Richest MLA: బీహార్లో అత్యంత ధనవంతుడైన ఎమ్మెల్యే ఎవరంటే?!
బీహార్ ఎన్నికల బరిలో అత్యంత ధనవంతుడైన అభ్యర్థిగా వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ (VIP)కి చెందిన రణ్ కౌశల్ ప్రతాప్ నిలిచారు.
- By Gopichand Published Date - 09:29 PM, Fri - 14 November 25
Richest MLA: బీహార్లో మరోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. భారతీయ జనతా పార్టీ (BJP) 91 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీహార్ను తరచుగా అత్యంత పేద, ‘బిమారు’ రాష్ట్రంగా పేర్కొన్నప్పటికీ ఈ ఎన్నికల్లో వేల కోట్ల రూపాయల (Richest MLA) ఆస్తులున్న అభ్యర్థులు బరిలోకి దిగారు. గెలిచి అసెంబ్లీకి చేరుకున్న అత్యంత ధనవంతులైన ఎమ్మెల్యేల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
కుమార్ ప్రణయ్ (BJP)
నియోజకవర్గం: ముంగేర్ అసెంబ్లీ సీటు.
విజయం: బీజేపీ అభ్యర్థి కుమార్ ప్రణయ్.. ఆర్జేడీకి చెందిన అవినాష్ కుమార్ విద్యార్థిపై 18,750 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
ఎన్నికల్లో పోటీ చేసిన అత్యంత ధనవంతులైన అభ్యర్థులలో మొదటి, రెండవ స్థానంలో ఉన్నవారు ఓడిపోవడంతో అసెంబ్లీకి చేరుకున్న వారిలో కుమార్ ప్రణయ్ అత్యంత ధనవంతుడైన ఎమ్మెల్యేగా నిలిచారు.
Also Read: Cars Expensive: పాకిస్థాన్లో సంక్షోభం.. భారత్లో రూ. 5 లక్షల కారు అక్కడ రూ. 32 లక్షలు!
అనంత సింగ్ (RJD)
నియోజకవర్గం: మోకామా సీటు.
విజయం: బాహుబలిగా పేరున్న అనంత కుమార్ వరుసగా ఏడవసారి విజయం సాధించారు. ఆయన ఆర్జేడీకి చెందిన వీణా దేవిపై 28,206 ఓట్ల తేడాతో గెలిచారు.
ఆస్తులు: అనంత సింగ్ ఎన్నికల సంఘానికి సమర్పించిన తన అఫిడవిట్లో తన ఆస్తి 100 కోట్ల రూపాయలుగా ప్రకటించారు.
డాక్టర్ కుమార్ పుష్పాంజయ్ (JDU)
నియోజకవర్గం: షేక్పురాలోని బర్బిఘా అసెంబ్లీ సీటు.
విజయం: జేడీయూ అభ్యర్థి డాక్టర్ కుమార్ పుష్పాంజయ్ విజయం సాధించారు.
ఆస్తులు: పుష్పాంజయ్ బీహార్లోని అత్యంత ధనవంతులైన ఎమ్మెల్యేలలో ఒకరు. ఆయన నికర ఆస్తి 94 కోట్ల రూపాయలు.
మనోరమ దేవి (JDU)
నియోజకవర్గం: బేలాగంజ్ అసెంబ్లీ సీటు.
విజయం: జేడీయూకు చెందిన మనోరమ దేవి, ఆర్జేడీ అభ్యర్థి విశ్వనాథ్ కుమార్ సింగ్పై 2882 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు.
ఆస్తులు: మనోరమ దేవి ధనిక నాయకులలో ఒకరిగా పరిగణించబడతారు. ఆమె ఆస్తి సుమారు 75 కోట్ల రూపాయలు.
ఓడిపోయిన అత్యంత ధనవంతుడైన అభ్యర్థి
బీహార్ ఎన్నికల బరిలో అత్యంత ధనవంతుడైన అభ్యర్థిగా వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ (VIP)కి చెందిన రణ్ కౌశల్ ప్రతాప్ నిలిచారు.
ఆస్తులు: ఆయన ప్రకటించిన మొత్తం ఆస్తి 368 కోట్ల రూపాయలు.
ఫలితం: కౌశల్ ప్రతాప్ లౌరియా స్థానం నుంచి పోటీ చేసినప్పటికీ.. బీజేపీ అభ్యర్థి వినయ్ బిహారీ చేతిలో 26,966 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.