HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Closure Of Indian Airspace Pakistan Loses Rs 126 Crore

Pakistan : భారత గగనతలం మూసివేత.. పాక్‌కు రూ.126 కోట్లు నష్టం

ఈ నిర్ణయం పాక్‌ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీపై గణనీయమైన ఆర్థిక ప్రభావం చూపించినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. పాక్‌ రక్షణ మంత్రిత్వశాఖ అసెంబ్లీలో సమర్పించిన నివేదికల ప్రకారం, భారత్‌ తీసుకున్న నిర్ణయం వల్ల ఏప్రిల్‌ 24 నుండి జూన్‌ 20 వరకూ పాక్‌కు రూ.4.10 బిలియన్లు (భారత కరెన్సీలో సుమారు రూ.126 కోట్లు) నష్టం వాటిల్లింది.

  • By Latha Suma Published Date - 02:18 PM, Sat - 9 August 25
  • daily-hunt
Closure of Indian airspace.. Pakistan loses Rs. 126 crore
Closure of Indian airspace.. Pakistan loses Rs. 126 crore

Pakistan : జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగించింది. 26 మంది నిరాయుధ పర్యాటకుల ప్రాణాలు హరించిన ఈ దాడికి వ్యతిరేకంగా భారత్‌ ఆగ్రహంగా స్పందించింది. ఈ దాడికి నేపథ్యంగా పాకిస్థాన్‌పై పలు దౌత్యపరమైన, ఆర్థిక ఆంక్షలు విధించడంలో భాగంగా భారత్‌ తన గగనతలాన్ని పాక్‌ విమానాల రాకపోకలకు పూర్తిగా మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం పాక్‌ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీపై గణనీయమైన ఆర్థిక ప్రభావం చూపించినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. పాక్‌ రక్షణ మంత్రిత్వశాఖ అసెంబ్లీలో సమర్పించిన నివేదికల ప్రకారం, భారత్‌ తీసుకున్న నిర్ణయం వల్ల ఏప్రిల్‌ 24 నుండి జూన్‌ 20 వరకూ పాక్‌కు రూ.4.10 బిలియన్లు (భారత కరెన్సీలో సుమారు రూ.126 కోట్లు) నష్టం వాటిల్లింది.

Read Also: Viral Video: బస్సును ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించిన కారు బోల్తా పడింది, షాకింగ్ వీడియో

రోజుకు సగటున 100 నుంచి 150 విమానాల రాకపోకలపై ఈ ఆంక్షలు ప్రభావం చూపించాయి. ఫలితంగా మొత్తం విమాన రాకపోకలు 20 శాతం వరకు తగ్గినట్లు చెబుతోంది. దాంతో పాక్‌ విమానాశ్రయాలకు వచ్చే ఆదాయంపై తీవ్రమైన ప్రభావం పడిందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్‌ తీసుకున్న చర్యలు కేవలం గగనతల ఆంక్షలకే పరిమితం కాలేదు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరిట భారత భద్రతా దళాలు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఉగ్ర స్థావరాలపై స్పష్టమైన కౌంటర్‌ దాడులు నిర్వహించి అనేక స్థావరాలను ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో పలు కీలక ఉగ్ర మౌలిక సదుపాయాలు నేలమట్టమయ్యాయి. ఇక, పాక్‌ పౌరులకు భారత ప్రభుత్వం సుదీర్ఘంగా చూసిన ఓపికను తక్షణమే విరమించింది. భారత్‌లో ఉన్న పాక్‌ పౌరులకు దేశం విడిచిపెట్టు అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక, దశాబ్దాలుగా కొనసాగుతున్న సింధు జలాల ఒప్పందాన్ని కూడా పునఃపరిశీలనలోకి తీసుకుంది. ఈ ఒప్పందాన్ని పాక్షికంగా నిలిపివేయడమే కాదు, పాక్‌పై నీటి వనరులపై ఒత్తిడి పెంచే విధంగా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది.

భారత గగనతలాన్ని పాక్‌ విమానాలకు మూసివేయడం కారణంగా అంతర్జాతీయ విమానయాన రంగంలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. పలు విదేశీ విమానాలు భారత్‌ గగనతలాన్ని దాటి పాక్‌కు వెళ్లే మార్గాలను మళ్లించి, పొడవైన మార్గాలు ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ప్రయాణ కాలం పెరగడం, ఇంధన వ్యయం అధికమవడం వంటి సవాళ్లను తలెత్తిస్తోంది. అంతర్జాతీయంగా కూడా భారత్‌ తీసుకున్న ఈ చర్యలకు మద్దతుగా పలువురు విశ్లేషకులు స్పందించారు. ఉగ్రవాదానికి సహకరిస్తున్న దేశాలకు వ్యతిరేకంగా తగిన కౌంటర్‌ చర్యలే దీని మూలంగా అభివృద్ధి చెందాయని అభిప్రాయపడ్డారు. తాజాగా, ఈ గగనతల ఆంక్షలను భారత్‌ ఆగస్టు 24 వరకు పొడిగించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పాక్‌పై కొనసాగుతున్న ఒత్తిడి మరింత పెరిగే అవకాశముందని విశ్లేషకుల అభిప్రాయం. ఉగ్రవాదానికి నోచు లేకుండా నిర్దాక్షిణ్యంగా స్పందిస్తున్న భారత్‌ వైఖరి ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రాశంసలందుకుంటోంది.

Read Also: Jharkhand : ప‌ట్టాలు త‌ప్పిన గూడ్స్ రైలు.. వందే భార‌త్ స‌హా ప‌లు రైళ్లు ర‌ద్దు..!

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • Jammu and Kashmir
  • Pahalgam Terror Attack
  • pakistan
  • terrorist attack

Related News

IND vs SL

IND vs SL: భారత్-శ్రీలంక మధ్య కేవలం నామమాత్రపు మ్యాచ్.. టీమిండియా జ‌ట్టు ఇదేనా?

ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ భారత్, పాకిస్తాన్‌ల మధ్య సెప్టెంబర్ 28న జరుగుతుంది. భారత్ ఇప్పటికే ఫైనల్‌లో తన స్థానాన్ని ఖరారు చేసుకోగా, పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్ టికెట్‌ను ఖరారు చేసుకుంది.

  • Pithapuram

    Pithapuram : భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠాల్లో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం

  • PM Modi

    PM Modi: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ..!

  • Pakistan Bombs Its Own Peop

    Attack : సొంత ప్రజలపైనే పాక్ బాంబుల దాడి

  • Gen Z Protest Possible Ktr

    Gen Z Protest Possible In India : భారత్లోనూ జన్జ ఉద్యమం రావొచ్చు – కేటీఆర్

Latest News

  • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

  • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

  • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

  • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

  • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd