CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి గుడి.. మార్చి 19న భూమి పూజ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గుడి కట్టాలని కాంగ్రెస్ శ్రేణులు నిర్ణయించుకున్నాయి . రేవంత్ రెడ్డికి గుడి నిర్మాణానికి రెడ్డి సంఘం స్పాన్సర్ చేస్తోంది. మార్చి 19, 2024న నల్గొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల గ్రామంలో ఉదయం 9 గంటలకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు.
- By Praveen Aluthuru Published Date - 05:13 PM, Tue - 5 March 24
CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గుడి కట్టాలని కాంగ్రెస్ శ్రేణులు నిర్ణయించుకున్నాయి . రేవంత్ రెడ్డికి గుడి నిర్మాణానికి రెడ్డి సంఘం స్పాన్సర్ చేస్తోంది. మార్చి 19, 2024న నల్గొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల గ్రామంలో ఉదయం 9 గంటలకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆ రోజున సంఘం నాయకుడు చామల కిరణ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఆలయ నిర్మాణ నిర్ణయాన్ని సంఘం ప్రతినిధి, సూర్యాపేటకు చెందిన కాంగ్రెస్ నాయకుడు మేడి సంతోష్ పంచుకుంటూ.. రేవంత్ రెడ్డి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలతో మమేకమవుతూ ప్రజల కోరికలు తీరుస్తున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డిని తెలంగాణ దేవుడుగా భావిస్తున్నాం. ఆయనకు అండగా ఉంటాం. అందుకే ఆయనకు గుడి కట్టాలని నిర్ణయించుకున్నామని సంతోష్ తెలిపారు. కాగా భూమి పూజకు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కాంగ్రెస్ నేతలకు విజ్ఞప్తి చేశారు.
Also Read: Raghu Rama: ప్రాజెక్టులు కట్టే ప్రభుత్వం కావాలో.. ప్యాలెస్ ప్రభుత్వం కావాలో నిర్ణయించుకోవాలిః రఘురామ
Related News
Rains Alert: చల్లని కబురు.. తెలంగాణలోని 14 జిల్లాల్లో వర్షాలు
తెలంగాణ జిల్లాల్లో ఏప్రిల్ 29న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.