HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Reddy With All District Collectors

CM Revanth Reddy: రేష‌న్ కార్డుల‌పై సీఎం రేవంత్ రెడ్డి కీల‌క ఆదేశాలు!

రాష్ట్రంలో ఇప్పటివరకు 96 లక్షల 95 వేల 299 రేషన్ కార్డులు ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. గతంలో రేషన్ షాపులపై ఆసక్తి లేకపోయినా సన్న బియ్యంతో రేషన్ కార్డులకు డిమాండ్ పెరిగిందని, రేషన్ కార్డు విలువ, రేషన్ షాపు విలువ పెరిగిందని అన్నారు.

  • Author : Gopichand Date : 21-07-2025 - 7:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Revanth Reddy
CM Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణ‌లో వర్షాల పరిస్థితులు, వ్యవసాయ రంగం, రేషన్ కార్డుల పంపిణీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈరోజు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక ఆదేశాలను జారీ చేశారు. సీఎం మాట్లాడుతూ.. జూన్ నుండి ఇప్పటి వరకు 21 శాతం వర్షపాతం తక్కువగా నమోదైనప్పటికీ గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసేందుకు అన్ని విభాగాల అధికారులను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే 150 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాతావరణ సూచనలకు అనుగుణంగా కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి సమన్వయం చేసుకుని ముందే బృందాలను పంపిస్తున్నామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. పోలీస్ కమిషనరేట్‌లకు సంబంధించిన ఉన్నతాధికారులు గ్రౌండ్‌లో ఉండాలని, హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

కలెక్టర్లు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేయాలని, అజాగ్రత్తగా ఉంటే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సీఎం హెచ్చరించారు. ప్రతిరోజు తమ కార్యాచరణకు సంబంధించిన పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని సీఎస్‌ను ఆదేశించారు. జిల్లాల్లో పిడుగుపాటుతో జరిగే నష్టాల వివరాలను నమోదు చేయాలని సూచించారు. గిరిజనులు అంటువ్యాధుల బారిన పడకుండా ఐటీడీఏ ప్రాంతాల అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పీహెచ్‌సీ సెంటర్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పశువులకు సంబంధించి వెటర్నరీ విభాగం అప్రమత్తంగా ఉండాలని సీఎం అన్నారు.

Also Read: Rajya Sabha: జాతీయ సైబర్ భద్రత బలోపేతంపై రాజ్యసభలో ప్రత్యేక ప్రస్తావన!

రాష్ట్రం 2 కోట్ల 85 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి చేసి దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. వర్షాలను దృష్టిలో ఉంచుకుని సాగునీటికి సంబంధించి సరైన వాటర్ మేనేజ్‌మెంట్ ఉండాలని సూచించారు. యూరియా స్టాక్‌కు సంబంధించి ప్రతి ఎరువుల షాప్ దగ్గర స్టాక్ వివరాలను బోర్డుపై ప్రదర్శించాలని, స్టాక్ వివరాలు ఆన్‌లైన్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొందరు ఎరువుల కొరత ఉన్నట్లు కృత్రిమంగా సృష్టిస్తున్నారని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కావాల్సినంత యూరియా స్టాక్ ఉందని స్పష్టం చేశారు. ఇతర వ్యాపార అవసరాలకు యూరియాను ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతుల కంటే ఏదీ ముఖ్యం కాదని నొక్కి చెప్పారు. ఎరువులకు సంబంధించి ఫిర్యాదులకు ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

రేషన్ కార్డుల పంపిణీ

రాష్ట్రంలో ఇప్పటివరకు 96 లక్షల 95 వేల 299 రేషన్ కార్డులు ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. గతంలో రేషన్ షాపులపై ఆసక్తి లేకపోయినా సన్న బియ్యంతో రేషన్ కార్డులకు డిమాండ్ పెరిగిందని, రేషన్ కార్డు విలువ, రేషన్ షాపు విలువ పెరిగిందని అన్నారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10 వరకు అన్ని మండల కేంద్రాల్లో అధికారికంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు. శాసనసభ్యులు, జిల్లా ఇంచార్జ్ మంత్రులు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్లు కో-ఆర్డినేట్ చేసుకోవాలని, ప్రతి మండలంలో జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు పాల్గొనాలని ఆదేశించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • District Collectors
  • heavy rains
  • ration cards
  • telangana
  • TG News

Related News

Cm Revanth Key Update On Fr

Free Scooty Scheme in Telangana : ఫ్రీగా స్కూటీలపై కీలక అప్డేట్

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.70 లక్షల మంది విద్యార్థినులను లబ్ధిదారులుగా ప్రాథమికంగా గుర్తించారు. ఒక్కో స్కూటీ కొనుగోలు మరియు ఇతర ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే, ఈ పథకం అమలుకు సుమారు రూ. 1,600 కోట్లు ఖర్చవుతుందని అధికారిక వర్గాలు

  • New Amrit Bharat Express.

    తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్‌.. చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

  • Tgsrtc Bus Chage

    TGSRTC : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. బస్సు ఛార్జీల తగ్గింపు

  • Sunstroke Dies

    Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం

  • Cm Revanth Good News

    Free Electric Scooters: కాలేజీ అమ్మాయిలకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

Latest News

  • OTT : OTT ప్రేక్షకులకు ఈ వారం పండగే !!

  • LPG Gas : దేశ ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపిన రిలయన్స్ ఇండస్ట్రీస్

  • అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబో.. ఏప్రిల్ 8న టైటిల్ ప్రకటన!

  • ఇషాన్ కిష‌న్ పెళ్లి ఎప్పుడో తెలుసా?!

  • ఇండిగోకు భారీ షాక్‌.. సీఈవో ప‌ద‌వికి పీటర్ రాజీనామా!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd