HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Restraint Is Needed On Water Disputes Cm Revanth Reddy

జల వివాదాలపై సంయమనం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి

జల వివాదాల విషయంలో కోర్టుల చుట్టూ తిరగకుండా, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పరస్పరం చర్చించుకుని పరిష్కార మార్గాలు కనుగొనాలని ఆయన పిలుపునిచ్చారు.

  • Author : Latha Suma Date : 10-01-2026 - 6:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Restraint is needed on water disputes: CM Revanth Reddy
Restraint is needed on water disputes: CM Revanth Reddy

. పరస్పర చర్చలతోనే సమస్యల పరిష్కారం

. వివాదాలు కాదు… పరిష్కారాలే లక్ష్యం

. కృష్ణా ప్రాజెక్టులు, సహకారం అవసరం

Water disputes : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. జల వివాదాల విషయంలో కోర్టుల చుట్టూ తిరగకుండా, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పరస్పరం చర్చించుకుని పరిష్కార మార్గాలు కనుగొనాలని ఆయన పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో సుజెన్ మెడికేర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది వివాదాల కోసం కాదని, శాంతియుత సహకారం కోసం అని గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా నీటి సమస్యను చూడాల్సిన అవసరం ఉందని, ప్రజల ప్రయోజనాలే ప్రభుత్వాల లక్ష్యంగా ఉండాలని స్పష్టం చేశారు.

జల వివాదాల ద్వారా రాజకీయ లాభాలు పొందాలన్న ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. “పంచాయితీ కావాలా, నీళ్లు కావాలా అని అడిగితే తెలంగాణకు నీళ్లు కావాలని చెబుతాను. అలాగే వివాదాలు కావాలా, పరిష్కారం కావాలా అని అడిగితే పరిష్కారం కావాలనే నా సమాధానం” అంటూ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు. కోర్టుల జోక్యం వల్ల సమస్యలు మరింత సంక్లిష్టంగా మారుతున్నాయని, మన మధ్యే కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలకు మేలు చేసే నిర్ణయాలే ప్రభుత్వాల నుంచి రావాలని, రాజకీయ అజెండాల కోసం నీటి సమస్యను వాడుకోవద్దని సూచించారు.

ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యక్షంగా విజ్ఞప్తి చేస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కృష్ణా నదిపై చేపట్టిన ప్రాజెక్టులకు అనుమతుల విషయంలో అడ్డంకులు సృష్టించవద్దని కోరారు. అడ్డంకుల వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతున్నాయని, దాని ప్రభావం తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వివాదాలు వద్దని, పరిష్కారాలే కావాలని మరోసారి స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు.

అదే విధంగా తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ కావాలంటే పొరుగు రాష్ట్రాల సహకారం తప్పనిసరి అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రెండు రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని వ్యాఖ్యానించారు. జల వివాదాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ఒక అడుగు ముందుకు వేస్తే, తెలంగాణ పది అడుగులు ముందుకు వేయడానికి సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. చివరగా ఆయన మాట్లాడుతూ, పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమైన రాష్ట్రంగా ఎదుగుతోందని, ప్రపంచ స్థాయి కంపెనీలకు భారతీయులే సీఈవోలుగా ఉన్నారని పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • CM Chandrababu Naidu
  • CM Revanth Reddy
  • Krishna river
  • telangana
  • Water Disputes

Related News

During Telangana Formation Day celebrations, CM Revanth Reddy delivers good news to the unemployed.

Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో.. నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్

తెలంగాణ 12వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు తీపి కబురు అందించారు. ఈ నెలలోనే TGPSC ద్వారా ఇంజనీరింగ్, విద్యా, అటవీ, టౌన్ ప్లానింగ్ శాఖల్లో మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. తమ 30 నెలల కాంగ్రెస్ పాలనలో ఇప్పటికే 67 వేల ఉద్యోగాలను పారదర్శ

  • Pavan Kalyan (1)

    JSP : హైద‌రాబాద్‌లో జ‌న‌సేన స‌భ‌కు పోలీసుల అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

  • Air Trunk Campus to be Established in Visakhapatnam! — Minister Nara Lokesh

    Nara Lokesh: విశాఖలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు..! మంత్రి నారా లోకేష్

  • CBN

    CBN : జూన్ 4 రాష్ట్ర విముక్తి దినం : చామవరం సభలో సీఎం చంద్రబాబు

  • A Decades-Old Dream Realized: South Coast Railway Zone Launched, Headquartered in AP.

    South Coast Railway Zone: నెరవేరిన దశాబ్దాల నాటి కల.. ఏపీ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ప్రారంభం

Latest News

  • Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

  • Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం

  • Krunal Pandya: ఐపీఎల్‌లో ఐదోసారి కప్పు కొట్టిన కృనాల్ పాండ్యా

  • Dental Tips: ఏ వయసులో దంతాలు బలహీనమవుతాయి? దీనికి కారణం ఏంటో తెలుసా?

  • Indian Govt: విదేశీయులకు కొత్త రూల్స్.. కేంద్ర హోంశాఖ కీలక మార్పులు

Trending News

    • Nandu’s World Nandana: మా మీద కావాలనే కుట్ర.. డబ్బులిచ్చి సోషల్ మీడియా లో దుష్ర్పచారం Nandu’ s world సంచలనం

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd