Ap Political
-
#Speed News
Kodali Nani: సంక్షేమ పాలన కొనసాగాలంటే సీఎం జగన్ గెలవాలి: కొడాలి నాని
Kodali Nani: గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి ఎన్నికల ప్రచారం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటీల రాజకీయాలు చేస్తున్న పెత్తందార్లకు, మడమ తిప్పని రాజకీయాలు చేస్తున్న సీఎం జగన్ కు జరుగుతున్న పోరాటంలో ప్రజలందరూ వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలన్నారు. సంక్షేమ పాలన ఇలాగే కొనసాగాలంటే వైసిపికి అండగా నిలవాలని కోరారు. ఎటుంటి లంచాలు లేకుండా పారదర్శకంగా పాలనను అందిస్తున్న సీఎం జగన్ కు ప్రతి ఒక్కరూ మద్దతుగా ఉంటూ ఫ్యాన్ గుర్తుపై ఓటు […]
Published Date - 11:57 PM, Tue - 9 April 24 -
#Speed News
Balakrishna: ఉగాది పండుగ ప్రజల జీవితాల్లో ఉషస్సులు నింపాలి : నందమూరి బాలకృష్ణ
Balakrishna: తెలుగువారి సంవత్సరాది ఉగాది సందర్భంగా దేశ విదేశాల్లోని తెలుగువారందరికీ క్రోది నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు నందమూరి బాలకృష్ణ. ఈ ఉగాది ప్రజలందరి జీవితాల్లో ఉషస్సులు నింపాలి. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలను అధిరోహించేలా శుభాలు కల్పించాలని అన్నారు. మన పండుగలు తెలుగు సంప్రదాయాలు, ఆచార సంస్కృతులతో అనుసంధానమై ఉండాలని అన్నారు. తెలుగువారి అస్తిత్వానికి చిరునామాగా నిలిచే వ్యవసాయ రంగం మరింత పురోభివృద్ధి సాధించాలి. ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి జీవితం […]
Published Date - 10:52 PM, Mon - 8 April 24 -
#Andhra Pradesh
Gudivada: గాజువాక బరిలో గుడివాడ అమర్ నాథ్?
Gudivada: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, సమాచార సాంకేతిక శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ భవితవ్యంపై ఉత్కంఠకు తెరపడగా, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం నియమించారు. ప్రస్తుతం మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి పార్టీ సమన్వయకర్తగా మలసాల అమర్నాథ్ను జగన్ నియమించినప్పటి నుండి అమర్నాథ్ భవితవ్యం బ్యాలెన్స్లో ఉంది. జగన్ అమర్నాథ్ని పెందుర్తి, ఎలమంచిలి లేదా చోడవరం పంపుతారని అనేక వార్తలు వచ్చాయి కానీ అది […]
Published Date - 11:30 PM, Tue - 12 March 24 -
#Speed News
Kodali Nani: జగన్ గెలుపును అడ్డుకునే శక్తి రాష్ట్రంలో ఎవ్వరికీ లేదు: కొడాలి నాని
Kodali Nani: గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత పార్టీ నేతలతో కలిసి వైఎస్ఆర్సిపి జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కొడాలి నాని, స్వర్గీయ వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి, వార్షికోత్సవ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తూ, జోహార్ వైయస్ఆర్.. జై జగన్… జిందాబాద్ కొడాలి నాని అంటూ నినాదాలు చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ పార్టీ పెట్టిన […]
Published Date - 05:18 PM, Tue - 12 March 24 -
#Speed News
AP Minister: ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ పై మంత్రి అంబటి రియాక్షన్
AP Minister: ఏపీలో నెలకొన్న పరిస్థితులపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందిస్తూ.. ఏపీలో అధికార పార్టీకి ఎదురుగాలి వీస్తోందని, ఏం చేసినా జగన్ గెలవడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. పథకాల పేరుతో ప్రజలకు డబ్బులు ఇవ్వడం ఎన్నికల్లో పనికిరాదని స్పష్టం చేశారు. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఇంతకుముందు లగడపాటి , ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ రెడీ ఎన్నికల జోస్యం చెబుతున్నారని, లగడపాటి లాగే పీకే కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటారని […]
Published Date - 11:30 AM, Mon - 4 March 24 -
#Andhra Pradesh
Pawan Kalyan: తాగేందుకు నీళ్ళు అడిగితే చంపేస్తారా..? పవన్ కళ్యాణ్ ఫైర్
Pawan Kalyan: జనసేన అధినేత, సీని నటుడు పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలకు మండిపడ్డారు. ‘‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తాగు నీళ్ళు పట్టుకొనేందుకు కూడా పార్టీల లెక్కల చూసే పరిస్థితి రావడం దురదృష్టకరం. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మల్లవరంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన శ్రీమతి బాణావత్ సామునిబాయిని ట్రాక్టర్ తో తొక్కించి చంపిన ఘటన కలచి వేసింది. ట్యాంకర్ దగ్గరకు తాగు నీరు పట్టుకొనేందుకు వెళ్తే ప్రతిపక్ష పార్టీవాళ్ళు పట్టుకోరాదు అని అడ్డుపడటం… ఇంట్లో […]
Published Date - 03:11 PM, Sat - 2 March 24 -
#Andhra Pradesh
CM Jagan: వై నాట్ 175.. కీలక సమావేశానికి సీఎం జగన్ రెడీ
CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. మరోవైపు రెండోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారు. ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా వైఎస్సార్సీపీ ముందుకు సాగుతోంది. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు మారారు. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు కేటాయిస్తారు. మరోవైపు పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేసేందుకు జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 27న మంగళగిరిలోని CK కన్వెన్షన్లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి 175 […]
Published Date - 11:19 AM, Mon - 26 February 24 -
#Andhra Pradesh
AP Politics: భీమవరం బరిలో పవన్ కళ్యాణ్, గెలుపు వ్యూహాలపై ఫోకస్
AP Politics: త్వరలో ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు సీట్ల కేటాయింపుపై ఫోకస్ చేస్తున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఎమ్మెల్యేగా భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్దమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ చీఫ్కు సొంత ఇంటిని వెతికే పనిలో పడ్డారట జనసేన నేతలు. స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ విషయంలో నాన్ లోకల్ అంటూ ప్రచారం చేస్తున్నట్టు సమాచారం. ప్రజల్లో ఆ భావన ఉండకుండా చేసేందుకు సొంత […]
Published Date - 05:50 PM, Tue - 20 February 24 -
#Andhra Pradesh
AP News: ఏపీ ప్రజలు సంతోషంగా ఉండాలంటే టీడీపీకి అధికారం ఇవ్వాలి : నారా భువనేశ్వరి
AP News: వైసీపీ నేతలు భారీగా ఓట్ల అవకతవకలకు పాల్పడుతున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. గురువారం నాడు ‘‘నిజం గెలవాలి’’ యాత్ర సత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఆమెకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మడకశిర సెంటర్లో సంఘీభావం తెలిపేందుకు వచ్చిన కార్యకర్తలతో ముచ్చటించారు. మడకశిర నియోజకవర్గం, గుడిబండ మండలం, దిన్నెహట్టి గ్రామంలో పార్టీ కార్యకర్త జి. ముత్తప్ప కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. ముత్తప్ప కుటుంబసభ్యులను […]
Published Date - 08:21 PM, Thu - 15 February 24 -
#Speed News
Kodali Nani: రోడ్డుపై గుంతలను చూపిస్తూ, అభివృద్ధి జరగలేదంటూ ప్రతిపక్షాలు చిందులు తొక్కుతున్నాయి : కొడాలి నాని
Kodali Nani: గుడివాడ మండలం మల్లాయిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే కొడాలి నాని బుధవారం పర్యటించారు.గ్రామ సెంటర్లో ఎమ్మెల్యే నానికు వైఎస్ఆర్సిపి శ్రేణులు, గజమాలలు, పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ర్యాలీగా పర్యటించిన నానికు వీధి వీధినా మల్లాయి పాలెం గ్రామస్తులు ఆత్మీయ స్వాగతం పలికారు. మల్లయిపాలెం వాటర్ వర్క్స్ వద్ద కోటి,11 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన O.H.S.R త్రాగునీటి వాటర్ ట్యాంక్ ను ఎమ్మెల్యే కొడాలి నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో […]
Published Date - 11:41 PM, Wed - 14 February 24 -
#Andhra Pradesh
AP BJP: జనాల్లోకి ఏపీ బీజేపీ, పల్లెబాట కార్యక్రమానికి శ్రీకారం
AP BJP: పల్లెకుపోదాం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం సిద్ధమైంది. ఒక పక్క కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ప్రజలు దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ రెండు రోజుల కార్యక్రమంలో భాగంగా వివిధ స్థాయిల్లోని పార్టీ బాధ్యుతలు గ్రామాలకు వెళ్లనున్నారు. పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా పాల్గొనేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం పరిధిలోని క్రోసూరు గ్రామంలో శని, ఆదివారాల్లో […]
Published Date - 06:30 PM, Sat - 10 February 24 -
#Speed News
TDP: రాజ్యసభలో టిడిపికి ప్రాతినిధ్యం లేనట్టేనా?
TDP: ప్రస్తుతం టిడిపికి ఒకే ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నారు. ఆయనే కనకమెడల రవీంద్ర. వచ్చే నెలలో ఆయన రిటైర్ కానున్నారు. దీంతో రాజ్యసభలో టిడిపికి ప్రాతినిధ్యం లేనట్టే. ప్రస్తుతం ఏపీ నుంచి మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెలాఖరున ఓటింగ్ జరగనుంది. అయితే తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.గత ఏడాది మార్చిలో ఎమ్మెల్యే కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో […]
Published Date - 09:52 AM, Thu - 8 February 24 -
#Andhra Pradesh
TDP-JSP: ఏపీలో ‘బీసీ’ పాలిటిక్స్, బీసీ ఓటర్లపై టీడీపీ-జనసేన గురి
TDP-JSP: వచ్చే ఎన్నికల్లో అనేక మంది బీసీలను బరిలోకి దింపాలని అధికార వైఎస్సార్సీపీ లక్ష్యంగా పెట్టుకున్నందున, బీసీ ఓట్లను ఆకట్టుకునేందుకు తెలుగుదేశం-జనసేన కూటమి కూడా అదే పని చేయాలని భావిస్తోంది. అభ్యర్థుల జాబితాను ఖరారు చేసేందుకు తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎన్. లోకేష్ గత మూడు రోజులుగా హైదరాబాద్లోని నాయుడు నివాసంలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. టిడి-జెఎస్ కూటమి ఇప్పటికే రెండు అసెంబ్లీ స్థానాలను – […]
Published Date - 04:37 PM, Sat - 3 February 24 -
#Speed News
YS Sharmila: వైఎస్ షర్మిల రెండు రోజుల ఏపీ పర్యటన ఖరారు
YS Sharmila: వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లో మరింత దూకుడు ప్రదర్శించనున్నారు. ఈ మేరకు వైఎస్ షర్మిల రెండు రోజుల ఏపీ పర్యటన ఖరారైంది. 20వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి ఇడుపులపాయకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు వైఎస్ ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. ఆ రోజు రాత్రి ఇడుపులపాయలో బస చేసి 21వ తేదీ ఉదయం కడప నుంచి విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు విజయవాడలో ఆమె పీసీసీ చీఫ్గా […]
Published Date - 11:50 PM, Fri - 19 January 24 -
#Andhra Pradesh
YS Sharmila : షర్మిల ఎంట్రీ ఎవరికి లాభం?
డా. ప్రసాదమూర్తి ఈసారి వైఎస్ షర్మిల(YS Sharmila) తన అన్న జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎన్నికల రాజకీయ రంగంలోకి దిగబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పగ్గాలు ఆమె చేపడుతున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఆమె రాజకీయ రంగంలో ఇప్పుడు ఒక కొత్త పాత్ర పోషించబోతున్నారు. షర్మిల ఒకప్పుడు అన్న కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి, జగన్ అధికార సోపాన అధిరోహణకు తనకు సాధ్యమైన సమస్త శక్తినీ వినియోగించింది. అయితే అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి తన సోదరి తన […]
Published Date - 07:11 PM, Fri - 19 January 24