Telangana: కాంగ్రెస్ సర్కారును కూల్చేందుకు KCR భారీ కుట్ర
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నట్టు బండి ఆరోపించారు.
- By Praveen Aluthuru Published Date - 08:16 PM, Sun - 14 January 24
Telangana: గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నెల రోజులు ముగిసిన నేపథ్యంలో తన పరిపాలనపై సంతృప్తి వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కాగా రానున్న లోకసభ ఎన్నికలపై పూర్తి దృష్టి పెట్టారు సీఎం రేవంత్. అయితే లోకసభ ఎన్నికల తర్వాత తెలంగాణలో అధికారం చేతులు మారబోతున్నట్టు అనుమానం వ్యక్తం చేశారు బీజేపీ నేత బండి సంజయ్.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నట్టు బండి ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారని, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకు కేసీఆర్ భారీ ఎత్తున నిధులు ఇచ్చి కోవర్టులుగా మార్చుకున్నాడని బండి సంజయ్ ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏదైనా జరగవచ్చంటూ బాంబు పేల్చారు బండి. కేసీఆర్ కదలికలపై కాంగ్రెస్ నేతలు ఓ కన్నేసి ఉంచండి.. అభివృద్ది జరగాలంటే బీజేపీ ఎంపీలను గెలిపించాలి.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలన్న బీజేపీ గెలవాలని బండి సంజయ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కరీంనగర్లో ఇవాళ మీడియాతో మాట్లాడిన సంజయ్..యాదాద్రి అక్షింతలు పంచితే అధికారంలోకి వచ్చేవాళ్లమని కేటీఆర్ అంటున్నడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ప్రభుత్వాలను కూల్చే సంస్కృతి బీజేపీకి లేదనీ బండి సంజయ్ తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకుని ప్రభుత్వాన్ని నిలుపుకోవాలని బండి సంజయ్ సూచించారు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టిన రోజు వస్తుడడంతో భారీగా సన్నాహాలు చేయాలనీ బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అదే రోజు నుంచి కేసీఆర్ పూర్తి స్థాయిలో ప్రజల ముందుకు వస్తారనే చర్చ జరుగుతోంది. వచ్చే నెల 20 తరువాత కేసీఆర్ మొదటి సరిగా గజ్వేల్ లో పర్యటించనున్నట్లు సమాచారం.
Also Read: Dream: మీకు కలలో పాము కనిపించిందా.. అయితే జరగబోయేది ఇదే?
Related News
KCR : తెలంగాణ గొంతుకపై నిషేధమా..? ఇదెక్కడి న్యాయం..?
48 గంటలపాటు ఎలాంటి ఎన్నికల ప్రచారం చేయకూడదని ఆంక్షలు విధించింది