HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >When Will India And Pakistan Clash On The Field In The Year 2026

2026లో కూడా భారత్- పాకిస్థాన్ మ‌ధ్య హోరాహోరీ మ్యాచ్‌లు!

జింబాబ్వే, నమీబియా వేదికలుగా 2026 ఫిబ్రవరి-మార్చి నెలల్లో అండర్-19 ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీ లీగ్ దశలో భారత్, పాకిస్థాన్ జట్లు నేరుగా తలపడనప్పటికీ సెమీఫైనల్ లేదా ఫైనల్ దశలో ఈ రెండు జట్లు తలపడే అవకాశం ఉంది.

  • Author : Gopi Date : 27-12-2025 - 7:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
India- Pakistan
India- Pakistan

India- Pakistan: భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య ఎప్పుడూ హైవోల్టేజ్ మ్యాచ్‌లు జరుగుతుంటాయి. 2025వ సంవత్సరంలో కూడా ఈ రెండు జట్ల మధ్య అనేక ఆసక్తికర పోరాటాలు జరిగాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసి పాకిస్థాన్‌ను ఓడించింది. ఆ తర్వాత ఆసియా కప్ 2025లో కూడా టీమ్ ఇండియా ఏకంగా మూడుసార్లు పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఇందులో ఫైనల్ మ్యాచ్ కూడా ఉండటం విశేషం. ఇప్పుడు 2026 సంవత్సరంలో కూడా భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య పలుమార్లు హోరాహోరీ పోరు జరగనుంది.

2026 టీ-20 ప్రపంచకప్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 15న శ్రీలంక రాజధాని కొలంబోలో భారత్- పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత జట్టు ఫిబ్రవరి 7న అమెరికాతో జరిగే మ్యాచ్‌తో తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తుంది. మొత్తం 20 జట్లు పాల్గొనే ఈ ప్రపంచకప్‌లో భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని భావిస్తోంది. గత 2024 టీ-20 ప్రపంచకప్‌లో కూడా రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమ్ ఇండియా పాకిస్థాన్‌ను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

Also Read: చెవిలో శబ్దాలు వస్తుంటే ఏం చేయాలి?

జింబాబ్వే, నమీబియా వేదికలుగా 2026 ఫిబ్రవరి-మార్చి నెలల్లో అండర్-19 ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీ లీగ్ దశలో భారత్, పాకిస్థాన్ జట్లు నేరుగా తలపడనప్పటికీ సెమీఫైనల్ లేదా ఫైనల్ దశలో ఈ రెండు జట్లు తలపడే అవకాశం ఉంది. భారత అండర్-19 జట్టు తన మొదటి మ్యాచ్‌ను జనవరి 15న అమెరికాతో ఆడుతుంది.

అదేవిధంగా మహిళల క్రికెట్‌లో కూడా భారత్, పాకిస్థాన్ మధ్య ఉత్కంఠభరిత పోరు జరగనుంది. ఐసీసీ మహిళల టీ-20 ప్రపంచకప్ 2026కు ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇస్తోంది. జూన్ 12న ప్రారంభమయ్యే ఈ టోర్నీలో జూన్ 14న బర్మింగ్‌హామ్ వేదికగా భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో రెండు జట్లకు ఇదే మొదటి మ్యాచ్ కావడం విశేషం. 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో కూడా శ్రీలంకలో జరిగిన మ్యాచ్‌లో భారత్ పాకిస్థాన్‌ను ఘోరంగా ఓడించింది. ఇలా 2026లో కూడా క్రికెట్ మైదానంలో భారత్-పాక్ సమరం అభిమానులకు కనువిందు చేయనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Asia Cup 2025
  • cricket news
  • india
  • India vs Pakistan
  • pakistan
  • sports news
  • T20 World Cup 2026

Related News

Cng Gas

CNG Price Hike :పెట్రోల్ నుంచి సీఎన్‌జీ వరకు.. వరుస ధరల పెంపులతో సామాన్యుడికి షాక్

దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరగడంతో వినియోగదారులపై భారం మరింత పెరిగింది. ఢిల్లీలో మంగళవారం నుంచి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరలను కిలోకు రూ.2 పెంచడంతో, ప్రస్తుతం కిలో ధర రూ.83.09కి చేరింది. గత 15 రోజుల్లో సీఎన్‌జీ ధరలు నాలుగోసారి పెరగడం గమనార్హం. ఇటీవల కిలోకు రూ.1 పెంచిన కొద్ది రోజులకే మరోసారి ధరలు పెంచడం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీతో పాటు దేశంలోని ప్ర

  • The Cockroach Party: The Emergence of 'Cockroach Awami Parties' in Pakistan

    Cockroach Party: బొద్దింకల పార్టీ.. పాక్‌లో కాక్రోచ్‌ అవామీ పార్టీల ఆవిర్భావం

Latest News

  • BYST : ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!

  • Telangana : రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ

  • BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

  • Kerala : కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌య్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి

  • TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd