Jammu And Kashmir
-
#India
Cloudburst : జమ్మూ కాశ్మీర్లో ప్రకృతి వైపరిత్యం..రియాసిలో క్లౌడ్ బరస్ట్ బీభత్సం, భారీ నష్టం
ఈ ప్రమాదంలో రెండు ఇళ్లు, ఒక పాఠశాల తీవ్రంగా దెబ్బతిన్నాయి. బాందీపురా జిల్లాలోని గురేజ్ సెక్టార్లోనూ అదే రాత్రి క్లౌడ్ బరస్ట్ సంభవించింది. తులేల్ అనే సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా భారీ వర్షాలు కురవడం ప్రజలను భయాందోళనకు గురిచేసింది.
Date : 30-08-2025 - 11:42 IST -
#India
Jammu and Kashmir : మళ్లీ మేఘ విస్ఫోటం కలకలం ..నలుగురు మృతి, సహాయ చర్యలు ముమ్మరం
మరికొంతమంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. స్థానికంగా వర్షాలు భారీగా కురుస్తుండటంతో కొండచరియలు విరిగిపడి పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. ఘాటీ సమీపంలోని జుతానా జోడ్ ప్రాంతంలో కొండలు విరిగిపడి ఓ కుటుంబం శిథిలాల కింద చిక్కుకుపోయిందని సమాచారం. సహాయక చర్యల కోసం వెంటనే ఎస్డీఆర్ఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది.
Date : 17-08-2025 - 10:42 IST -
#India
Kishtwar : కిష్త్వార్లో భయానక ప్రళయం..! మూడో రోజు కూడా కొనసాగుతున్న సహాయక చర్యలు
Kishtwar : జమ్మూ కశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో మేఘ విస్ఫోటనం (క్లౌడ్బర్స్ట్) కారణంగా ఏర్పడిన ఘోర వరదల ప్రభావం కొనసాగుతూనే ఉంది.
Date : 16-08-2025 - 4:48 IST -
#India
Cloudburst : జమ్మూకశ్మీర్లో ‘క్లౌడ్ బరస్ట్’.. 10 మంది మృతి
ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందిన మాచైల్ మాతా (చండీ) ఆలయానికి యాత్ర ప్రారంభించే బేస్ క్యాంప్. భక్తులు ఇక్కడే వాహనాలు నిలిపి, అక్కడి నుంచే నడక ప్రయాణం మొదలుపెడతారు. ఈ సందర్భంలో క్లౌడ్బరస్ట్ సంభవించడంతో, యాత్రికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వరద నీరు ఒక్కసారిగా దిగువ ప్రాంతాలకు చేరడంతో కొంతమంది తప్పించుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది.
Date : 14-08-2025 - 3:35 IST -
#India
Pakistan : భారత గగనతలం మూసివేత.. పాక్కు రూ.126 కోట్లు నష్టం
ఈ నిర్ణయం పాక్ ఎయిర్పోర్ట్స్ అథారిటీపై గణనీయమైన ఆర్థిక ప్రభావం చూపించినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. పాక్ రక్షణ మంత్రిత్వశాఖ అసెంబ్లీలో సమర్పించిన నివేదికల ప్రకారం, భారత్ తీసుకున్న నిర్ణయం వల్ల ఏప్రిల్ 24 నుండి జూన్ 20 వరకూ పాక్కు రూ.4.10 బిలియన్లు (భారత కరెన్సీలో సుమారు రూ.126 కోట్లు) నష్టం వాటిల్లింది.
Date : 09-08-2025 - 2:18 IST -
#India
Satyapal Malik : జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్నుమూత
ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, మిత్రులు, విశేషంగా స్పందిస్తూ ఆయన సేవలను స్మరించుకుంటున్నారు. 1960వ దశకంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ పట్టణంలో విద్యార్థి నాయకుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన మాలిక్, అప్పటినుంచి సుమారు ఐదు దశాబ్దాల సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో క్రియాశీలంగా వ్యవహరించారు.
Date : 05-08-2025 - 2:16 IST -
#Devotional
Jammu and Kashmir : అనంత్ నాగ్లో బయటపడ్డ 8వ శతాబ్దానికి చెందిన పురాతన హిందూ దేవతా విగ్రహాలు
తవ్వకాల్లో శివలింగాలు, పార్వతి మాత, విష్ణుమూర్తి తదితర దేవతల విగ్రహాలు వెలుగులోకి వచ్చాయి. పురాతత్వ నిపుణులు ఈ విగ్రహాలను పరిశీలించి, ఇవి కర్కోట రాజుల కాలానికి చెందినవని గుర్తించారు. ఆ కాలంలో ఈ ప్రాంతాన్ని కర్కోట వంశానికి చెందిన రాజులు పాలించారని చరిత్రకారులు పేర్కొంటున్నారు.
Date : 03-08-2025 - 11:02 IST -
#India
Encounter : కుల్గాం లో ఉగ్రవాదుల ఎన్కౌంటర్.. కొనసాగుతున్న ‘ఆపరేషన్ అఖల్’
Encounter : జమ్మూకాశ్మీర్లో మళ్లీ కాల్పుల మోత మోగింది. కుల్గాం జిల్లాలో శుక్రవారం ప్రారంభమైన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో భద్రతా బలగాలు ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టాయి.
Date : 02-08-2025 - 9:21 IST -
#Trending
jammu and kashmir : పహల్గామ్ ఉగ్రదాడి.. 100 రోజుల్లో 12 మంది ఉగ్రవాదులు హతం
ఈ దాడి జరిగిన నాటినుంచి ఇప్పటివరకు 100 రోజుల కాలంలో మొత్తం 12 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వీరిలో ఆరుగురు పాకిస్థాన్కు చెందినవారిగా గుర్తించారు. మిగిలిన ఆరుగురికి కూడా గతంలో జమ్మూ కశ్మీర్లో చోటు చేసుకున్న దాడుల్లో నేరుగా సంబంధం ఉందని నిఘా వర్గాలు వెల్లడించాయి.
Date : 01-08-2025 - 4:10 IST -
#India
Jammu and Kashmir : మరో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
పూంచ్ జిల్లాలోని జెన్ ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అనుమానాస్పదంగా కదులుతున్న ఇద్దరు వ్యక్తులను బలగాలు గుర్తించాయి. వెంటనే వారిని నిలిపివేయడానికి ప్రయత్నించగా, కాల్పులు ప్రారంభమయ్యాయి. భద్రతా బలగాలు తక్షణమే ఎదురుతిరిగి కాల్పులకు దిగడంతో తీవ్రమైన ఎన్కౌంటర్ చోటుచేసుకుంది.
Date : 30-07-2025 - 10:28 IST -
#Devotional
Amarnath Yatra 2025 : ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర..కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యాత్రను అధికారికంగా ప్రారంభించగా, గురువారం ఉదయం జమ్మూ నగరంలోని భగవతి నగర్ యాత్రి నివాసం నుంచి రెండో బృందంగా 5,246 మంది భక్తులు ప్రత్యేక భద్రతా కాన్వాయ్ల మధ్య కశ్మీర్ లోయకు బయలుదేరారు.
Date : 03-07-2025 - 10:51 IST -
#India
Rajnath Singh : ఇక పై భారత్లో ఏ ఉగ్రదాడి జరిగినా పాక్ మూల్యం చెల్లించుకోక తప్పదు : రాజ్నాథ్ సింగ్
పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఇంకా మద్దతిస్తూ ఉంటే అది తమ భవిష్యత్తును స్వయంగా బలిపశువు చేసుకుంటోందని ఘాటు హెచ్చరిక జారీ చేశారు. పాకిస్థాన్ తరఫున ఉగ్రవాదానికి మద్దతు కొనసాగితే అది అత్యంత దారుణ పరిణామాలకు దారితీస్తుంది.
Date : 21-06-2025 - 11:25 IST -
#India
Narendra Modi : జమ్మూ కాశ్మీర్లో ప్రధాని మోదీ పర్యటనకు భారీ భద్రతా ఏర్పాట్లు
Narendra Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్ పర్యటనకు ముందు రాష్ట్రవ్యాప్తంగా భద్రతా యంత్రాంగం ఉక్కుపాదం మోపింది.
Date : 05-06-2025 - 11:35 IST -
#India
Jammu and Kashmir : ఉగ్రసంస్థలతో లింకులు: ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు
ఈ ముగ్గురిలో మాలిక్ ఇష్ఫాక్ నసీర్ అనే పోలీస్ కానిస్టేబుల్, అజాజ్ అహ్మద్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు, వసీం అహ్మద్ ఖాన్ అనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేసే వ్యక్తి ఉన్నారు. వీరిపై ఉగ్రవాద సంస్థలకు సహకరించడం, ఆయుధాల రవాణా, ఉగ్ర కార్యకలాపాల్లో నేరుగా పాలుపంచుకోవడం వంటి తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
Date : 03-06-2025 - 3:52 IST -
#India
Jammu and Kashmir : ఇద్దరు లష్కరే తయ్యిబా ఉగ్రవాదుల లొంగుబాటు
ఈ ఆపరేషన్లో ఇర్ఫాన్ బషీర్ మరియు ఉజైర్ సలామ్ అనే ఇద్దరు యువకులు లష్కరే తయ్యిబా ఉగ్రవాద సంస్థ సభ్యులుగా గుర్తించబడి, వారు నిరుద్యోగం, భయంకర భవిష్యత్ను ఎదుర్కొంటున్న దృష్ట్యా, పోలీసులకు లొంగిపోయారు.
Date : 29-05-2025 - 10:32 IST