D.Srinivas Passes Away: డీఎస్ మృతిపట్ల మాజీ సీఎం కేసీఆర్ సంతాపం
డి.శ్రీనివాస్ మృతిపట్ల మాజీ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. డీఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన కేసీఆర్ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు
- Author : Vamsi Chowdary Korata
Date : 29-06-2024 - 3:19 IST
Published By : Hashtagu Telugu Desk
D.Srinivas Passes Away: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీనివాస్ గతంలో ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన రెండో కుమారుడు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నుంచి ఎంపీగా ఉన్నారు. ఆయన పెద్ద కుమారుడు సంజయ్ నిజామాబాద్ మాజీ మేయర్.
డి శ్రీనివాస్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. డీఎస్ అని ముద్దుగా పిలుచుకునే డీ శ్రీనివాస్ పీసీసీ అధ్యక్షుడిగా ముఖ్యపాత్ర పోషించారని, సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీకి విశేష సేవలందించారని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. డీఎస్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. మంత్రిగా, ఎంపీగా శ్రీనివాస్ తనదైన ముద్ర వేసుకున్నారని చంద్రబాబు అన్నారు. ఆయన మృతి దిగ్భ్రాంతికరమని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. డి.శ్రీనివాస్ మృతిపట్ల మాజీ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. డీఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన కేసీఆర్ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆలాగే తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ తదితరులు మృతులకు సంతాపం తెలిపారు.
Also Read: Tariff Hikes: మొబైల్ టారిఫ్ల పెంపు.. వినియోగదారులపై ఏటా రూ. 47, 500 కోట్ల అదనపు భారం..!