HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Why Is Ed Silent Ktr Alleges Link Between Karnatakas Valmiki Scam Telangana Congress Leaders

KTR On Valmiki Scam: వాల్మీకి స్కామ్‌పై కేటీఆర్ సంచలనం, రేవంత్ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ??

వాల్మీకి కుంభకోణంపై ఈడీ మౌనం వహించడంపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన పలు ప్రశ్నలు సంధించారు. కాంగ్రెస్‌ను ఎవరు కాపాడుతున్నారు అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ స్కామ్ కు సంబందించినా అనేక ఆధారాలు బయటకు వచ్చినప్పటికీ తెలంగాణలో ఈడీ ఎందుకు మౌనంగా ఉంది?

  • By Praveen Aluthuru Published Date - 04:00 PM, Sat - 24 August 24
  • daily-hunt
KTR On Valmiki Scam
KTR On Valmiki Scam

KTR On Valmiki Scam: దేశవ్యాప్తంగా వాల్మీకి స్కామ్‌పై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాల్మీకి స్కామ్‌తో తెలంగాణ రాజకీయాలకు ముడిపడి ఉందని, ఈ స్కామ్ ద్వారా భారీగా డబ్బు మళ్ళించబడిందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. కర్ణాటకలో మొదలైన ఈ స్కామ్ ని సరిగ్గా విచారిస్తే తెలంగాణ ప్రభుత్వం కూలిపోతుందని కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. ఇంతకీ ఈ వాల్మీకి స్కామ్ అంటే ఏమిటి? అని నెటిజన్లు కూడా తెగ సెర్చ్ చేస్తున్నారు.

కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో వెలుగు చూసిన 187 కోట్ల విలువైన కుంభకోణం హైదరాబాద్‌కూ పాకింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికార పార్టీపై ప్రతిపక్ష బీఆర్ఎస్ సంచలన ఆరోపణలకు పాల్పడింది. తాజాగా కేటీఆర్ ఈ స్కామ్ పై లేవనెత్తిన ప్రశ్నలు సంచలనంగా మారాయి. వాల్మీకి కుంభకోణంపై ఈడీ మౌనం వహించడంపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన పలు ప్రశ్నలు సంధించారు.

కాంగ్రెస్‌ను ఎవరు కాపాడుతున్నారు అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ స్కామ్ కు సంబందించినా అనేక ఆధారాలు బయటకు వచ్చినప్పటికీ తెలంగాణలో ఈడీ ఎందుకు మౌనంగా ఉంది? ఇక్కడ కాంగ్రెస్‌ను ఎవరు కాపాడుతున్నారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు కేటీఆర్. వాల్మీకి కుంభకోణం కథ ఏంటంటే.. ఎస్టీ కార్పొరేషన్ నుండి సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా నిధులను బదిలీ చేసిందనే ఆరోపణలకు సంబంధించినది.ఎస్టీ కార్పొరేషన్ సొమ్మును ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని నకిలీ ఖాతాలకు మళ్లించినట్లు ఈడీ విచారణలో గతంలోనే తేలిందని కేటీఆర్ ఆరోపించారు. కర్ణాటకలో బయటపడ్డ వాల్మీకి స్కామ్ తో తెలంగాణ రాజకీయ నాయకులు మరియు వ్యాపారవేత్తలకు రహస్య సంబంధాలు కొనసాగాయని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ స్కామ్ లో భాగంగా హైదరాబాద్‌లోని 9 మంది బ్యాంకు ఖాతాదారులకు ఎస్టీ కార్పొరేషన్ డబ్బు రూ. 45 కోట్లు బదిలీ అయ్యాయని కేటీఆర్ ఆరోపణలు చేశారు. అంతేకాదు V6 సంస్థ యజమాని ఎవరని కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నలు సంధించారు. దీనికి సంబంధించి తెలంగాణలో సిట్, సీఐడీ, ఈడీ దాడులు చేసిన తర్వాత కూడా మీడియాలో వార్తలను ఎందుకు అటకెక్కించారని అనుమానాలు వ్యక్తం చేశారు.

 KTR Viral Post 

లోక్‌సభ ఎన్నికల సమయంలో నగదు విత్‌డ్రా చేసిన బార్‌లు, బంగారం షాపులను ఎవరు నడుపుతున్నారు? కాంగ్రెస్ పార్టీతో వీరికి సంబంధం ఏమిటి?, అలాగే కర్ణాటక అసెంబ్లీలో సీఎం సిద్ధరామయ్య ఈ స్కామ్‌లో 90 కోట్లు అవినీతి చేసినట్లు పేర్కొన్నారు. అక్కడ కర్ణాటకలో సిద్ధరామయ్యను తొలగిస్తే తెలంగాణ ప్రభుత్వం కూడా కూలిపోతుందని కర్ణాటక మంత్రి సతీష్ జారకిహోళి ఎందుకు అన్నారు? దాని అర్థం ఏమిటి? అని కేటీఆర్‌ సంచలనంగా ప్రశ్నలు సంధించారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో తెలంగాణలోని 9మందికి మద్యం, డబ్బు పంచడం కోసం రూ.44.6  కోట్లు అందాయని ఈడీ, సిట్‌ విచారణలో ప్రాథమికంగా తేలిందని కేటీఆర్ అన్నారు.

Also Read: Palla Rajeshwar Reddy : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పై కేసు నమోదు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • CM Siddaramaiah
  • ED Silent
  • karnataka
  • ktr
  • T Congress Leaders
  • telangana
  • Telugu Live Updates
  • telugu news
  • Valmiki Scam

Related News

Private Colleges

Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

చర్చలు సఫలం కావడంతో నవంబర్ 8న అనుకున్న లెక్చరర్ల ప్రదర్శన (యాక్షన్ ప్లాన్), అలాగే నవంబర్ 15న విద్యార్థులతో చేపట్టాలనుకున్న కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నట్టు పాతి సంఘం జనరల్ సెక్రెటరీ రవికుమార్ తెలిపారు.

  • Maganti Sunitha

    Maganti Sunitha: మాగంటి సునీత‌కు కేటీఆర్ మద్దతు వెనక రియల్ లైఫ్ డ్రామా?

  • Minister Uttam

    Minister Uttam: అభివృద్ధి, సంక్షేమం కోసం నవీన్ యాదవ్‌కు మద్దతు ఇవ్వండి: మంత్రి ఉత్తమ్

  • Azharuddin

    Azharuddin: మంత్రి అజారుద్దీన్‌కు కీలక శాఖలు.. అవి ఇవే!

  • Sama Rammohan Reddy

    Sama Rammohan Reddy: కేటీఆర్‌కు సామ రామ్మోహన్ రెడ్డి సంచలన సవాల్!

Latest News

  • Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!

  • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

  • Pitch Report: ఐదో టీ20లో టీమిండియా గెలుస్తుందా? పిచ్ రిపోర్ట్ ఇదే!

  • Cancer Awareness Day: క్యాన్స‌ర్ ఎంత డేంజరో తెలుసా? ఏడాదిలోనే 97 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు!

  • Congress Complaint : బండి సంజయ్ పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

Trending News

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd