిద్ధమేనని ఆయన చెప్పారు.
Published Date - 10:42 AM, Thu - 19 June 25 -
Aadhaar Card: ఇంటి నుంచే నిమిషాల్లో ఆధార్ కార్డ్ను అప్డేట్ చేసుకోండిలా!
ఈ కొత్త అప్లికేషన్ ఈ విధంగా పనిచేస్తుంది. ఒక వ్యక్తి ఇచ్చిన QR కోడ్ను ఉపయోగించి ఆధార్ను ఒక మొబైల్ నుంచి మరో మొబైల్కు లేదా ఒక యాప్ నుంచి మరో యాప్కు ట్రాన్స్ఫర్ చేయవచ్చు.
Published Date - 08:11 PM, Wed - 18 June 25 -
AP : 17 మంది సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు
ఉత్తర్వుల ప్రకారం, 2025 ఫిబ్రవరి 1 నాటికి అవసరమైన శిక్షను అనుభవించి సత్ప్రవర్తనతో ప్రవర్తించిన ఖైదీలను షరతులతో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆయా ఖైదీల మిగిలిన శిక్షను ప్రభుత్వం మాఫీ చేయనుంది. అయితే, ఇది పూర్తిగా ఒక పునరావాస విధానంగా తీసుకోవాలని, ఖైదీలు నిబంధనలకు లోబడి ప్రవర్తించాలని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
Published Date - 06:28 PM, Wed - 18 June 25 -
Telangana : ఇజ్రాయెల్లోని ఆసుపత్రి సమీపంలో బాంబు పేలి తెలంగాణ వాసి మృతి
రవీంద్ర ఇజ్రాయెల్లో విజిట్ వీసాపై వెళ్లి, అక్కడ ఒక పార్ట్టైమ్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు. అయితే అక్కడ భద్రతా పరిస్థితులు విషమించడంతో, తాను భయాందోళనకు గురవుతున్నట్లు ఇటీవలే కుటుంబ సభ్యులకు తెలియజేశాడు.
Published Date - 04:20 PM, Wed - 18 June 25 -
Nara Lokesh : అమిత్ షాతో నారా లోకేశ్ భేటీ..రాష్ట్ర అంశాలపై కీలక చర్చలు
నారా లోకేశ్ ఈ మధ్య కాలంలో ఢిల్లీలో పరిపాలనా స్థాయి చర్చల కోసం కేంద్ర నాయకులను కలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన అమిత్ షాను ప్రత్యేకంగా కలిసి, రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సమస్యలు, అభివృద్ధి ప్రాజెక్టులు, పెట్టుబడుల అవసరం, కేంద్ర సహకారం వంటి అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం.
Published Date - 03:35 PM, Wed - 18 June 25 -
YS Sharmila : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవం : వైఎస్ షర్మిల
ఇది కొత్తగా ఎవరు రమ్మన్నా, విచారణకు హాజరవుతానని ఇప్పుడే చెబుతున్నా. ఈ వ్యవహారంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు సీరియస్గా దృష్టి సారించి విచారణ వేగవంతం చేయాలి అని షర్మిల డిమాండ్ చేశారు.
Published Date - 03:19 PM, Wed - 18 June 25 -
Pakistan : పాకిస్థాన్లో బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన జాఫర్ ఎక్స్ప్రెస్
వివరాల్లోకి వెళ్తే, క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలుకు బాంబు పేలుడు తీవ్రమైన ప్రమాదాన్ని కలిగించింది. ఐఈడీ (ఇంప్రోవైజ్డ్ ఎక్స్ప్లోసివ్ డివైస్) రకం బాంబు ట్రాక్పై అమర్చినట్లు అనుమానిస్తున్నారు.
Published Date - 02:32 PM, Wed - 18 June 25 -
Aarya : హీరో ఆర్య నివాసంలో ఐటీ సోదాలు
ఈ ఘటనపై ఆర్య స్పందించారు. చెన్నైలో మీడియాతో మాట్లాడిన ఆయన సీ షెల్ రెస్టారెంట్ వ్యాపారంతో నాకు ప్రస్తుతం ఎటువంటి సంబంధం లేదు. ఆ వ్యాపారం నిర్వహణ బాధ్యతలను నేను కొన్ని సంవత్సరాల క్రితమే ఒక స్నేహితునికి అప్పగించాను. ఇప్పుడు జరుగుతున్న ఐటీ దాడుల పట్ల నేను సహకరిస్తున్నాను అని అన్నారు.
Published Date - 01:37 PM, Wed - 18 June 25 -
FASTag annual pass : ఫాస్టాగ్ యూజర్లకు కేంద్రం శుభవార్త
ఈ పాస్ను స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15, 2025 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ వార్షిక పాస్ కోసం ప్రయాణికులు రూ. 3,000 చెల్లించాల్సి ఉంటుంది. పాస్ యాక్టివేట్ అయినప్పటి నుంచి ఏడాది పాటు లేదా 200 ట్రిప్పులు పూర్తయ్యేవరకు ఈ రెండింటిలో ఏది ముందుగా సంభవిస్తే అది పాస్ చెల్లుబాటు అవుతుంది.
Published Date - 01:21 PM, Wed - 18 June 25 -
CM Revanth Reddy : గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి
ఏషియా పసిఫిక్ ప్రాంతంలో ఇది రెండో కేంద్రం కావడం విశేషం కాగా, ప్రపంచవ్యాప్తంగా ఇది గూగుల్ సంస్థకు నాలుగవ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ కావడం గర్వకారణం. ఈ సెంటర్ ప్రారంభంతో హైదరాబాద్ నగరం గ్లోబల్ డిజిటల్ భద్రత రంగంలో కీలక పాత్ర పోషించనున్నది.
Published Date - 12:59 PM, Wed - 18 June 25 -
Hindi language : పాఠశాలల్లో హిందీ భాషపై వెనక్కి తగ్గిన మహారాష్ట్ర ప్రభుత్వం..
బుధవారం మహారాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ, హిందీ భాషను తప్పనిసరి అన్న నిర్ణయాన్ని సవరించింది. కొత్త ప్రకటనలో "తప్పనిసరి" అనే పదాన్ని తొలగిస్తూ, హిందీ బదులుగా విద్యార్థులు ఇతర భాషలను కూడా ఎంచుకునే అవకాశం కల్పించింది.
Published Date - 12:43 PM, Wed - 18 June 25 -
Bomb Threats : బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు..బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు
అప్రమత్తమైన పోలీసు శాఖ, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని పూర్తిస్థాయి తనిఖీలు చేపట్టాయి. ఈమెయిల్ సమాచారాన్ని అత్యవసరంగా పరిగణించిన అధికారులు, ప్రయాణికుల రక్షణను దృష్టిలో పెట్టుకుని వెంటనే విమానాశ్రయ ప్రాంగణంలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Published Date - 12:18 PM, Wed - 18 June 25 -
Nara Lokesh : ఉపరాష్ట్రపతితో మంత్రి నారా లోకేశ్ భేటీ
ఈ క్రమంలోనే ఈ ఉదయం నారా లోకేశ్ భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశం సుమారు గంటపాటు కొనసాగినట్లు సమాచారం. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.
Published Date - 11:28 AM, Wed - 18 June 25