Telangana Budget 2024: కాంగ్రెస్ బడ్జెట్ అంతా మోసమే: హరీష్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ఆరు హామీల అమలుకు అవసరమైన నిధుల కంటే చాలా తక్కువ కేటాయింపులు చేసిందని విమర్శించారు మాజీ ఆర్థిక మంత్రి హరీశ్ రావు.
- By Praveen Aluthuru Published Date - 05:06 PM, Sat - 10 February 24
Telangana Budget 2024: కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ఆరు హామీల అమలుకు అవసరమైన నిధుల కంటే చాలా తక్కువ కేటాయింపులు చేసిందని విమర్శించారు మాజీ ఆర్థిక మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రతిరోజూ ముఖ్యమంత్రి ప్రజా దర్బార్ నిర్వహిస్తుందని చెప్పింది. అయితే ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు హరీష్. రేవంత్ రెడ్డి ఒక్కరోజు మాత్రమే హాజరు కాగా కొద్దిరోజులు డిప్యూటీ సీఎం, మంత్రులు హాజరయ్యారు. ఇప్పుడు అక్కడికి ఎవరూ వెళ్లడం లేదన్నారు హరీశ్ రావు.
కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి రూ.19,746 కోట్లు కేటాయించిందని, అయితే ఈ కీలక రంగానికి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు ప్రభుత్వం రూ.82,000 కోట్లు అవసరమని చెప్పారు. రైతు భరోసా కోసమే ప్రభుత్వం రూ. 20,500 కోట్లు అవసరం పడతాయని అన్నారు. అలాగే డిసెంబర్ 9 నాటికి పంట రుణాల మాఫీకి రూ. 40,000 కోట్లు, రైతు బీమాకు రూ. 2,000, వరికి బోనస్ కోసం రూ.15,000 కోట్లు అవసరం అవుతాయని స్పష్టం చేశారు. కానీ ప్రభుత్వం రూ. 19,746 కోట్లు కేటాయించిందని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వం ఇచ్చిన ఆరింటిలో రెండు హామీలను నెరవేర్చిందని ఆర్థిక మంత్రి బట్టి చెబుతూనే ఉన్నారని, అయితే మహాలక్ష్మి పథకంలో ఉచిత బస్సు సర్వీసు మాత్రమే అమలు చేయబడిందని పేర్కొన్నారు. ఆరు హామీల్లో 13 అంశాలు ఉన్నాయని, ఇంకా 11 హామీలను నెరవేర్చాల్సి ఉందని హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగులకు 3 డీఏలు, పీఆర్సీ కేటాయింపులు, రెండు లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలకు కేటాయింపులు, మహాలక్ష్మి అమలుకు రూ.45 వేల కోట్లు, గృహ జ్యోతికి రూ.8 వేల కోట్లు బడ్జెట్లో ప్రస్తావించలేదని హరీశ్రావు తెలిపారు.
ఉచిత బస్సు పథకం వల్ల నష్టపోతున్న ఆటోడ్రైవర్ల గురించి ప్రభుత్వం ప్రస్తావించడం లేదన్నారు. మొత్తం 21 మంది ఆత్మహత్యతో చనిపోయారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బహిరంగ రుణాల ద్వారా రూ. 59,615 కోట్లు వెచ్చించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే రూ.40 వేల కోట్లు అప్పు చేస్తే గొంతెత్తిన అదే కాంగ్రెస్ ఈరోజు మనం చేసిన దానికంటే ఎక్కువ అప్పు చేస్తుందని పేర్కొన్నారు.. బిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుగా తీసుకున్న ప్రతి ఒక్క రూపాయి ఆదాయాన్ని సమకూర్చే మౌలిక సదుపాయాల వంటి రంగాలలో పెట్టుబడి పెట్టిందని ఆయన గుర్తు చేశారు. అధికారంలోకి రావడానికి తెలంగాణ ప్రజలను మోసం చేసిన రేవంత్రెడ్డి ప్రభుత్వం వారికి క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు.
Also Read: Desk Work Tips : గంటల తరబడి డెస్క్ వర్క్ చేస్తున్నారా ? హెల్తీగా ఉంచే టిప్స్ ఇవీ
Related News
Campaign : తెలంగాణ లో జై కాంగ్రెస్..ఏపీలో జై బిజెపి ..వెంకీ ‘అయ్యో.. అయ్యో ..అయ్యయ్యో ‘
తెలంగాణ లో ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన తన వియ్యంకుడు రామసహాయం రఘురామ్ రెడ్డి (Khammam MP Ramasahayam Raghuram Reddy) కోసం ప్రచారం చేసారు