HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Who Is Trisha Gongadi

Trisha Gongadi: ఇండియాకు వ‌ర‌ల్డ్ క‌ప్ అందించిన తెలంగాణ బిడ్డ‌.. ఎవ‌రీ గొంగ‌డి త్రిష‌?

త్రిష గొంగడి ఇటీవల అండర్ 19 మహిళల T20 ప్రపంచకప్‌లో సెంచరీ చేసి చరిత్ర సృష్టించిన భారతీయ మహిళా క్రికెటర్. 19 ఏళ్ల త్రిష గొంగడి ఈ ఘనత సాధించిన తర్వాత అండర్ 19 టీ20 ప్రపంచకప్‌లో సెంచరీ సాధించిన తొలి మహిళా బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించింది.

  • Author : Gopi Date : 02-02-2025 - 3:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Trisha Gongadi
Trisha Gongadi

Trisha Gongadi: అండర్-19 మ‌హిళ‌ల ప్ర‌పంచ‌క‌ప్‌లో భారత్ విజ‌యం సాధించ‌డానికి 19 ఏళ్ల తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (Trisha Gongadi) పోరాటం అద్భుత‌మైన‌ది అని చెప్పుకోవ‌చ్చు. 7 మ్యాచుల్లో 309 పరుగులు చేసి భారత్ ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించింది. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. కేవలం బ్యాటింగ్‌లోనే కాదు బౌలింగ్‌లోనూ సత్తా చాటి 7 వికెట్లు తీసింది. భద్రాచలంకు చెందిన త్రిష ఈ వ‌రల్డ్ క‌ప్‌లో స‌త్తా చాటి అంద‌రి చూపు త‌న‌వైపు ప‌డేలా చేసింది.

ఎవ‌రీ తెలుగమ్మాయి?

త్రిష గొంగడి ఇటీవల అండర్ 19 మహిళల T20 ప్రపంచకప్‌లో సెంచరీ చేసి చరిత్ర సృష్టించిన భారతీయ మహిళా క్రికెటర్. 19 ఏళ్ల త్రిష గొంగడి ఈ ఘనత సాధించిన తర్వాత అండర్ 19 టీ20 ప్రపంచకప్‌లో సెంచరీ సాధించిన తొలి మహిళా బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించింది. 2025 జనవరి 28న స్కాట్లాండ్‌తో జరిగిన సూపర్-6 మ్యాచ్‌లో ఆమె 59 బంతుల్లో 110 పరుగులు చేయ‌డంతో స్టార్‌గా మారిపోయింది. ఇందులో 13 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. త్రిష గొంగడి కథ యువ క్రికెటర్లకు స్ఫూర్తినిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలంకు చెందిన త్రిష గొంగడి చిన్న వయసులోనే మహిళా క్రికెట్‌లో చరిత్రాత్మక విజయాలు సాధించింది. త్రిష గొంగడి గురించి తెలుసుకుందాం.

Also Read: Dry Port In Telangana : తెలంగాణలోనూ డ్రై పోర్ట్ నిర్మాణం.. ఇంతకీ అదేమిటి ?

గొంగడి త్రిష తెలంగాణ రాష్ట్రానికి చెందిన క్రికెట్ క్రీడాకారిణి. 12 ఏళ్ల వయసులోనే హైదరాబాద్ మహిళల జట్టుకు ఎంపికైన త్రిష, చిన్న వయసులోనే బీసీసీఐ ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును కూడా గెలుచుకుంది. లెగ్ స్పిన్నర్ అయిన త్రిష, బ్యాటింగ్ లోనూ తన పవర్ హిట్టింగ్ తో రాణిస్తూ ఆల్ రౌండర్ గా పేరు సంపాదించింది. బౌలింగ్ లో అత్యధిక డాట్ బాల్స్ రికార్డును కూడా నెలకొల్పింది.

India wins Women U19 T20 WorldCup .
Trisha Gongadi is star with 44runs of 33 balls with bat and 3/15 with ball.#U19WomensWorldCup #GongadiTrisha pic.twitter.com/iVoBmBTB4K

— Shailendra Yadav (@YadavJi_KaBeta) February 2, 2025

టీమిండియా అండర్-19 క్రికెట్ జట్టుకు ఎంపికై 2022 నవంబరు 27 నుండి డిసెంబరు 6 వరకు న్యూజిలాండ్ తో జరిగిన 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడింది. మహిళల టీమ్ మాజీ కెప్టెన్, హైదరాబాదీ మిథాలీ రాజ్‌ తర్వాత తెలంగాణ నుంచి భారత జట్టులో స్థానం దక్కించుకొన్న క్రీడాకారిణిగా త్రిష నిలిచింది. 2023లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.

మూడో తరగతి చదువుతున్నప్పటి నుంచే క్రికెట్ పై ఆసక్తితో క్రికెట్ లో మెళకువలు నేర్చుకుంది. ఎనిమిదేళ్ళ వయసులోనే ప్రతిభ చూపి జిల్లా స్థాయి అండర్-16 జట్టుకు ఆడి ఉమెన్ ఆఫ్ ద సిరీస్​గా ఎంపికైంది. ఆ తరువాత 12 ఏళ్ళ వయసులో అండర్-19 జట్టుకు ఆడింది. 2021 మహిళల ప్రపంచ కప్ కోసం బీసీసీఐ అత్యుత్తమ ఆటగాళ్ళ ఎంపికకు నిర్వహించిన ప్రత్యేక టోర్నీలో ఇండియా-బి జట్టుకు ఆడి ప్రతి మ్యాచ్​లోనూ బౌలింగ్, బ్యాటింగ్​లో మంచి గణాంకాలతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి అండర్-19 వరల్డ్ కప్ మహిళల జట్టుకి ఎంపికయింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cricket
  • sports news
  • TeamIndia
  • telangana
  • Trisha Gongadi

Related News

Palm Toddy Now Available in Star Hotels Minister Ponnam Prabhakar Makes Key Announcement

Telangana: స్టార్‌ హోటళ్లలోనూ అందుబాటులోకి తాటి కల్లు : మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన

ponnam prabhakar  తెలంగాణ సంస్కృతిలో అంతర్భాగమైన గీత వృత్తికి, తాటి ఉత్పత్తులకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తాటి కల్లు, నీరాను కేవలం పానీయాలుగా కాకుండా ప్రకృతి ప్రసాదించిన ఔషధాలుగా ప్రజలకు చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తోందని అన్నారు. హైదరాబ

    Latest News

    • Online NEET Exam: వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో నీట్‌ పరీక్ష.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన

    • AP Government: ట్రాన్స్‌జెండర్ల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గుర్తింపు, రేషన్‌ కార్డులు: మంత్రి బాల వీరాంజనేయస్వామి

    • Bandi Bagheerath: బండి భగీరథ్.. స్పందించిన బాధితురాలి తల్లి సంచలన లేఖ

    • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

    • Amaravati: అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం

    Trending News

      • Petrol Prices Hike: వాహనదారులకు షాక్..పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

      • Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. చంద్రబాబు కీలక ప్రకటన..!

      • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd