HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Amit Shah Makes Key Remarks On Alliances In Telangana

Amit Shah: తెలంగాణలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

  • Author : Vamsi Chowdary Korata Date : 10-06-2026 - 3:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Amit Shah makes key remarks on alliances in Telangana.
Amit Shah makes key remarks on alliances in Telangana.

తెలంగాణలో బీజేపీ పార్టీ పొత్తులకు సంబంధించి కేంద్రమంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏ ప్రాంతీయ పార్టీతోనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఒంటరిగానే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ హైకమాండ్ దృష్టి పెట్టినట్లు స్పష్టం చేశారు. ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకోవడం వల్ల బీజేపీకి లాభం చేకూరదని భావిస్తున్న అధిష్ఠానం.. సొంతంగా ఎదగడంపై దృష్టి పెట్టింది.

తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసే ఉన్నాయంటూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు పదే పదే తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయని.. అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో జరిగిన అవినీతిపై నరేంద్ర మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని హస్తం పార్టీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. తాజాగా మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన కేంద్రమంత్రి అమిత్ షా.. తెలంగాణలో బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకునేది లేదని స్పష్టం చేశారు. ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేసి.. తెలంగాణ గడ్డపై కాషాయ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

అయితే అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సరికొత్త చర్చకు దారి తీస్తున్నాయి. ఇది ఒక సాధారణ రాజకీయ ప్రకటనగా కాకుండా.. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని విస్తరించేందుకు బీజేపీ అవలంబిస్తున్న దీర్ఘకాలిక వ్యూహానికి సంకేతంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఇతర పార్టీలపై ఆధారపడకుండా.. సొంతంగానే బీజేపీని నిలబెట్టాలని దృష్టి పెట్టినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు జరిగే ప్రతి రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేసి.. బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని తాజాగా అమిత్ షా పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాలు.. ముఖ్యంగా తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టిందని అమిత్ షా తేల్చి చెప్పినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో బీజేపీ ఎక్కువకాలం ప్రాంతీయ పార్టీలపై ఆధారపడటం వల్ల.. స్వతంత్రంగా బలాన్ని పెంచుకోలేకపోయామనే భావన బీజేపీ అగ్రనాయకత్వానికి వచ్చిందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అందుకే ఇతర పార్టీలపై ఆధారపడకుండా.. బీజేపీ బలాన్ని సొంతంగా పెంచుకోవాలని యోచిస్తున్నట్లు అమిత్ షా వ్యాఖ్యల ద్వారా అర్థం చేసుకోవాలని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల.. ఎన్నికల సమయంలో అప్పటికప్పుడు కొన్ని సీట్లు, ఇతర పార్టీలతో కలిసి అధికారంలోకి వచ్చినప్పటికీ.. దీర్ఘకాలంలో మాత్రం అవి బీజేపీ ఎదగకుండా అడ్డుకుంటున్నాయనే ఆలోచనకు బీజేపీ వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే పొత్తుల ద్వారా సీట్లు, అధికారాన్ని దక్కించుకోవడం కంటే.. కాస్త ఆలస్యమైనా సరే సొంతంగా కేడర్, ఓటు బ్యాంకును సాధించాలనే లక్ష్యంతో కమలం పార్టీ అడుగులు వేస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. జాతీయ పార్టీగా శాశ్వతంగా నిలదొక్కుకోవాలంటే.. ఇతర పార్టీలపై ఆధారపడకుండా సొంత బలంతో ఎదగాల్సిందేననే ఆలోచన బీజేపీ నాయకత్వంలో ఉందని అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణలో ఇక త్రిముఖ పోరు

అమిత్ షా చేసిన ప్రకటనతో ఇప్పుడు తెలంగాణలో త్రిముఖ పోరు నెలకొననుంది. నిజంగానే బీజేపీ పొత్తులు లేకుండా ఎన్నికల బరిలోకి దిగితే.. తెలంగాణ రాజకీయాలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోరుగా కొనసాగనున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Alliance Politics
  • bjp party
  • telangana
  • Union Home Minister Amit Shah

Related News

Heavy Rain Forecast for Telangana

తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు

తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. సోమవారం (జూన్ 8) ఇవి దక్షిణ సరిహద్దు జిల్లా అయిన జోగులాంబ గద్వాల జిల్లాను తాకాయి. రానున్న రెండు రోజుల్లో ఇవి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనికి తోడు ఉత్తరప్రదేశ్ నుండి కోస్తాంధ్ర వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా మంగళవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవ

    Latest News

    • Thalliki Vandanam: తల్లికి వందనం డబ్బులు పడేది ఆరోజే!

    • Pemmasani Chandra Sekhar: ఏపీకి కేంద్రం భారీగా నిధులు మంజూరు: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

    • Amit Shah: తెలంగాణలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

    • Amaravati: అమరావతికి కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు

    • Low BP: లో బీపీ ఉందా.. ఇలా చేస్తే దాని ముప్పు నుంచి బయటపడొచ్చు!!

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd