Virat Kohli Century: పాకిస్థాన్ను చిత్తు చేసిన భారత్.. సెంచరీతో చెలరేగిన కోహ్లీ!
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత ఆడిన పాకిస్థాన్ 241 పరుగులు చేసింది.
- By Gopichand Published Date - 09:59 PM, Sun - 23 February 25

Virat Kohli Century: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్ను ఓడించింది. ఓ వైపు టీమ్ ఇండియా సెమీఫైనల్కు దాదాపు ఖాయం చేసుకుంది. పాకిస్థాన్ వరుసగా రెండో మ్యాచ్లో ఓడి టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించింది. 100 పరుగులతో అజేయ సెంచరీ ఆడిన విరాట్ కోహ్లీ (Virat Kohli Century) భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఓటమికి పాకిస్థాన్తో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత ఆడిన పాకిస్థాన్ 241 పరుగులు చేసింది. 242 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన భారత జట్టు 45 బంతులు మిగిలి ఉండగానే ఈ లక్ష్యాన్ని సాధించింది. ఇకపోతే కోహ్లీకి వన్డేల్లో ఇది 51వ సెంచరీ.
Also Read: India vs Pakistan : ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ లో సందడి చేసిన నారా లోకేష్
ఛాంపియన్స్ ట్రోఫీ ఐదో మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్ను ఓడించింది. ఇందులో విరాట్ కోహ్లి సెంచరీ ఇన్నింగ్స్ కనిపించింది. కోహ్లి 111 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు ఉన్నాయి. అతనితో పాటు శ్రేయాస్ అయ్యర్ 56 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. 46 పరుగులు శుభ్మన్ గిల్ బ్యాట్ నుంచి వచ్చాయి.
విరాట్ కోహ్లీ 82వ సెంచరీ
వన్డే క్రికెట్లో విరాట్ కోహ్లీ 51వ సెంచరీని నమోదు చేశాడు. వన్డే మ్యాచ్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన వ్యక్తిగా విరాట్ ఇప్పటికే ముందున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అతనికిది 82వ సెంచరీ. పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో విరాట్ 111 బంతుల్లో 100 పరుగులతో అజేయంగా నిలిచాడు. విరాట్ తన ఇన్నింగ్స్లో కేవలం 7 ఫోర్లు మాత్రమే కొట్టాడంటే విరాట్ ఎంత ఓపికతో ఆడాడంటే అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యాచ్లో విరాట్ తన వన్డే కెరీర్లో 14,000 పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 241 పరుగులు చేసింది. ఇందులో సౌద్ షకీల్ 62 పరుగులు, మహ్మద్ రిజ్వాన్ 46 పరుగులు చేశారు.