IND vs AUS 2nd Test: రెండో టెస్టుకూ అయ్యర్ దూరం..?
ఫిబ్రవరి 17 నుంచి ఢిల్లీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు (IND vs AUS 2nd Test) మ్యాచ్ జరగనుంది. అయితే ఈ టెస్టులో కూడా టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్కు దూరం కానున్నాడు.
- By Gopichand Published Date - 08:56 AM, Tue - 14 February 23
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోంది. నాలుగు టెస్టుల ఈ సిరీస్లో భారత జట్టు 1-0 ఆధిక్యంలో ఉంది. వెన్ను గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన స్టార్ బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సిఎ)లో ఇప్పటికీ ‘పునరావాస’ ప్రక్రియను కొనసాగిస్తున్నాడు. శుక్రవారం నుంచి ఫిరోజ్షా కోట్లా వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు జరగనుండగా, అయ్యర్ జట్టులోకి వస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. అయ్యర్ బెంగుళూరులోని NCAలో ‘పునరావాస’ కార్యక్రమం కొన్ని వీడియోలను పోస్ట్ చేసారు. అందులో అతను శిక్షకుడు S రజనీకాంత్తో కలిసి ఉన్నారు.
ఫిబ్రవరి 17 నుంచి ఢిల్లీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు (IND vs AUS 2nd Test) మ్యాచ్ జరగనుంది. అయితే ఈ టెస్టులో కూడా టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్కు దూరం కానున్నాడు. అతను గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఈ కారణంగా రెండో టెస్టుకు కూడా దూరం కానున్నాడు. శ్రేయాస్ ఔట్ కావడంతో సూర్యకుమార్ యాదవ్కు మరో అవకాశం వస్తుందని భావిస్తున్నారు.
Also Read: Gold And Silver Price Today: బంగారం కొనాలనుకుంటున్నారా.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఇవే..!
అదే సమయంలో భారత జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయంపై కూడా వార్తలు వస్తున్నాయి. సమాచారం ప్రకారం.. జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నుండి మాత్రమే కాకుండా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ రాబోయే సీజన్ నుండి కూడా అతను దూరంగా ఉండవచ్చు. అటువంటి పరిస్థితిలో బుమ్రా తిరిగి యాక్షన్లోకి వస్తాడని చూడటానికి అతని అభిమానులు ఎక్కువ కాలం వేచి ఉండవలసి ఉంటుంది. ఈ టెస్టు సిరీస్లో తొలి మ్యాచ్ని నాగ్పూర్లో ఫిబ్రవరి 9 నుంచి నిర్వహించగా, రెండో టెస్టు ఫిబ్రవరి 17 నుంచి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిర్వహించనున్నారు. దీని తర్వాత, ఇప్పుడు సిరీస్లోని మూడో టెస్ట్ మ్యాచ్ ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో మార్చి 1 నుండి 5 వరకు జరుగుతుంది. ఈ టెస్టు సిరీస్లో చివరి మ్యాచ్ మార్చి 9 నుంచి 13 వరకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. దీని తర్వాత, ఆస్ట్రేలియా జట్టు కూడా మార్చి 17 నుండి భారత్తో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను ఆడాల్సి ఉంది.
Related News
T20 World Cup: ప్రపంచకప్ గెలిపించే మొనగాడు అతడే
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచినప్పటికీ ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. 11 మ్యాచ్ల్లో 17 వికెట్లు తీశాడు. ప్రస్తుతం బుమ్రా పర్పుల్ క్యాప్ కలిగి ఉన్నాడు. కాగా జూన్లో జరగనున్న టీ20 ప్రపంచకప్లో బుమ్రానే భారత జట్టులో కీలక ఆటగాడిగా పలువురు అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు.