HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >When Will India And Pakistan Clash On The Field In The Year 2026

2026లో కూడా భారత్- పాకిస్థాన్ మ‌ధ్య హోరాహోరీ మ్యాచ్‌లు!

జింబాబ్వే, నమీబియా వేదికలుగా 2026 ఫిబ్రవరి-మార్చి నెలల్లో అండర్-19 ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీ లీగ్ దశలో భారత్, పాకిస్థాన్ జట్లు నేరుగా తలపడనప్పటికీ సెమీఫైనల్ లేదా ఫైనల్ దశలో ఈ రెండు జట్లు తలపడే అవకాశం ఉంది.

  • Author : Gopichand Date : 27-12-2025 - 7:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
India- Pakistan
India- Pakistan

India- Pakistan: భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య ఎప్పుడూ హైవోల్టేజ్ మ్యాచ్‌లు జరుగుతుంటాయి. 2025వ సంవత్సరంలో కూడా ఈ రెండు జట్ల మధ్య అనేక ఆసక్తికర పోరాటాలు జరిగాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసి పాకిస్థాన్‌ను ఓడించింది. ఆ తర్వాత ఆసియా కప్ 2025లో కూడా టీమ్ ఇండియా ఏకంగా మూడుసార్లు పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఇందులో ఫైనల్ మ్యాచ్ కూడా ఉండటం విశేషం. ఇప్పుడు 2026 సంవత్సరంలో కూడా భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య పలుమార్లు హోరాహోరీ పోరు జరగనుంది.

2026 టీ-20 ప్రపంచకప్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 15న శ్రీలంక రాజధాని కొలంబోలో భారత్- పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత జట్టు ఫిబ్రవరి 7న అమెరికాతో జరిగే మ్యాచ్‌తో తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తుంది. మొత్తం 20 జట్లు పాల్గొనే ఈ ప్రపంచకప్‌లో భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని భావిస్తోంది. గత 2024 టీ-20 ప్రపంచకప్‌లో కూడా రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమ్ ఇండియా పాకిస్థాన్‌ను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

Also Read: చెవిలో శబ్దాలు వస్తుంటే ఏం చేయాలి?

జింబాబ్వే, నమీబియా వేదికలుగా 2026 ఫిబ్రవరి-మార్చి నెలల్లో అండర్-19 ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీ లీగ్ దశలో భారత్, పాకిస్థాన్ జట్లు నేరుగా తలపడనప్పటికీ సెమీఫైనల్ లేదా ఫైనల్ దశలో ఈ రెండు జట్లు తలపడే అవకాశం ఉంది. భారత అండర్-19 జట్టు తన మొదటి మ్యాచ్‌ను జనవరి 15న అమెరికాతో ఆడుతుంది.

అదేవిధంగా మహిళల క్రికెట్‌లో కూడా భారత్, పాకిస్థాన్ మధ్య ఉత్కంఠభరిత పోరు జరగనుంది. ఐసీసీ మహిళల టీ-20 ప్రపంచకప్ 2026కు ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇస్తోంది. జూన్ 12న ప్రారంభమయ్యే ఈ టోర్నీలో జూన్ 14న బర్మింగ్‌హామ్ వేదికగా భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో రెండు జట్లకు ఇదే మొదటి మ్యాచ్ కావడం విశేషం. 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో కూడా శ్రీలంకలో జరిగిన మ్యాచ్‌లో భారత్ పాకిస్థాన్‌ను ఘోరంగా ఓడించింది. ఇలా 2026లో కూడా క్రికెట్ మైదానంలో భారత్-పాక్ సమరం అభిమానులకు కనువిందు చేయనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Asia Cup 2025
  • cricket news
  • india
  • India vs Pakistan
  • pakistan
  • sports news
  • T20 World Cup 2026

Related News

New Zealand

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌.. ఫైన‌ల్‌కు చేరిన తొలి జ‌ట్టు ఇదే!

ఫిన్ అలెన్ టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశారు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ పేరు మీద ఉండేది. గేల్ 2016 టీ20 టోర్నమెంట్‌లో 47 బంతుల్లో సెంచరీ పూర్తి చేశారు.

  • Gautam Gambhir

    ముంబై వాంఖ‌డే పిచ్‌.. క్యూరేటర్‌పై గంభీర్ అస‌హ‌నం?!

  • IPL 2026

    RCB అభిమానులకు గుడ్ న్యూస్!

  • IND vs ENG

    రేపే భార‌త్‌- ఇంగ్లాండ్ సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌.. ఈ ఆట‌గాళ్ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

  • Pulses Prices Rise

    War Effect in India : సామాన్య ప్రజలకు భారీ షాక్ ..భారీగా పెరిగిన పప్పుల ధరలు

Latest News

  • Holi : అక్కడ హోలీ పండగంటే..ఆ గ్రామంలో రక్తం ప్రవహించాల్సిందే !!

  • భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు

  • గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

  • వార్‌ నష్టాలకు బ్రేక్‌.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు

  • Panchayat Funds : ‘పంచాయతీ’ నిధుల వివాదంపై సీతక్క కీలక ఆదేశాలు

Trending News

    • కొత్త సుప్రీం లీడర్ ఇత‌నే.. ఆయ‌న ఆస్తి విలువ ఎంతో తెలుసా?!

    • ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి తుది వీడ్కోలు.. ఖ‌న‌నం ఎక్క‌డంటే?

    • రెండు వేల రూపాయ‌ల నోట్లు ఇంకా ఎందుకు బయట ఉన్నాయి?

    • ఇరాన్‌ లో ఓ వైపు యుద్ధం, మరోవైపు భూకంపం

    • శబరిమలలో మహిళలకు నో ఎంట్రీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd