Team India Jersey: టీమిండియా జెర్సీపై పాక్ పేరు.. అభిమానులు తీవ్ర ఆగ్రహం
టోర్నీ అధికారిక లోగోగా పాకిస్థాన్ పేరు ఉన్న జెర్సీని భారత్ ధరించదని గతంలో ఊహాగానాలు వచ్చాయి. అయితే BCCI సెక్రటరీ దేవ్జిత్ సైకియా తర్వాత భారత జట్టు ICC మార్గదర్శకాలను అనుసరిస్తుందని ధృవీకరించారు.
- By Gopichand Published Date - 12:15 PM, Tue - 18 February 25

Team India Jersey: పాకిస్థాన్, దుబాయ్లో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం ఎనిమిది జట్లూ కొత్త జెర్సీలతో కనిపించనున్నాయి. టోర్నీ కోసం భారత క్రికెట్ జట్టు సోమవారం తన కొత్త జెర్సీని విడుదల చేసింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, అర్ష్దీప్ సింగ్ ఈ కొత్త జెర్సీతో కనిపించారు. అయితే కొత్త జెర్సీలో (Team India Jersey) అందరి దృష్టిని ఆకర్షించింది ఆతిథ్య దేశం పాకిస్థాన్ పేరు. నిజానికి ప్రతి ఐసీసీ టోర్నీలో అన్ని జట్ల జెర్సీలపై ఆతిథ్య దేశం పేరు రాసి ఉంటుంది.
టోర్నీ అధికారిక లోగోగా పాకిస్థాన్ పేరు ఉన్న జెర్సీని భారత్ ధరించదని గతంలో ఊహాగానాలు వచ్చాయి. అయితే BCCI సెక్రటరీ దేవ్జిత్ సైకియా తర్వాత భారత జట్టు ICC మార్గదర్శకాలను అనుసరిస్తుందని ధృవీకరించారు. భారత్ జెర్సీపై పాకిస్థాన్ పేరు ముద్రించడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. ఇంతకుముందు టీం ఇండియా రెండేళ్ల క్రితం పాకిస్థాన్ వేదికగా జరిగిన ఆసియా కప్ను ఆడింది. అక్కడ ఆతిథ్య జట్టు పేరు కూడా రెండు జట్ల జెర్సీపై లేదు. భారత్ కొత్త జెర్సీపై పాకిస్థాన్ పేరు రావడంతో భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Sunday: ఆదివారం రోజు మాంసాహారం తినకూడదా.. తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
భారత్ తన అన్ని మ్యాచ్లను దుబాయ్లో ఆడనుంది
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియాను పాకిస్థాన్కు పంపేందుకు భారత ప్రభుత్వం బీసీసీఐకి అనుమతి ఇవ్వలేదని మనకు తెలిసిందే. దీని తరువాత టోర్నమెంట్ హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు పాక్ క్రికెట్ బోర్డు ముందుకొచ్చింది. దీంతో టీమిండియా దుబాయ్లో అన్ని గ్రూప్ గేమ్లను ఆడాలి. నాకౌట్కు అర్హత సాధిస్తే మిగిలిన మ్యాచ్లు కూడా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలోనే జరుగుతాయి.
ఇప్పటికే టీమిండియా.. పాక్ వెళ్లేది లేదని బీసీసీఐ తేల్చిచెప్పడంతో హెబ్రిడ్ మోడల్కు ఐసీసీ ఓటు వేసింది. పాకిస్థాన్ సైతం భారత్లో జరిగే మ్యాచ్లన్నీంటిని హెబ్రిడ్ మోడల్లోనే ఆడనుంది. రేపట్నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మొదలు కానుంది. టీమిండియా ఫిబ్రవరి 20న తొలి మ్యాచ్ ఆడనుండగా.. పాక్తో ఫిబ్రవరి 23న తలపడనుంది.